బియ్యం మాయం కేసు.. పేర్ని దంపతులకు తప్పించుకునే దారి లేదు!

Publish Date:Jan 3, 2025

Advertisement

అడ్డగోలుగా అవినీతికి పాల్పడి.. తీరా అది బయటపడేసరికి తమదేం లేదు.. అంతా తమ వద్ద పని చేసేవారే చేశారంటూ బుకాయించి తప్పించుకోవడానికి మాజీ మంత్రి పేర్ని నాని చేస్తున్న ప్రయత్నాలు ఫలింలేలా లేవు. సొంతంగా ఓ గోడౌన్ నిర్మించి దానికి పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చి.. ఇటు అద్దె సొమ్ములు తీసుకోవడమే కాకుండా, ఆ గోడౌన్ లో  పౌర సరఫరాల శాఖ నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని మాయం చేసిన కేసులో పేర్ని నాని, ఆయన సతీమణి జయసుధా పూర్తిగా ఇరుక్కున్నారు.

ఈ కేసులో పేర్ని నాని భార్యకు కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయగా, పేర్ని నానికి తాత్కాలిక ఊరట లభించింది. అయితే పేర్ని నాని సతీమణిని పోలీసుల విచారణకు సహకరించాల్సిందేనని ఆదేశించింది. దీంతో పోలీసుల నోటీసుల మేరకు ఆమె విచారణకు హాజరై.. బియ్యం మాయం విషయం తనకేమీ తెలియదనీ, గోడౌన్ వ్యవహారాలన్నీ ఆ గోడౌన్ మేనేజన్  మానస్ తేజ్ చూసుకుంటారనీ చెప్పి చేతులు దులిపేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ కేసు వ్యవహారం వెలుగులోనికి వచ్చినప్పటి నుంచీ పేర్ని నాని కూడా దాదాపుగా ఇవే మాటలు చెబుతున్నారు. గోడౌన్ వ్యవహారాలను రోజువారీగా చూసుకునే తీరిక తనకు కానీ తన భార్యకు కానీ లేదనీ, ఉద్యోగులకే ఆ బాధ్యత అప్పగించేశామని చెప్పుకొస్తున్నారు. 

నిజమే గోడౌన్ వ్యవహారాలన్నీ మేనేజరే చూసుకుంటే.. మరి మాయమైన బియ్యానికి సంబంధించి ఫెనాల్టీ సొమ్ము నాని కుటుంబం ఎందుకు చెల్లించినట్లు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేక పేర్ని నాని మీడియా సమావేశంలో తడబడ్డారు. అయినా తమ తప్పు లేదనీ, అంతా మేనేజరే చేశాడనీ చెప్పుకోవడానికి, ప్రజలను, పోలీసులను నమ్మించడానికి పేర్ని దంపతులు నానా తంటాలూ పడుతున్నారు. ఇప్పటికే గోడౌన్ మేనేజన్ మానస్ తేజ అరెస్టై జైలులో ఉన్నాడు. అతనిని విచారించిన తరువాతే పోలీసులు ఈ కేసులో ఎ6గా పేర్ని నానిని చేర్చారు. ఇంత జరిగిన తరువాత నయానో భయానో మేనేజన్ మానస్ తేజ్ చేత పేర్ని కుటుంబానికి బియ్యం మాయంతో ఏం సంబంధం లేదు, అంతా తనదే బాధ్యత అని చెప్పించినా ఆశ్చర్యపోవలసిన పని లేదు.

అయితే ఇక్కడ మాయం అయిన బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించేశారు. అక్కడ నుంచి అక్రమంగా దేశం కూడా దాటించేశారు. ఇందుకు సంబంధించి పక్కా ఆధారాలున్నాయంటున్నారు పోలీసులు. అంతే కాదు.. బియ్యం అమ్ముకున్న డబ్బులు మేనేజర్ మానస్ తేజ్ ఖాతాలోనే జమ అయ్యాయి. అయితే ఆయన ఖాతా నుంచి పేర్ని కుటుంబానికి బదిలీ అయ్యాయి. అదీ ఫోన్ పే ద్వారానే బదలీ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలూ పోలీసులు సేకరించారు. అంతా మేనేజరే చేసి, బియ్యం మాయం చేసి అమ్ముకుంటే.. ఆ సొమ్ములు పేర్ని కుటుంబానికి ఎందుకు చేరాయన్నదానికి ఆయన సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. ఎంతగా తమ తప్పు లేదనీ, తామేం పాపం ఎరుగమంటూ నంగనాచి కబుర్లు చెప్పినా వారికి సొమ్ములు ముట్టినట్లు పోలీసులు స్పష్టమైన ఆధారాలు సేకరించడంతో  పేర్ని నాని కానీ, ఆయన భార్య కానీ ఈ కేసులోంచి తప్పించుకునే అవకాశాలు లేవని న్యాయనిపుణులు అంటున్నారు.

అయినా బియ్యం మాయం బాగోతం బయటపడిన తరువాత.. కోర్టులో ముందస్తు బెయిలు వచ్చే వరకూ పేర్ని జయసుధ, పేర్ని నాని అజ్ణాతంలోకి వెళ్లిపోవడమే ఈ వ్యవహారంలో వారు అమాయకులు కాదని తేటతెల్లం చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.