రైతుల సమస్యలపై నిరాహారదీక్ష చేయనున్న జనసేనాని పవన్ కళ్యాణ్
Publish Date:Dec 11, 2019

Advertisement
మరో దీక్షకు సిద్ధమవుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రేపు ( డిసెంబర్ 12న ) కాకినాడలో చేపట్టనున్న దీక్షకు రైతు సౌభాగ్య దీక్షగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా దీక్షకు సంబంధించిన పోస్టర్ ను పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్ తో పవన్ ఈ దీక్షకు సిద్ధమవుతున్నారు. వరి పంట వేయటానికే రైతులు భయపడేలా ప్రభుత్వ విధానాలున్నాయని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. గిట్టుబాటు ధర లేక ఖర్చుల రాబట్టుకోలేక రైతులు అప్పులపాలవుతున్నారని పవన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "ఈ నిరాహార దీక్ష తలపెట్టింది కేవలం జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రైతుల తాలూకు సమస్యలు మరియు బాధలను తెలియజేయటానికి " అని తెలిపారు. గత రబీ సీజన్ లోనూ ధాన్యం రైతులు తమ దుస్థితిని తన దృష్టికి తీసుకువచ్చారు అని తెలిజేసారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కదా!.... ఎందుకులే అని చెప్పి నేను ఒక లెటర్ తో సరిపెట్టాను. కాని ఇప్పుడు ఖచ్చితంగా వారికి గిట్టుబాటు ధర రావాలి..... కనీసం లాభసాటి ధర గురించి తరువాత చర్చించుకుందాం.. ముందు కనీస గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన పరిస్థితులున్నాయని పవన్ కళ్యాన్ తెలియజేశారు.
జగన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆయన ముఖ్యంగా పంట చేతికి రావడానికి నెల రోజుల ముందే కస్టమ్ మిల్లు రైస్ ను ప్రకటించి ధాన్యం ఇచ్చిన మూడు రోజులకే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రకటించారు. కాని ఇప్పుడు ధాన్యం తీసుకున్న 40 రోజుల తర్వాత హడావుడిగా అర్ధరాత్రి సిఎంఆర్ ప్రకటించి ఇంత వరకు రైతుకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. దీంతో రబీ కోసం అయిదు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి మళ్లీ వ్యవసాయ పనులు ప్రారంభించాల్సి వచ్చిందని రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు అని తెలిజేసారు. కౌలు రైతులకి కూడా రైతు భరోసా కల్పించడంలో కుల విభజన ఎందుకని రైతులు అడుగుతున్నారు. ఈ ప్రశ్నలన్నిటిని ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సి ఉంది అని మరి ముఖ్యంగా ప్రభుత్వాన్ని కోరారు.
http://www.teluguone.com/news/content/pawan-kalyan-to-hold-rythu-soubhagya-deeksha-in-kakinada-25-92117.html












