Publish Date:Feb 13, 2025
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కుళ్లు రాజకీయాలు అంతం లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి పొడగిట్టదన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉంది. అధికారంలో ఉన్న ఐదేళ్లూ రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలే లేకుండా చేసిన జగన్ సర్కార్.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా అడుగడుగునా అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తోంది.
అధికారంలో ఉన్న సమయంలో అమరావతిని నిర్వీర్యం చేసి, మూడు రాజధానుల నాటకానికి తెరలేపిన వైసీపీ కర్నూలును న్యాయరాజధాని చేస్తామంటూ హడావుడి చేసింది. కానీ ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా వేయలేదు. అమరావతి నిర్మాణం పూర్తయితే తెలుగుదేశంకు ఆ క్రెడిట్ దక్కేస్తుందన్న దుగ్ధతోనే అలా వ్యవహరించిందనడంలో సందేహం లేదు.
సరే ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సర్కార్ జగన్ హయాంలో జరిగిన విధ్వంసాలను ఒక్కటొక్కటిగా సరిదిద్దుతూ రాష్ట్రాన్ని గాడిలో పెడుతోంది. రాయలసీమ వాసుల చిరకాల వాంఛ అయిన కర్నూలులో హైకోర్టు బెంచ్ దిశగా చకచకా అడుగులు వేస్తోంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి అందుబాటులో ఉన్న భవనాల వివరాలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇప్పటికే అందజేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ మరో నాలుగైదు నెలలలో సాకారం అవుతుందని అంతా భావిస్తున్న తరుణంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలకు వైసీపీ తెరతీసింది. అమరాతి ఏపీ ఏకైక రాజధాని అని హైకోర్టు ధర్మాసనం తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే అధికారం లేదంటూ ఇద్దరు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు. కర్నాలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియను నిలిపివేయాలని ఆ పిటిషన్ లో కోరారు. తాండవ యోగేష్, తురాగా సాయిసూర్య అనే ఇద్లరు న్యాయవాదులు వేసిన ఆ పిటిషన్ వెనుక ఉన్నది వైసీపీయే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రం మొత్తం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటును స్వాగతిస్తున్నది. రాయలసీమ వాసులు తమ చిరకాల ఆకాంక్ష సాకారమౌతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో ఆ ప్రక్రియను నిలిపివేయాలంటూ పిటిసన్ దాఖలు కావడంతో సర్వత్రా వైసీపీ కుళ్లు రాజకీయాల పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పిటిషన్ వెనుక ఉన్న ఉద్దేశంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తమ హయాంలో న్యాయరాజధానిగా కర్నూలు అంటూ ఊదరగొట్టి ఆ దిశగా ఒక్క అడుగుకూడా వేయని వైసీపీ, ఇప్పుడు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటైతే తెలుగుదేశం సర్కార్ కు క్రెడిట్ దక్కుతుందనీ, రాయల సీమలో తమ ప్రతిష్ట దిగజారిపోతుందన్న భయంతోనే ఆ ప్రక్రయిను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. తమకు దక్కని క్రెడిట్ తెలుగుదేశంకు దక్కడానికి వీల్లేదన్నట్లుగా వైసీపీ తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారణను హైకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. ఈ పిటిషన్ ద్వారా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వేగంగా వేస్తున్న అడుగులకు బ్రేక్ వేయాలన్నదే వైసీపీ ఉద్దేశంగా కనిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/petition-in-highcourt-against-high-court-bench-in-kurnool-39-192854.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.