జనసేనాని పవన్ రాజకీయ దారంతా చీకటేనా?..

Publish Date:Jul 5, 2022

Advertisement

ఇల్లేమొ దూరం..దారంతా చీకటి....రోడ్డంతా గతుకులు... 2019 ఎన్నికలకు ముందు జనసేనాని పవన్ కల్యాణ్ తరచుగా ఈ డైలాగ్ చెప్పేవారు. ఆ డైలాగ్ తన రాజకీయ ప్రస్థానం సుదీర్ఘంగా సాగాల్సి ఉందన్న అర్ధంతో చెప్పినది.  అప్పట్లో అది చాలా పాపులర్ అయ్యింది. రాజకీయాలలో ప్రశ్నించడానికి,  పిడికిలి బిగించి ప్రశ్నించేందుకు నేనున్నాను అంటూ ఒక బలమైన శక్తిగా రాజకీయ ప్రవేశం చేసిన పవన్ కల్యాణ్.. ఆ ప్రస్థానంలో గమ్యం లేని బాటసారిగా మారిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

సినిమాల ద్వారా పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న ఆయన రాజకీయ నేతగా ప్రజాభిమానం పొందేందుకు ప్రశ్నించడం ఒక్కటే సరిపోదనీ, ఆ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలనీ, లేదా తానే స్వయంగా సమాధానం కావాలని తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. తన రాజకీయ లక్ష్యం ఏమిటి? పార్టీని ఏ దిశగా నడిపించదలచుకున్నారు అన్న విషయంలో పవన్ లో ఇప్పటికీ స్పష్టత కానరావడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

పాచి పోయిపోయిన లడ్లు అంటూ 2019 ఎన్నికల ముందు బీజేపీపై ఘాటు విమర్శలు సంధించిన పవన్ కల్యాణ్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ బీజేపీతోనే జట్టు కట్టడాన్ని ఆయన ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నిస్తున్నారు.ఏపీలో బీజేపీ మిత్రపక్షంగా పవన్ కు జరిగిన మేలు ఏమీ లేకున్నా సినిమాలలో హీరోగా ప్రశంసలందుకున్న ఆయన బీజేపీ మిత్రుడిగా మాత్రం కమేడియన్ స్థాయికి రాజకీయాలలో పరిమితమయ్యారని అంటున్నారు.

2014 ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీలకు మద్దతుగా నిలిచిన పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల సమయానికి ఒంటరి పోరుకే మద్దతు మొగ్గు చూపారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఆయన నిర్ణయం వైసీపీకి నెత్తిన పాలు పొసింది. ఆ పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టింది. ఆ తరువాత మూడేళ్లూ పవన్ కల్యాణ్ బీజేపీతో మిత్రపక్షంగా ముందుకు సాగారు. 2024 ఎన్నికలలో ప్రభుత్వ ఓటును చీలనివ్వనని ప్రకటించి రాష్ట్రంలో ఎన్నికల పొత్తులకు తెరతీశారు. అయితే ఆ తరువాత కొద్ది రోజులకే.. ఇంత కాలం ఇతర పార్టీలను భుజాన మోశాను ఈ సారి ఆ పార్టీలు తనను భుజాన మోయాలంటూ తన రాజకీయ ఆకాంక్ష ఏమిటన్నది చాటారు.

అయితే అంతకు ముందు మూడేళ్ల పాటు బలమైన తన ఇమేజ్ ను, క్యాడర్ ను కేంద్రంలో అధికారంలో ఉన్నదన్న ఒకే ఒక కారణంతో కమలం పార్టీకి దాసోహం చేశారు. జాతీయ స్థాయి పార్టీ అయిన బీజేపీ ప్రాంతీయ పార్టీలతో మైత్రికి సుముఖత వ్యక్తం చేసేది పాము కప్పను మింగినట్ల ఆ జాతీయ పార్టీలను ఆక్రమించడానికే తప్ప వాటి అభివృద్ధికి దోహదపడేందుకు కాదన్న వాస్తవాన్ని గ్రహించడంలో పవన్ విఫలం అయ్యారు. 2109 ఎన్నికలలో కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించిన ఆ పార్టీకి కమలం పార్టీ ఎందుకు ప్రాధాన్యత ఇస్తుందన్న విషయాన్ని గ్రహించలేకపోయారు. సరే ఎప్పుడైతే ఆయన బీజేపీ- జనసేన కూటమి సీఎం అభ్యర్థిగా తనను తాను ప్రకటించుకున్నారో అప్పుడే బీజేపీ ఆయనను దూరం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

