Publish Date:Jun 19, 2022
కాస్తంత తలనొప్పిగా వుందంటే ఓ అరకప్పు టీ తాగడానికే ఆలోచిస్తాం. చిన్నపాటి మాత్ర కంటే గుక్కెడు టీ తాగడానికి యావత్ మానవ లోకం సరదాతో కూడిన నిర్ణయం తీసుకుంటుంది. టీ తాగడంలో మజాయే వేరప్పా సిద్దప్పా.. అంటారు ఉద్యోగులంతా. అదీ నిజమే. టీకి కాలం, సమయం, ప్రాంతాలతో బొత్తిగా సంబంధం లేదు. కానీ చిత్రంగా పాకిస్తాన్ కొత్త ప్రభుత్వంలో ప్రణాళికా శాఖ మంత్రి అహసాన్ ఇక్బాల్ మాత్రం ఆ దేశ ప్రజలకు బాబూ కాస్తంత టీ పిచ్చి తగ్గించుకోండ్రా నాయనలారా! వీలైతే మొత్తంగా టీ తాగడం మానేయండి అని సందేశ మిచ్చారట! దయచేసి టీ అలవాటుకు దూరం కండి అంటే బతిమాలుకుంటున్నారు. వినడానికి చాలా చిత్రంగా వున్నా, పాక్ మంత్రి సీరియస్ గానే దేశ ప్రజలను టీ మానేయ మంటున్నారు.
ఇమ్రాన్ ఖాన్ను ఏప్రిల్లో గద్దె దించేసిన తర్వాత ప్రధాని అయిన సాబాజ్ షరీఫ్ దేశ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరుస్తానని ప్రమాణం చేసేరు. టీ సంగతేమిటంటే.. ప్రపంచ దేశాల్లో టీని దిగుమతిని చేసుకుంటున్న దేశాల్లో పాకిస్తాన్ మొదటి స్థానంలో వుంది. 220 మిలియన్ల జనాభా వున్న పాక్ లో తరతమ భేదాలు లేకుండా అందరూ రోజుకూ కనీసం మూడు కప్పుల టీ తాగుతుంటారట.
ప్రతీయేటా ఈ టీ దిగుమతికి ప్రభుత్వ సెంట్రల్ బ్యాంక్ నిధుల నుంచి సుమారు 600 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. అలాంటపుడు ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ఆర్ధిక స్థోమతను బలపరిచేందుకు ఇలాంటి చిన్నపాటి త్యాగాలు చేయాల్సిందే నని మంత్రి గారి ఉపదేశం. ఆయన సలహా వినడానికి తమాషాగా వున్నప్పటికీ ఒక విధంగా ఈ మాత్రం త్యాగనికి ప్రజలు సిద్ధపడక తప్పదేమో! అందునా ఆర్ధిక పరిస్థి తులు సరిగా లేనపుడు! కానీ మంత్రిగారి విన్నపం పట్ల ప్రభఉత్వం తీవ్ర నిరసననే ఎదుర్కొంటోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/people-25-137985.html
రెండు పార్టీలు రెండు తెలంగాణ తల్లి విగ్రహాలు, రెండు జాతీయ గీతాలంటూ తీవ్రంగా కొట్టుకు ఛస్తున్నాయి కదూ. అయితే వీరు పెట్టుకుని నిజానికి పెట్టుకోవల్సింది వైయస్ విగ్రహానికి. వైయస్ ఆనాడు చంద్రబాబును ఏమీ చేయలేక.. చిన్నారెడ్డి అనే ఒక కాంగ్రెస్ నాయకుడి ద్వారా నలభై మంది వరకూ పోగేసి.. ఢిల్లీకి పంపారు.
తెలంగాణ రాజ్భవన్లో మిస్వరల్డ్-2025 విజేత ఓపల్ సుచాత, ముగ్గురు రన్నరప్లకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు ఏర్పాటు చేశారు
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయటపెడతాని రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఏపీలో జలరవాణా ద్వారా అధిక పెట్టుబడులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, జల రవాణా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బి.సి. జనార్థన్ రెడ్డి అన్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో పాలనా భవనాల నిర్మాణానికి అనుమతులు మంజూరైనట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రూ.3,673 కోట్ల పనులకు ముఖ్యమంత్రి అనుమతులు మంజూరు చేశారు.
విశాఖలో ఉర్సా కంపెనీకి రూపాయికి ఎకరం భూమి కట్టబెట్టినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ అధినేత జగన్కు మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు.
దేవుడి దయవల్ల 2024లో ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరటం సీఎం చంద్రబాబు వద్ద పని చేయటం చాలా సంతోషంగా ఉందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు
రూ.2 వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఈ నోట్లు పూర్తిస్థాయిలో తమకు చేరలేదని పేర్కొంది. ప్రజల వద్ద .ఇంకా రూ.6181 కోట్ల విలువైన నోట్లు చెలామణీలోనే ఉన్నట్లు గుర్తించింది.
ఊరు మీద పడి అమాయకులను వేధిస్తూ, దౌర్జన్యాలకు పాల్పడుతున్న రౌడీ బ్యాచ్ కు పోలీసులు ఇచ్చిన ట్రీట్ మెంట్ ప్రజాస్వామ్యాన్ని కాలరాసిందంటూ వైసీపీ గుండెలు బాదేసుకోవడం ఏమిటి అని జనం విస్తుపోతున్నారు. ఔను ఐతానగర్ లో ఇటీవల ముగ్గురు యువకులకు పోలీసులు ఇచ్చిన ఓపెన్ లాఠీ ట్రీట్ మెంట్ పట్ల జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాళేశ్వరం విచారణపై బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జూన్ 5న కేసీఆర్ కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. కీలక పరిణామం చోటుచేసుకుంది. తాను జూన్ 5న విచారణకు హాజరు కాలేనని.. జూన్ 11న తప్పక హాజరవుతానంటూ తాజాగా గులాబీ బాస్, కమిషన్కు సమాచారం అందజేశారు.
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు ఇప్పట్లో పార్టీ పగ్గాలు అప్పగించే యోచన కేసీఆర్ కు లేదని పరోక్షంగా చెప్పారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెనాలి పర్యటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణలో ఇప్పుడు రాజకీయాలన్నీ కల్వకుంట్ల కవిత చుట్టూనే తిరుగుతున్నాయి. తండ్రికి రాసిన లేఖ లీక్ తరువాత జరిగిన పరిణామాలు ఆమె బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకోవడం ఖాయమన్న సంకేతాలనే ఇస్తున్నాయి. ఇప్పటికే ఆమె తనదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ.. వాటిలో ఎక్కడా బీఆర్ఎస్ ప్రస్తావన, ప్రమేయం లేకుండా జాగ్రత్త పడుతున్నారు.