జనం మరిచిపోతారన్న భయంతోనే పేర్ని ప్రేలాపనలు!

Publish Date:Jun 21, 2022

Advertisement

పేర్ని నాని జగన్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురి కాక ముందు వరకూ ఆయన మీడియా ముందు రాని రోజు ఉండేదంటే అతిశయోక్తి కాదు. నిత్యం విపక్ష తెలుగుదేశంపై విమర్శలు గుప్పించడంలోనూ, పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేయడంలోనే ఆయన అందరి కంటే ముందుండే వారు. మంత్రి పదవి పోయిన తరువాత అలకో, ఉక్రోషమో, నిరాశో, నిర్వేదమో తెలియదు కానీ.. పలుకే బంగారమన్నట్లుగా మారిపోయారు. దానికి తోడు మచిలీపట్నం నియోజకవర్గంలో ఎంపీతో వర్గ పోరు. ఇక పేర్ని పనైపోయిందన్న గుసగుసలూ వైసీపీలో బాగానే వినిపించాయి.

మౌనంగా ఉంటే కనుమరుగైపోతామని భావించారో ఏమో పేర్కొ ఒక్క సారి గొంతు సవరించుకున్నారు. అలా ఇలా కాదు.. మళ్లీ నెనుకటి పేర్ని కనిపించేలా? ఈ సారి కూడా ఆయన తనకు అచ్చొచ్చినట్లుగా పవన్ కల్యాణ్ లక్ష్యంగా విమర్శలకు పదును పెట్టారు. పనిలో పనిగా తెలుగుదేశంపైనా కొన్ని విమర్శలు విసిరారు అది వేరే సంగతి. అధినేతకు ఏం మాట్లాడితే నచ్చుతుందో బాగా తెలిసిన వైసీపీ నేతలలో పేర్ని నాని ఒకరు. అందుకే ఆయన చాలా కాలం గ్యాప్ తరువాత మీడియా ముందుకు వచ్చినా ఆయన విమర్శలలో వెనుకటి పదును తగ్గలేదనిపించేలా మాట్లాడారు. ఎంపీ వల్లభనేని బాలశౌరితో విభేదాల కారణంగా పార్టీలో గుర్పింపునకు ముప్పు వచ్చిందన్న అదురో, బెదురో తెలియదు కానీ తాజా ప్రెస్ మీట్ లో ఆయన విపక్షాలపై విమర్శలతో చెలరేగిపోయారు.

బలవన్మరణానికి పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున చెక్కులంటూ జనసేనాని రాజకీయం చేస్తున్నారన్నారు. రైతుకు జగన్ చేస్తున్న సహాయంతో, మేలుతో పోలిస్తే జనసేనాని చేస్తున్నది ఏ పాటి అంటూ చెరిగి పారేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలూ అన్నదాతను అదుకునే విషయంలో జగన్ ను ఫాలో అవుతున్నారంటూ గత కొంత కాలంగా ఆయన పూర్తిగా మరచిపోయిన అధినేత భజనను ఈ మీడియా సమావేశంతో మరో సారి మొదలెట్టేశారు. అంతే కాదు ఒంటరి పోరుకు సిద్ధపడాల్సిందిగా జనసేనానిని రెచ్చగొట్టేందుకే తన వాగ్ధాటిని ఉపయోగించారు. పనిలో పనిగా చంద్రబాబు హయాంలో రైతులకు పంటనష్టపరిహారం చెల్లించలేదన్న ఆరోపణలను మళ్లీ తెరపైకి తీసుకువచ్చి ముందు వాటిని ప్రశ్నించమని పవర్ స్టార్ కు సూచించారు.

అంతే కాకుండా రైతుల కోసం జగన్ అండగా నిలబడ్డారని కితాబిచ్చేశారు. రైతుకు అండగా జగన్ నిలబడినట్లు గతంలో చంద్రబాబు ప్రభుత్వం కానీ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కానీ నిలబడ్డాయా అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ దృష్టిలో ప్రశ్నించడమంటే జగన్ ను విమర్శించడమేనని నిష్ఠూరమాడారు.   మాట మీద నిలబడటం జనసేన హిస్టరీలోనే లేదన్న పేర్ని నాని 2014లో పార్టీ పెట్టి చంద్రబాబుకు ఓటేయమన్న పవన్ కల్యాణ్, 2019లో చంద్రబాబు వ్యతిరేక ఓటు చీలకుంటే జగన్ కు మేలు జరుగుతుంది కనుకనే ఎన్నికల్లో నిలబడుతున్నామని చెప్పుకున్నారు.

ఇప్పుడేమో జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదు కనుక తెలుగుదేశంతో కలుస్తానంటున్నారు. అంటూ ఎద్దేవా చేశారు.  ఎన్ని చేసినా పేర్ని గారికి వైసీపీలో గతంలోలా ప్రాధాన్యత లభిస్తుందా అంటే పార్టీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. పూర్తాగా కనుమరుగైపోతానన్న భయంతోనే పేర్ని మీడియా ముందు విపక్షాలపై విరుచుకుపడుతున్నారని, ఆయన ఇప్పుడు కొత్తగా చెప్పిందేమీ లేదనీ పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
భేటీ అనంతరం అంబటి రాంబాబు ముద్రగడపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన పట్టుదల, రాజకీయాలలో నిజాయితీ, విలువలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను ప్రస్తుతించారు. తమ మధ్య జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ, సామాజిక అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు.
తెలుగువన్ వాస్తవ వేదిక సంచికలో ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఈ నేపథ్యంలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎవరికీ అంత సులువుగా కనిపించడం లేదు.
అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదనీ, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ-అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
భార్య పేరుతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. చిత్తూరు జిల్లాలో తమ పీఎల్ఆర్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసం ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోబోమని విస్పష్టంగా పేర్కొంది.
ఈ నెల 28 రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమెదించడమే. ఇది ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగుగా భావించవచ్చు.
భారతంలో ద్రౌపదిని వివస్త్రను చేయడానికి కౌరవులు ప్రయత్నిస్తే.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగల్చడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే కురుక్షేత్రంలో కౌరవులు ఓడిపోయినట్టుగా.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది.
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు
1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న నంబర్ 24, అక్బర్ రోడ్ భవనాన్ని ఈ నెల 28 లోగా అంటే శనివారం లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది.
జ‌గ‌న్ లెవ‌న్ పై మీమ్స్ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. పంజాబ్ కింగ్స్ లెవ‌న్ లాగా.. జ‌గ‌న్స్ లెవ‌న్ అనే పేరు మీద మీమ్స్ వెల్లువెత్తాయి. ఇక తాజాగా కొత్త పార్లమెంట్ భవనంలో వైసీపీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కేటాయించినది కూడా 11వ నెంబర్ రూమే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.