దీంతో ఇప్పుడు గతంలో తాను చేసినది రాజకీయ తప్పిదమని బయటకు చెప్పలేక, లోపల దాచుకోలేక మింగలేక, కక్కలేక సతమతమౌతున్నారు. పవన్ రాజకీయ నిర్ణయాలు స్థిరంగా ఉండవని ఆయనపై తొలి నుంచీ ఒక ముద్ర ఉంది. ఇన్నేళ్ల తరువాత అంటే ఆయన జనసేన పార్టీని స్థాపించిన ఇంత కాలం తరువాత కూడా అది అలాగే కొనసాగుతోంది.

అందుకు తగ్గట్టే ఆయన ప్రసంగాలూ ఉంటున్నాయి. ముఖ్యమంత్రి కావడం తన లక్ష్యం కాదని చెబుతూనే జనం కోరుకుంటే అవుతాను అంటారాయన.  ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగి జనసేన అధికారం చేజిక్కించుకునేంత సీన్ లేదని గ్రహించడం వల్లనే తాజాగా పలు సందర్భాలలో ఓట్ల కోసం పుట్టిన పార్టీ జనసేన కాదు అని ఆయనే చెబుతుంటే ఎవరు మాత్రం ఆయన పార్టీకి ఓట్లు వేయాలనుకుంటారు. ప్రశ్నిస్తా, సమస్యల పరిష్కారానికి పాటు పడతా అంటే రాజకీయ పార్టీ కాకుండా ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఉండాల్సింది అని ఆయన పార్టీలో క్రియాశీలంగా తిరుగుతున్న కార్యకర్తలే ఇప్పుడు ఆయనను నిందిస్తున్నారు.

