Publish Date:Jun 19, 2022
కాస్తంత తలనొప్పిగా వుందంటే ఓ అరకప్పు టీ తాగడానికే ఆలోచిస్తాం. చిన్నపాటి మాత్ర కంటే గుక్కెడు టీ తాగడానికి యావత్ మానవ లోకం సరదాతో కూడిన నిర్ణయం తీసుకుంటుంది. టీ తాగడంలో మజాయే వేరప్పా సిద్దప్పా.. అంటారు ఉద్యోగులంతా. అదీ నిజమే. టీకి కాలం, సమయం, ప్రాంతాలతో బొత్తిగా సంబంధం లేదు. కానీ చిత్రంగా పాకిస్తాన్ కొత్త ప్రభుత్వంలో ప్రణాళికా శాఖ మంత్రి అహసాన్ ఇక్బాల్ మాత్రం ఆ దేశ ప్రజలకు బాబూ కాస్తంత టీ పిచ్చి తగ్గించుకోండ్రా నాయనలారా! వీలైతే మొత్తంగా టీ తాగడం మానేయండి అని సందేశ మిచ్చారట! దయచేసి టీ అలవాటుకు దూరం కండి అంటే బతిమాలుకుంటున్నారు. వినడానికి చాలా చిత్రంగా వున్నా, పాక్ మంత్రి సీరియస్ గానే దేశ ప్రజలను టీ మానేయ మంటున్నారు.
ఇమ్రాన్ ఖాన్ను ఏప్రిల్లో గద్దె దించేసిన తర్వాత ప్రధాని అయిన సాబాజ్ షరీఫ్ దేశ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరుస్తానని ప్రమాణం చేసేరు. టీ సంగతేమిటంటే.. ప్రపంచ దేశాల్లో టీని దిగుమతిని చేసుకుంటున్న దేశాల్లో పాకిస్తాన్ మొదటి స్థానంలో వుంది. 220 మిలియన్ల జనాభా వున్న పాక్ లో తరతమ భేదాలు లేకుండా అందరూ రోజుకూ కనీసం మూడు కప్పుల టీ తాగుతుంటారట.
ప్రతీయేటా ఈ టీ దిగుమతికి ప్రభుత్వ సెంట్రల్ బ్యాంక్ నిధుల నుంచి సుమారు 600 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. అలాంటపుడు ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ఆర్ధిక స్థోమతను బలపరిచేందుకు ఇలాంటి చిన్నపాటి త్యాగాలు చేయాల్సిందే నని మంత్రి గారి ఉపదేశం. ఆయన సలహా వినడానికి తమాషాగా వున్నప్పటికీ ఒక విధంగా ఈ మాత్రం త్యాగనికి ప్రజలు సిద్ధపడక తప్పదేమో! అందునా ఆర్ధిక పరిస్థి తులు సరిగా లేనపుడు! కానీ మంత్రిగారి విన్నపం పట్ల ప్రభఉత్వం తీవ్ర నిరసననే ఎదుర్కొంటోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/people-25-137985.html
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.