పవన్‌ కళ్యాణ్‌ దారేది!

Publish Date:May 9, 2016

Advertisement

 

ఫిబ్రవరి 2014. తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌ నుంచి విభజిస్తూ పార్లమెంటులో బిల్లుని ఆమోదించేశారు. తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ, హఠాత్తుగా... పార్లమెంటు తలుపులు మూసేసి, ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి మరీ బిల్లుని ఆమోదింపచేయడం ఆంధ్రా ప్రజల మనసుని తీవ్రంగా కలచివేసింది. బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించనీయం అంటూ ప్రతినలు పూనిన నేతల మీద మనసు విరిగిపోయింది. కేవలం రాబోయే ఎన్నికలలో లాభపడేందుకే కాంగ్రెస్‌ ఈ దుందుడుకు చర్యకు పాల్పడిందన్న ఆక్రోశం కలిగింది. ఒకవైపు తెలంగాణలో సంబరాలో జరుగుతుంటే, అదే స్థాయిలో తమ ఆక్రోశాన్ని కూడా వెలిబుచ్చాలని కోరుకున్నారు. అప్పుడు తెరమీదకు వచ్చాడు పవన్‌ కళ్యాణ్‌!

 

2014 మార్చి, 14న పవన్‌ కళ్యాణ్ హైదరాబాదు కన్వెన్షన్‌ సెంటరులో చేసిన ఉపన్యాసం ఓ అద్భుతం. ఒక పక్క సమాజం గురించి మాట్లాడుతూనే మరో పక్క కాంగ్రెస్‌ను దుయ్యపట్టారు. ఒక వైపు భవిష్యత్తు గురించి ప్రస్తావిస్తూనే మరో వైపు తెరాస, ఆంధ్రులను రెచ్చగొడితే, ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. కేంద్రం తీరుతో కడుపు రగిలిపోయి ఉన్న ఆంధ్రా ప్రజలకు పవన్‌ మాటలు ఓ కొత్త బలాన్నిచ్చాయి. తమ తరఫున పోరాటం చేసేందుకు, తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించేందుకు ఓ మనిషి ఉన్నాడన్న ఆశని కల్పించాయి. పవన్‌ కేవలం తన ప్రారంభోపన్యాసంతోనే సరిపెట్టుకోలేదు. ఆ ఉపన్యాసంలో తను ఇచ్చిన ‘కాంగ్రెస్‌ హఠావో, దేశ్‌ బచావో’ పిలుపుని జనంలోకి తీసుకువెళ్లారు. 2014 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఒక్క కాంగ్రెస్‌ నేత కూడా చట్టసభలకు ఎన్నిక కాకపోవడం వెనుక పవన్‌ ఇచ్చిన పిలుపు ప్రభావం కూడా ఉంది. కానీ ఆ తరువాతే అసలు కథ మొదలైంది!

 

ఎన్నికల సమయంలో అంతగా విరుచుకుపడిన పవన్‌ ఆ తరువాత నిశ్శబ్దంగా మారిపోయారు. ఆంధ్రులకు సంబంధించిన ఏ రాజకీయ పరిణామం ఏర్పడినా, ఆ సమయంలో పవన్‌ ప్రతిస్పందనని ఆశించేవారికి నిరాశే మిగిలింది. పవన్‌ నిర్లిప్తంగా మారిపోయారనీ, ఒకవేళ బయటకు వచ్చి ఎప్పుడన్నా మాట్లాడినా అది కేవలం చంద్రబాబుని కష్టకాలంలో ఆదుకునేందుకే అని ప్రతిపక్షాలు విమర్శించడం మొదలుపెట్టాయి. అలాగని పవన్‌తో తెలుగుదేశం సంతోషంగా ఉందా అంటే అదీ లేదు. ఎన్నికల సమయంలో తెదెపాకి ఓ ఊపునిచ్చిన పవన్‌ రాజధాని శంకుస్థాపన, గ్రేటర్‌ ఎన్నికలు వంటి కీలక సమయాలలో ఆ పార్టీకి దూరంగా ఉండిపోయారు. ఇక ప్రత్యేక హోదా, కాపు రిజర్వేషన్‌ వంటి సమస్యల సందర్భంలోనూ పవన్‌ కచ్చితంగా మాట్లాడలేకపోయారన్న అపవాదు ఎలాగూ ఉంది.

