రైతుల సమస్యలపై నిరాహారదీక్ష చేయనున్న జనసేనాని పవన్ కళ్యాణ్

Publish Date:Dec 11, 2019

Advertisement

మరో దీక్షకు సిద్ధమవుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రేపు ( డిసెంబర్ 12న ) కాకినాడలో చేపట్టనున్న దీక్షకు రైతు సౌభాగ్య దీక్షగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా దీక్షకు సంబంధించిన పోస్టర్ ను పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్ తో పవన్ ఈ దీక్షకు సిద్ధమవుతున్నారు. వరి పంట వేయటానికే రైతులు భయపడేలా ప్రభుత్వ విధానాలున్నాయని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. గిట్టుబాటు ధర లేక ఖర్చుల రాబట్టుకోలేక రైతులు అప్పులపాలవుతున్నారని పవన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "ఈ నిరాహార దీక్ష తలపెట్టింది కేవలం జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రైతుల తాలూకు సమస్యలు మరియు బాధలను తెలియజేయటానికి " అని తెలిపారు. గత రబీ సీజన్ లోనూ ధాన్యం రైతులు తమ దుస్థితిని తన దృష్టికి తీసుకువచ్చారు అని తెలిజేసారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కదా!.... ఎందుకులే అని చెప్పి నేను ఒక లెటర్ తో సరిపెట్టాను. కాని ఇప్పుడు ఖచ్చితంగా వారికి గిట్టుబాటు ధర రావాలి..... కనీసం లాభసాటి ధర గురించి తరువాత చర్చించుకుందాం.. ముందు కనీస గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన పరిస్థితులున్నాయని పవన్ కళ్యాన్ తెలియజేశారు.

జగన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆయన ముఖ్యంగా పంట చేతికి రావడానికి నెల రోజుల ముందే కస్టమ్ మిల్లు రైస్ ను ప్రకటించి ధాన్యం ఇచ్చిన మూడు రోజులకే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రకటించారు. కాని ఇప్పుడు ధాన్యం తీసుకున్న 40 రోజుల తర్వాత హడావుడిగా అర్ధరాత్రి సిఎంఆర్ ప్రకటించి ఇంత వరకు రైతుకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. దీంతో రబీ కోసం అయిదు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి మళ్లీ వ్యవసాయ పనులు ప్రారంభించాల్సి వచ్చిందని రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు అని తెలిజేసారు. కౌలు రైతులకి కూడా రైతు భరోసా కల్పించడంలో కుల విభజన ఎందుకని రైతులు అడుగుతున్నారు. ఈ ప్రశ్నలన్నిటిని ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సి ఉంది అని మరి ముఖ్యంగా ప్రభుత్వాన్ని కోరారు.

By
en-us Political News

  
ఇంగ్లండ్‌తో లీడ్స్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 471 పరుగులకు ఆలౌటైంది.
బనకచర్ల ప్రాజెక్ట్‌ వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని సీపీఐ నేత నారాయణ కొరారు.
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రత్యేక సమావేశం ఈ నెల 27వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కానుంది.
పాడి పంట. ఈ జంట వ్యవస్థల్లో పశువులు సుభిక్షంగా ఉంటే చాలు.. పంటలు, పల్లెలు, రైతు కుటుంబాలు యథాతథంగా బాగుంటాయి.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రతా లోపానికి కారణమైన ముగ్గురు ఉద్యోగులను తొలిగించాలని ఎయిరిండియాను ఆదేశించింది.
ప్రపంచ యోగా దినోత్సవం సందర్బంగా విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడంతో సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ పేరు మార్చాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ కేబీఆర్ పార్కు వద్ద ఆయన ధర్నా చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన రైతు ధర్నాలో బీఆర్ఎస్ కార్యకర్తలు పుష్ప మూవీ డైలాగ్ ప్లకార్డులు ప్రదర్శించారు. 2028 లో రప్పా రప్పా 3.0 లోడింగ్" అంటూ మాజీ మంత్రి హారీశ్‌రావు, ఫోటోలతో ప్లకార్డులు రూపోందించారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ‌చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థత గురైనట్లు తెలుస్తోంది.ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పటంతో ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.. స్వయంగా మంత్రి కొండ సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ మాట్లాడిన వివాదాస్పద వాక్యాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో పెను దుమారం లేపుతున్నాయి.
డీఎంకే ఎంపీ ద‌యానిధి మార‌న్, భార‌తీయ కుబేరుల్లో ఒక‌డైన క‌ళానిధి మార‌న్ కి మ‌ధ్య ఆస్తి చిచ్చు మొద‌లైందా? అంటే అవున‌ని తెలుస్తోంది. 2003లో తండ్రి ముర‌సోలి మార‌న్ మ‌ర‌ణించారు. స‌రిగ్గా ఆ టైంలో బీజం వేసుకుందీ ఆస్తి త‌గాదా.
బీఆర్‌ఎస్ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్‌కి తరలించారు.
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలను ఆయుష, ఆరోగ్యశాఖ ఆథ్వర్యంలో ఘనంగా నిర్వహించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.