Publish Date:Jun 19, 2022
కాస్తంత తలనొప్పిగా వుందంటే ఓ అరకప్పు టీ తాగడానికే ఆలోచిస్తాం. చిన్నపాటి మాత్ర కంటే గుక్కెడు టీ తాగడానికి యావత్ మానవ లోకం సరదాతో కూడిన నిర్ణయం తీసుకుంటుంది. టీ తాగడంలో మజాయే వేరప్పా సిద్దప్పా.. అంటారు ఉద్యోగులంతా. అదీ నిజమే. టీకి కాలం, సమయం, ప్రాంతాలతో బొత్తిగా సంబంధం లేదు. కానీ చిత్రంగా పాకిస్తాన్ కొత్త ప్రభుత్వంలో ప్రణాళికా శాఖ మంత్రి అహసాన్ ఇక్బాల్ మాత్రం ఆ దేశ ప్రజలకు బాబూ కాస్తంత టీ పిచ్చి తగ్గించుకోండ్రా నాయనలారా! వీలైతే మొత్తంగా టీ తాగడం మానేయండి అని సందేశ మిచ్చారట! దయచేసి టీ అలవాటుకు దూరం కండి అంటే బతిమాలుకుంటున్నారు. వినడానికి చాలా చిత్రంగా వున్నా, పాక్ మంత్రి సీరియస్ గానే దేశ ప్రజలను టీ మానేయ మంటున్నారు.
ఇమ్రాన్ ఖాన్ను ఏప్రిల్లో గద్దె దించేసిన తర్వాత ప్రధాని అయిన సాబాజ్ షరీఫ్ దేశ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరుస్తానని ప్రమాణం చేసేరు. టీ సంగతేమిటంటే.. ప్రపంచ దేశాల్లో టీని దిగుమతిని చేసుకుంటున్న దేశాల్లో పాకిస్తాన్ మొదటి స్థానంలో వుంది. 220 మిలియన్ల జనాభా వున్న పాక్ లో తరతమ భేదాలు లేకుండా అందరూ రోజుకూ కనీసం మూడు కప్పుల టీ తాగుతుంటారట.
ప్రతీయేటా ఈ టీ దిగుమతికి ప్రభుత్వ సెంట్రల్ బ్యాంక్ నిధుల నుంచి సుమారు 600 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. అలాంటపుడు ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ఆర్ధిక స్థోమతను బలపరిచేందుకు ఇలాంటి చిన్నపాటి త్యాగాలు చేయాల్సిందే నని మంత్రి గారి ఉపదేశం. ఆయన సలహా వినడానికి తమాషాగా వున్నప్పటికీ ఒక విధంగా ఈ మాత్రం త్యాగనికి ప్రజలు సిద్ధపడక తప్పదేమో! అందునా ఆర్ధిక పరిస్థి తులు సరిగా లేనపుడు! కానీ మంత్రిగారి విన్నపం పట్ల ప్రభఉత్వం తీవ్ర నిరసననే ఎదుర్కొంటోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/people-25-137985.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు