వైసీపీ రుణమాఫీ హామీ.. నమ్మెదెలా అంటున్నజనం !

Publish Date:Oct 8, 2023

Advertisement

ఏపీలో ఎన్నికలకు నిండా ఆరేడు నెలల సమయం కూడా లేదు. ఇప్పటికే ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. సంక్షేమ పథకాల పేరుతో పప్పుబెల్లాల్లా సొమ్ములు పంచినట్లే పంచి అంతకు అంతా   ముక్కు పిండి వసూలు చేస్తున్నారన్న అసంతృప్తి ప్రజలలో వ్యక్తమవుతోంది. భూతద్దం పెట్టి చూసినా అభివృద్ధి కనిపించని పరిస్థితుల్లో ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలా అని వేచి చూస్తున్నారు. గత ఎన్నికలకు ముందు వైసీపీ ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చారో లెక్కలేసి మరీ ప్రతిపక్షాలు ఏకిపారేస్తున్నాయి. జనం కూడా అదే చెబుతున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా? జగన్ సర్కార్ ను సాగనంపుదామా అని ఎదురు చూస్తున్నారు.  

అంతకు ముందు తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్, పావలా వడ్డీ రుణాల పథకాలను కూడా నీరుగార్చి కేవలం బటన్ నొక్కడం, దీనికి దానికి అని లేకుండా పన్నులు బాది పీక్కుతినడమే పనిగా పెట్టుకోవడంతో ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ నరకం నుండి విముక్తి లభిస్తుందా అని పంటి బిగువున బాధను దిగమింగి ఉంటున్నారు. అయితే వైసీపీ మాత్రం మరోసారి ఏం చెప్పి ప్రజలను నమ్మించాలా అని కొత్త కొత్త పథకాల ప్రకటనపై దృష్టి పెట్టింది.

 జగన్ ఈసారి తన ఎన్నికల ప్రణాళికలో రైతుల రుణ మాఫీ  హామీ అస్త్రాన్ని ప్రయోగించాలని భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తామనే హామీతో వైసీపీ ఈసారి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నదంటున్నాయి. నిజానికి 2014 ఎన్నికల్లో టీడీపీ ఈ హామీ ఇచ్చింది. నాడు 87 వేల కోట్ల రైతుల రుణాల మాఫీ చేయాల్సి ఉండగా టీడీపీ నాలుగేళ్ళ పాలనలో నలభై వేల కుటుంబాలకు పైగా పూర్తి రుణమాఫీ చేసింది. మొత్తం కుటుంబాలకు మూడు విడతలను చెల్లించింది. యాభై వేల లోపు రుణాలను ఒకేసారి మాఫీ చేసిన టీడీపీ ప్రభుత్వం అంతకు పైగా ఉన్న రుణాలను ఐదు విడతలలో మాఫీ చేసే టార్గెట్ పెట్టుకుంది. మూడు విడతల రుణాలను చెల్లించగా చివర ఏడాదిలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం, అప్పటి ప్రతిపక్షం వైసీపీతో చేతులు కలిపిన బీజేపీ అడుగడుగునా టీడీపీ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టే ఏకైక లక్ష్యంతో  చివరి రెండు విడతల రుణమాఫీ  విడుదల చేసినా ఎలక్షన్ కమిషన్ ను అడ్డం పెట్టుకొని  లబ్ది దారులకు  ఆ సొమ్ములు అందకుండా చేయగలిగింది.  

కాగా, ఇప్పుడు వైసీపీ అదే రుణమాఫీ నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని చూస్తుంది. అయితే, నినాదం ఏదైనా, హామీ ఏదైనా జగన్ ఇస్తే ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. గత ఎన్నికల మ్యానిఫెస్టోలోని సంపూర్ణ మద్యపాన నిషేధం, అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు, ఇల్లు, ఇంట్లో ఎంత మంది వృద్దులు ఉన్నా పింఛన్లు, ఎంత మంది పిల్లలు ఉన్నా అమ్మ ఒడి, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి.. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో హామీలను జగన్ ప్రభుత్వం విస్మరించింది. జగన్ మాట తప్పను అంటూనే మాట తప్పారు. మడమ తిప్పను అంటూనే మడమ తిప్పారు.ఇచ్చిన హామీలలో కొన్ని అమలు చేసినా  అమలు చేసినా సవాలక్ష కొర్రీలు పెట్టి ప్రజలను మానసిక వేదనకు గురి చేసిన జగన్, ఇప్పుడు ఎన్నికల ముంగిట రైతు రుణమాఫీ అంటూ చెబితే   నమ్మి అధికారం కట్టబెట్టేందుకు జనం సిద్ధంగా లేరు. గత ఎన్నికల ముందు అరచేతిలో స్వర్గం చూపేలా వాగ్దానాలు కురిపించి అధికారంలోకి వచ్చాకా నరకం చూపుతున్న జగన్ ను ఎలా నమ్ముతామని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మాట్లాడితే విశ్వసనీయత, విశ్వసనీయత అనే జగన్ మోహన్ రెడ్డి ఊరూరూ తిరిగి ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసి ఇప్పుడు కొత్త హామీలంటూ మరో సారి ఎన్నికల ముందు చెబితే  ప్రజలు ఎలా నమ్మతారని పరిశీలకులు కూడా అంటున్నారు.

నాలుగేళ్ళ పాలనలోనే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజలను పీల్చి పిప్పి చేసిన జగన్.. మరో ఐదేళ్లు అధికారమిస్తే రాష్ట్రాన్ని ఇంకెంత అధోగతి పాలు చేస్తారు, ప్రజలను ఇంకెంతగా పీల్చి పిప్పి చేస్తారో అనే భయం సర్వులలోనూ వ్యక్తం అవుతోంది. ఇప్పటికే రాష్ట్ర ఆదాయాన్ని, ప్రభుత్వ ఆస్తులను, దేవాలయాల భూములను, చివరికి లిక్కర్ మీద ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు చేసిన జగన్.. మరోసారి అధికారమిస్తే ప్రజల ఆస్తులను కూడా తాకట్టు పెట్టడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అరాచకాలు, అక్రమాలును ప్రశ్నిస్తే దాడులు, కేసులతో రాష్ట్రం అంతటా అందరిలో అభద్రతా భావం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే ఇచ్చిన ఒక్క ఛాన్స్ చాలని జనం నిర్ధారణకు వచ్చేశారు. ఈ సమయంలో వైసీపీ ఎన్ని ఆశలు చూపినా.. ఏ హామీలు ఇచ్చినా జనం విశ్వసించే పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.