తొలి నుంచీ తేడానే..ఈ కొలికిపూడి
Publish Date:Jul 23, 2025
Advertisement
చాలా మంది ఇతడొక అమరావతి ఉద్దారకుడని, టీడీపీ అనుంగు మిత్రుడనీ ఫీలవుతుంటారుగానీ.. అందులో ఎంత మాత్రం నిజం లేదా? ఆ మాటకొస్తే ఇతడు బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డిని చెప్పుతో కొట్టిందే టీడీపీకి కొమ్ముకాస్తున్నావన్న మాటకు. కానీ ఇతడ్ని తప్పుగా అర్ధం చేసుకుని.. టికెట్ ఇచ్చి ఆదరించింది టీడీపీ. ఇప్పుడు చూస్తే ఇతడు తిరువూరులో పార్టీ, కేడర్ ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడు. కొలికిపూడి గెలిచింది ఎమ్మెల్యేగా తొలిసారి. కానీ ఇతడి కేంద్రంగా వరుస వివాదాలు. ఒక పార్టీ లైన్ కి ఎలా కట్టుబడి ఉండాలి? ఆ మాటకొస్తే ఒక ఎమ్మెల్యేగా ఎలా బిహేవ్ చేయాలి? కేడర్ ఎందుకంత కీలకం? ఇవేవీ ఇతడికి తెలిసినట్టూ లేవు. తనకవి వర్తించనే వర్తించవన్న కోణంలోనూ బిహేవ్ చేస్తుంటాడు. తనకు నోరుంది, ఆపై సోషల్ మీడియా ఉందన్న చందంగా వైసీపీ ప్రోకామెంట్లు చేస్తుంటాడు. మొన్నటికి మొన్న ఒక రోడ్డు విషయంలో ఒక ఎస్టీ మహిళపై దాడి వ్యవహారం పార్టీకి చెడ్డ పేరు తెచ్చేదే. ఆపై వైన్ షాపుల విషయంలో గతానికి ప్రస్తుతానికి తేడా చెప్పి.. పార్టీని ఇరుకున పెట్టడం. ఆపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో హంగామా. క్రమశిక్షణా కమిటీ ముందుకు రావడంలోనూ బిల్డప్పు. ఇలా ఇతడి గురించి చెబుతూ పోతే మెరిట్స్ కన్నా, డీ మెరిట్స్ ఎక్కువ. అప్పటికీ చంద్రబాబు ఇవ్వాల్సిన వార్నింగులన్నీ ఇచ్చారు. కానీ ఎంత మాత్రం మార్పు వచ్చినట్టే కనిపించదు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సైతం ఎన్నో సూచనలు చేశారు. అయినా సరే అదే వితండ వాదన. ఆపై వర్ల రామయ్యతోనూ చెప్పించి చూశారు. ప్రయోజనం శూన్యం. బేసిగ్గా తిరువూరు ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ వైసీపీకి పట్టు ఎక్కువ. దీంతో తాను టీడీపీలో ఉండటం కన్నా వైసీపీలోకి వెళ్లడం వల్లే ఎక్కువ లాభం అని అప్పుడే పెద్ద ఆరిందా లాగా లెక్కలేసుకుని.. ఇదిగో ఇవాళ పెద్దిరెడ్డిని వెళ్లి కలిశాడు. అటు టీడీపీలో అయితే ఇతడి తాకిడి తట్టుకోలేక స్థానిక టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పుడు వైసీపీలోకి వెళ్లేలా కనిపిస్తున్నాడు. అంటే అక్కడి వైసీపీ కేడర్ కూడా అష్టకష్టాలు పడ్డానికి ముందుగానే సిద్ధపడాలన్న మాట వినిపిస్తోంది. మరద్దే.. కొలికిపూడి మార్క్ కెలుకుడంటే అని మాట్లాడుకుటున్నారు ఇరు పార్టీ నేతలు.
http://www.teluguone.com/news/content/peddireddy-ramachandra-reddy-39-202591.html