 

కళారంగంలో ఉన్నవారు రాజకీయాలలో కూడా తమ ప్రభను, ప్రతిభను చూపాలనుకోవడం కొత్తేమీ కాదు. అలా సినీరంగం నుంచి వచ్చి రాజకీయాలను ప్రభావితం చేసిన వారి సంఖ్యా తక్కువేమీ కాదు. దక్షిణ భారతదేశంలో సినిమాలు, రాజకీయాలు జోడుగుర్రాలుగా మారి చాలా కాలమే అయిపోయింది. కానీ సినిమాల్లో హిట్ అయినంత మాత్రాన రాజకీయాలలో ఫ్లాప్‌ కాకూడదన్న సూత్రం ఏదీ లేదు. అందుకు మెగాస్టారే ఓ గొప్ప ఉదాహరణగా నిలిచారు. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌, తన అన్నగారు అందించిన ఉదాహరణను బలపరుస్తున్నారా అన్న సందేహం కలగక మానదు. రాజకీయాల్లో చూపించాల్సిన అపారమైన చాతుర్యం, సహనం లేకపోతే ఎలాంటివారికైనా మనగలగడం కష్టం. దీర్ఘకాలిక లక్ష్యాలు లేకుండా అకస్మాత్తుగా తమకు ఉన్న ప్రజాదరణ అంతా ఓట్ల రూపంలోకి మారిపోతుందనుకుంటే భంగపడక తప్పదు. అన్నింటికీ మించి... ప్రజలు వారి ప్రతి అడుగునూ నిశితంగా గమనిస్తారనీ, వారి ప్రతి మాటనూ ప్రతిపక్షాలు విమర్శిస్తాయనీ మర్చిపోకూడదు. ఏదో ఒకసారి అలా కనపడి వెళ్లడానికి ఇది అతిథి పాత్ర కాదు. ఏదో ఒకసారి ఇలా ఆవేశంగా మాట్లాడి ఊరుకుండి పోవడానికి సినిమా క్లైమాక్సూ కాదు.

 

పవన్‌కు ఈ విషయాలన్నీ తెలియక కాదు. కానీ ఎప్పుడూ తనదైన లోకంలో ఉండిపోయే పవన్‌, నిరంతరం రాజకీయాలలో మనగలిగే చొరవ చూపగలడా అన్నదే ప్రశ్న! ఆవేశానికి మారుపేరైనా అతని వ్యక్తిత్వం రాజకీయాలకు సరిపోతుందా అన్నదే అనుమానం! మరికొద్ది సంవత్సరాలలో తన జీవితాన్ని పూర్తిగా రాజకీయాలకే అంకితం చేస్తానని పవన్‌ అంటున్నారు. నిజానికి ఇది కూడా ఓ ఉద్వేగపూరితమైన ప్రకటనే! సినిమాలు తీయడమా, మానడమా అన్నది తరువాత విషయం. ముందు తనను తాను ఓ క్రియాశీల రాజకీయ నాయకుడిగా పవన్‌ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. తన జనసేన పార్టీ లక్ష్యం ఏమిటో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.

 

ఇప్పటికే జనసేన ఎప్పటి నుంచి ఎన్నికలలో పాల్గొనబోతోందో కూడా తెలియని అయోమయంలో కార్యకర్తలున్నారు. ఆ పార్టీ తెదెపాకి మిత్రపక్షమా, ప్రతిపక్షమా తెలియని సందిగ్థంలో సామాన్యులున్నారు. ఆంధ్రాలో జగన్ ఒంటెద్దుపోకడతో వైకాపా క్రమంగా బలహీనపడుతోంది. ప్రత్యేక హోదా వంటి విషయాలలో బీజేపీ అంటేనే అక్కడి జనాలకి గుర్రుగా ఉంది. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను నిర్వహించేందుకు ఎవ్వరూ లేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఆ అవకాశం ఉన్నా కూడా జనసేన స్తబ్దుగా ఎందుకు మిగిలిపోతోందన్నదే అందరిలోనూ మెదుల్తున్న ప్రశ్న. ఆంధ్రప్రదేశలో కానీ, ఆంధ్రప్రదేశ్‌ తరఫున కానీ పోరాడేందుకు ఇప్పుడు సవాలక్ష సమస్యలు సిద్ధంగా ఉన్నాయి. రాజధాని భూముల వివాదం, జలవివాదాలు, పెరుగుతున్న నిరుద్యోగం, కరవు... ఇలా పవన్‌ పోరాడేందుకు చాలా సమస్యలే సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ సర్దార్ తన మాటల తూటాలను పొదుపుగా ఎందుకు వాడుతున్నాడన్నది కోటి రూపాయల ప్రశ్న!

 

జనసేన ఏర్పడి ఇప్పటికి రెండేళ్లు దాటిపోయింది. కానీ ఇంతవరకూ ఆ పార్టీ మీద ప్రజలు ఓ స్థిరాభిప్రాయాన్ని ఏర్పరుచుకోలేకపోయారన్నది వాస్తవం. అందుకే జనసేన తరఫున పవన్‌ కళ్యాణ్ తప్ప మరో నాయకుడు కనిపించడం లేదు. ఆ పార్టీ కార్యకర్తలు సేవా కార్యక్రమాలతో కాలం వెల్లబుచ్చుతున్న వార్తలు వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే సాగితే జనసేన మరో ప్రజారాజ్యంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అదే కనుక జరిగితే వ్యక్తిగతంగా పవన్‌కు ఎంత నష్టమో కానీ, తమ కోసం పోరాడే పార్టీ వచ్చిందని మురిసిపోయే సామాన్యుల నమ్మకాన్ని వమ్ము చేసినట్లవుతుంది. అది దేశానికి. ఆ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యానికి ఏమంత మంచిది కాదు కదా!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.