By
en-us Political News

  
ఏపీకి జాతీయ హోదా దక్కుతుందో, లేదో గానీ, కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా వుండగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసుకి మాత్రం జాతీయ హోదా దక్కేట్టుంది.. అదెలాగయ్యా అంటే...
ఆంధ్రప్రదేశ్‌లో ఓటు వెల్లువెత్తింది. కొత్త ఓటర్లు, యువత తమ భవిష్యత్ ఓటుతోనే ముడిపడి ఉందని భావించారు. అందుకే పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి తరలివచ్చారు. ఇక మధ్యతరగతి, దిగువ మధ్య తరగలి వారు తమ ఆస్తులకు రక్షణ ఉండాలంటే ఓటేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చడమే మార్గమని నిర్ణయించుకున్నారు.
అవసరం ఉన్నా లేకున్నా మైకుల ముందుకు వచ్చి తెలుగుదేశం నాయకులపై ఇష్టానుసారం నోరు పారేసుకునే వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతల గొంతులు పోలింగ్ పూర్తయిన క్షణం నుంచీ మూగబోయాయి. ఎక్కడా వారి మాట వినిపించడం లేదు. వారికి మాత్రమే అలవాటైన భాషలో ప్రసంగాలు చేయడం లేదు.
కిందపడ్డా నాదే పైచేయి అంటారు చూశారా.. అలా వుంది నగరిలో మటాష్ అవబోతున్న రోజా వ్యవహారం. మొదటగా నగరి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. గత పదేళ్ళుగా మీ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసిన రోజాని మీ ఓటు ద్వారా సాగనంపారు.
ఐకాన్ స్టార్, మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ సరిగ్గా ప్రచారం ముగిసే ముందు రోజు నంద్యాల వైసీపీ అభ్యర్థి రవిచంద్రారెడ్డి నివాసానికి వెళ్లి మరీ ఆయనకు మద్దతు ప్రకటించడం రాజకీయవర్గాలతో సహా మెగా అభిమానుల్లోనూ పెద్ద చర్చకు తెరలేపింది.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గెలుస్తాడు అని చెబుతున్నప్పుడు కేసీఆర్ ముఖంలోగానీ, కేటీఆర్ ముఖంలోగానీ కనిపించే పైశాచిక ఆనందాన్ని చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు.
పోలింగ్ శాతం పెర‌గ‌డంతో వైసీపీ మ‌రింత డీలా ప‌డింది. ఎందుకంటే 70 శాతానికి మించి పోలింగ్ న‌మోదైతే.. అది ప్ర‌తిప‌క్షానికి క‌లిసి వ‌స్తుంది. మ‌రోవైపు.. యువ‌త పోటెత్తారు. కొత్త‌గా ఓటు హ‌క్కు ద‌క్కించుకున్న‌వారు కూడా ఈ సారి ఓటేశారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీలో జోష్ క‌నిపించ‌డం లేదు. ఇదిలా వుంటే.. మ‌రోవైపు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష కూట‌మి పార్టీ టీడీపీలో మాత్రం జోష్ క‌నిపిస్తోంది.
వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయా.. ఆ పార్టీ నమ్ముకున్న గూండాయిజం వైసీపీకి గులుపు ఉన్న స్థానాలలో కూడా ఓటమిని శాశించిందా? అంటే జనం ఔననే అంటున్నారు. పరిశీలకులు కంసుడి పతనానికి ముందు కనిపించిన శకునాలను నిన్నటి పోలింగ్ లో జరిగిన సంఘటనలతో పోలుస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం పోలింగ్ రోజే వెల్లడైపోయింది. ఓటరు ఉత్సాహంలో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను విస్పష్టంగా కనిపించింది. దేశ, విదేశాల నుంచి అనేక వ్యయ ప్రయాసలకోర్చి మరీ వచ్చి తమ ఓటు హక్కను వినియోగించుకున్న ప్రజలు. ప్రలోభాలు కాదు, తమకు రాష్ట్ర ప్రగతి, పురోభివృద్ధి ముఖ్యమని విస్పష్టంగా చాటారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (మే 14) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఎనిమిది కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
వైసీపీ భ్రమలు తొలగిపోయాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులూ ఆ పార్టీకీ ఛీ కొట్టేశారు. సంక్షేమం అంటూ తమ ఇంత కాలం భ్రమల్లో ఉంచి చేసిన నిర్వాకం చాలన్నట్లుగా వైసీపీకి వ్యతిరేకంగా పోలింగ్ బూత్ లకు పోటెత్తారు. సంక్షేమ లబ్ధాదారులు కదా, మనకే ఓటేస్తారు అన్న భ్రమల్లో ఉన్న వైసీపీకి తామెటు వైపో తమ ధిక్కారం ద్వారా విస్పష్టంగా తెలియజేశారు. నమస్కారానికి ప్రతినమస్కారం, తిరస్కారానికి తిరస్కారం అన్నట్లుగా ఏకంగా పోలింగ్ బూత్ లలోనే వైసీపీ నేతలపై తిరగబడ్డారు.
వైసీపీ ప్ర‌భుత్వం దిగిపోవ‌టం ఖాయ‌మైంది. ఐదేళ్ల‌ పాటు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌క్ష‌పూరిత‌, అరాచ‌క పాల‌న‌కు విసిగిపోయిన ఏపీ ప్ర‌జలు ఓటు ద్వారా వీడ్కోలు ప‌లికేశారు. వైసీపీ శ్రేణుల హింసకు పాల్పడుతూ రెచ్చిపోయి భ‌యాందోళ‌న‌కు గురిచేసినా, ప‌లు పోలింగ్ కేంద్రాల్లో దాడుల చేసినా బెద‌రకుండా, అద‌ర‌కుండా ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ ల వ‌ద్ద‌కు ఓట‌ర్లు పోటెత్తారు.
ముంబైలో పలు ప్రాంతాల్లో భారీ గాలులు, వర్షం బీభత్సం సృష్టించాయి. బలమైన గాలుల కారణంగా ఘట్కోపర్ ప్రాంతంలో ఒక భారీ హోర్డింగ్ కుప్పకూలింది. ఆ హోర్డింగ్ పక్కనే వున్న పెట్రోల్ బంక్‌పై పడటంతో ఎనిమిది మంది మరణించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.