ప్రజలు‘ముందస్తు’గానే నిర్ణయించేశారా?

Publish Date:Jun 17, 2023

Advertisement

వైసీపీ అధినేత‌, ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, గ‌త కొంత కాలంగా 175 సీట్ల జపం చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో 151 సీట్లు సాధించాం..ఈ సారి 175 సాధించ‌టం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు అని పార్టీ స‌మావేశాల్లో త‌ర‌చూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఇటీవల కాలంలో అయన స్వరంలో మార్పు కనిపిస్తోంది.  వై నాట్ 175, వై నాట్ కుప్పం .. అంటూ బీరాలు పోయిన జగన్ రెడ్డి ఇప్పుడు  అంత  ధీమాగా లేరు.

నిజానికి నిజం ఏమిటో ఆయనకు తెలుసు  తెలుగుదేశం యువ తేజం నారా లోకేష్  సాగిస్తున్న యువగళం పాదయాత్రకు  రాయలసీమలో లభించిన ప్రజాదరణ వైసీపీ వెన్నులో వణుకు పుట్టించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత గడ్డ కడప జిల్లాలో యుగళం పాదయాత్రలో  గళమెత్తి గర్జించిన ప్రజాగళం వైసీపీలో ప్రకంపనలు సృస్తిస్తోంది. అవును  స్థానిక వైసీపీ నాయకుల్లోనే కాదు  ఏకంగా జగన్ రెడ్డి గుండెల్లోనే  యువగళం గుబులు పుట్టిస్తోంది. నిజానికి  క్షేత్ర స్థాయి పరిస్థతి ఏమిటో  జగన్ రెడ్డికి తెలుసు  అయినా పార్టీ క్యాడ‌ర్ లో ఉత్సాహం  నింపేందుకో..నేత‌ల్లో స్పీడ్ పెంచేందుకో కుప్పంలోనూ గెలుస్తామని గొప్పలు పోతున్నారు.

అయితే క్షేత్ర‌స్థాయిలో మాత్రం అందుకు భిన్న‌మైన పరిస్థితులు ఉన్నాయ‌నే విష‌యం ఆ పార్టీ నేత‌లు కూడా అంగీక‌రిస్తున్నారు.   తాజాగా, తెలుగుదేశం పార్టీ అధినేత మూడు రోజుల కుప్పం పర్యటనలో ప్రజలు ఆయనకు మరో మరు బ్రహ్మరధం పట్టారు. కాంగ్రెస్, వైసేపీ నాయకులు,  క్యాడర్ క్యూకట్టి మరీ టీడీలో చేరారు.  మూడు రోజుల  పర్యటనలో భాగంగా రెండో రోజు చంద్రబాబు సమక్షంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన కీలక నేత, కాంగ్రెస్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సురేష్ తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. అలాగే వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ నుంచి వందలాది మంది కార్యకర్తలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు.

మరోవంక  నాలుగు పదులకు పైగా రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ రాజకీయాలను అవపోసన పట్టిన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. ‘రాబోయే ఎన్నికల్లో కుప్పంలో గెలుస్తామని జగన్‌ చెబుతున్నాడు. కుప్పంలో గెలవడం తర్వాత సంగతి ముందు పులివెందులను కాపాడుకో  అని సీఎం జగన్మోహన్‌రెడ్డికి చంద్రబాబు సూచించారు. పులివెందులలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేలిపోయిందన్నారు. జగన్‌ ప్రజల బిడ్డ కాదని.. సమాజానికి కేన్సర్‌ గడ్డని చంద్రబాబు ఎప్పుడో  తేల్చి చెప్పారు. 

నిజం. చంద్రబాబు నాయుడు చెప్పింది  అక్షర సత్యం. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులను గమనిస్తే, జగన్ రెడ్డి నమ్ముకున్న తాయిలాలు  తిరగబడుతున్నాయి. ఇంత కాలం కేంద్ర ప్రభుత్వం అందించిన ప్రత్యక్ష, పరోక్ష సహకారంతో నెట్టుకొచ్చిన జగన్ రెడ్డి కి ఇక పై కేంద్ర సహకరం మునుపటిలా ఉండదనే విషయం స్పష్టమైంది. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ వెనక కేంద్ర హోం మంత్రి అమిత్ షా  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అరాచక, అవినీతి పాలనను ఎండగడుతూ చేసిన వ్యాఖ్యలు విమర్శలు,ముందున్నది క్రొకోడైల్ ఫెస్టివల్ అనే విషయాన్ని స్పష్టం చేశాయి. అంతే కాదు  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా ఇక పై కేంద్ర ప్రభుత్వం, బీజేపీ సహకరం   ఉండక పోవచ్చని తమ గుండెల్లోని భయాన్ని బయట పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో మరో గత్యంతరం లేక జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళతారనే ఊహగానాలు  వినిపిస్తున్నాయి. 

అయితే ముందస్తుకు వెళితే  ముందుగా అధికారాన్ని కోల్పోవడం తప్ప ప్రయోజనం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని, ఒకసారి చేసిన ఒక్క ఛాన్స్  తప్పు రెండోసారి చేసిది లేదని ఎక్కడికక్కడ ప్రజలు, ఎవరికి వారు తీర్మానం చేసుకుంటున్నారని అంటున్నారు. అందుకే  ముందస్తుకు వెళ్లి ముందుగా  చేతులు కాల్చుకోవడం కంటే  గడవు వరకు బండి లాగించడమే మేలని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

అలాగే  కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు పేర్కొన్నట్లుగా, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులే కాదు  శాంతి భద్రతల పరిస్థితి కూడా అధ్వాన స్థితికి చేరింది. విశాఖలో ఎంపి కుటుంబ సభ్యులను కిడ్నాప్, ఇందుకు తాజా ఉదాహరణ.  సామాన్య ప్రజల సంగతి పక్కన పెట్టినా రాష్ట్రంలో ఎంపీ కుటుంబానికి రక్షణ లేని పరిస్థితిని చూస్తున్నాం. అందుకే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళతారా లేదా అనే విషయం ఎలా ఉన్నా అరాచక, అవినీతి పాలనకు పర్యాయపదంగా మారిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనకు ఉద్వాసన పలకాలనే ముందస్తు నిర్ణయం అయితే ప్రజలు తీసుకున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు.

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.