Publish Date:Nov 30, 2024
తెలంగాణలో అధికారంలో ఉన్న పదేళ్లలో ఎన్నడూ తలవనైనా తలవని దీక్షా దివస్ కు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత ఎక్కడ లేని ప్రాధాన్యతా ఇచ్చింది. పదేళ్ల అధికారంలో ఉన్నా తెలంగాణ సాధన కోసం సావు నోట్లో కేసీఆర్ తలపెట్టిన రోజును మాత్రం ఎన్నడూ పెద్దగా స్మరించుకోలేదు. అయితే ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన తరువాత, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కారణమైన తెలంగాణ ఆత్మను కూడా పార్టీలో లేకుండా చేసిన తరువాత.. ఔను రాష్ట్రంలో రెండో సారి అధికార పగ్గాలు అందుకున్న తరువాత కేసీఆర్ తెలంగాణ వాదాన్ని వదిలేశారు.
జాతీయ రాజకీయాలపై మక్కువ పెంచుకుని ఢిల్లీ పీఠంపై కన్నేసి పార్టీ పేరులోంచి తెలంగాణను తీసేశారు. తెలంగాణ సాధన కోసం 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం సాగించిన టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేశారు. ఆ మార్పుతోనే తెలంగాణ వాదంతో ఉన్న అనుబంధం పుటుక్కున తెగిపోయింది. బీఆర్ఎస్ పేరుతో ఎన్నికలకు వెళ్లి అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు విపక్ష పాత్రలో కూడా ఆ పార్టీ అనుకున్న స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోతోంది.
ఈ నేపథ్యంలోనే తమ పార్టీ గతంలో చేసిన త్యాగాలు, పోరాటాలను ప్రజలకు గుర్తు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ సాధన కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన నవంబర్ 19వ తేదీని దీక్షా దివస్ పేర ఘనంగా నిర్వహించింది. రాష్ట్రం నలుమూలలా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు, అమర వీరుల స్మారక చిహ్నాల వద్ద సభలు, సమావేశాలు ర్యాలీలు, ప్రార్థనలతో హడావుడి చేశారు. కరీంనగర్లోని అలుగునూరులో జరిగిన సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. సిద్దిపేటలో పార్టీ సీనియర్ నేత , మాజీ మంత్రని హరీశ్ రావు పాల్గొన్నారు. ఇక గత కొన్ని నెలలుగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న ఎమ్మెల్సీ కవిత కూడా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో పాగ్లొన్నారు. ర్యాలీలోనూ కనిపించారు.
ఇంత వరకూ బానే ఉంది కానీ, నిజంగా ఈ కార్యక్రమానికి ప్రజలలో గుర్తింపు రావాలంటే ముఖ్యనేత, పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ సాధన కోసం సావు నోట్లో తలపెట్టి వచ్చానని చెప్పుకునే కేసీఆర్ పాల్గొనాలి. కానీ ఆయన ఎక్కడా కనిపించలేదు. ఫామ్ హౌస్ వదిలి బయటకు రాలేదు. దీంతో బీఆర్ఎస్ దీక్షా దివస్ అంటూ ఎంతగా హంగామా చేసినా జనం పెద్దగా పట్టించుకోలేదు. అది పూర్తిగా ప్రజలకు సంబంధం లేని పార్టీ కార్యక్రమంగా మిగిలిపోయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/people-distance-from-brs-deeksha-divas-39-189257.html
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.