అడవిదొంగ పెద్దిరెడ్డి.. విజిలెన్స్ నివేదిక వెల్లడి!

Publish Date:Feb 10, 2025

Advertisement

వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబీకులందరూ అటవీ భూముల ఆక్రమణలో నిండా మునిగినట్లే. చట్టాలను పూర్తిగా ఉల్లంఘించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు అందరూ దశాబ్దాలుగా అటవీ భూములను ఆక్రమించి పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారని విజిలెన్స్ నివేదిక  తేటతెల్లం చేసింది. అటవీ భూముల ఆక్రమణ, పర్యావరణ విధ్వంసానికి పాల్పడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబీకులపై అటవీ సంరక్షణ చట్టాల మేరకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని సిఫారసు చేసింది. ఆ నివేదికలో పెద్దిరెడ్డి ఆయన కుటుంబీకుల మీద ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది అన్న అంశంపై విజిలెన్స్ నివేదిక వివరంగా పేర్కొంది. పెద్దిరెడ్డి, యఆయన కుటుంబ సభ్యులపై విజిలెన్స్ నివేదిక సిఫారసుల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమౌతోంది. 

పుంగనూరు నియోజకవర్గంలోని మంగళం పడవల్లో పెద్దిరెడ్డి అటవీ భూముల కబ్జా వ్యవహారం వెలుగులోనికి వచ్చింది. అటవీ భూమిని ఆక్రమించి విలాసవంతమైన భవనం నిర్మించిన విషయం తేటతెల్లమైంది. అయితే అడవి మధ్యలో తాను భవనం నిర్మించిన భూమిని తాను ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేశానని, అక్కడ నిర్మించిన భవనం పనివాళ్ల కోసమని పెద్దరెడ్డి చెప్పారు.  దీనిపై విచారణ జరిపిన అధికారులు ప్రజాధనంతో రోడ్డు వేసుకోవడం దగ్గర నుంచి మొత్తం ఎంత భూమి వారి అధీనంలో ఉంది.. ఎంత భూమి కబ్జా చేశారో లెక్కలు తేల్చారు. మొత్తం వివరాలతో నివేదిక సమర్పించారు.

పెద్దిరెడ్డి .. ఆయన కుటుంబం చేసిన అరాచకాలు ఇప్పుడు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.  జగన్ అడ్డగోలు విధానాలను అంతకంటే అడ్డగోలుగా అంగీకరించి ఆచరించి, ఆయన చెప్పినట్టలా చేసిన పెద్దరెడ్డి అందుకు ప్రతిఫలంగా దోపిడీకి లైసెన్స్ తీసున్నారా అన్నట్లుగా అన్ని రకాల నిబంధనలనూ తుంగలోకి తొక్కి యథేచ్ఛగా కబ్జాల పర్వం కొనసాగించారు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం దోపిడీకి కాదే భూమి అనర్హం అన్నట్టుగా పెద్దిరెడ్డి ఆయన కుటుంబీకులూ రెచ్చిపోయారు. పెద్దిరెడ్డి కబ్జాల పర్వంలో మునిగి తేలుతూ ఉంటే.. ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిమద్యం స్కాం మొత్తాన్ని తన కనుసన్నలలో నిర్వహించారు.  ఇలా కబ్జాలతోనూ, కుంభకోణాలతోనూ అడ్డగోలుగా సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని చిత్తూరుల తెలుగుదేశం పార్టీని ఉనికి కూడా లేకుండా చేయాలన్న కుట్రలను అమలు చేశారు. ఇందులో భాగంగానే  చంద్రబాబుపై  రాళ్ల దాడులు, హత్యాయత్నాల వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మొత్తం మీద పెద్దరెడ్డి అటవీ భూముల ఆక్రమణ కేసుల్లోనూ, ఆయన కుమారుడు మిధున్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో బయట పడే అవకాశలు పెద్దగా కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.