అటవీ భూముల కబ్జా నిజమే.. కబ్జాదారుడు పెద్దిరెడ్డే!

Publish Date:Nov 13, 2025

Advertisement

ఎంత బుకాయించినా.. చేసిన పాపం దాగదు. నిజం బయటకు వస్తుంది. ఇప్పుడు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి విషయంలోనూ అదే జరిగింది. పెద్దిరెడ్డి, ఆయన కుటుంబం అటవీ భూములను కబ్జా చేశారన్న విషయం వీడియో ఆధారాల ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బయటపెట్టారు. 

మంగళంపేట అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి క్రమ ఆక్రమణలు బహిర్గతంచేశారు. హెలికాప్టర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీటిని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు,  అటవీశాఖ మాజీ  మంత్రి, వైసీపీ నేత పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ అటవీ ప్రాంతంలోని 32.63 ఎకరాల అటవీ భూమి ఆక్రమించారంటూ    డిప్యూటీ సీఎం ఓ కార్యాలయం పవన్ కల్యాణ్ ఆటవీ ప్రాంతంలో ఏరియల్ సర్వే జరిపిన వీడియోను విడుదల చేసింది.  

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబసభ్యుల చేతిలో ఉన్న సుమారు 104 ఎకరాల అటవీ భూములపై పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులతో గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సందర్భంగానే డిప్యూటీ సీఎంవో కార్యాలయం ఈ వీడియోను విడుదల చేసింది.

అటవీ శాఖ  మాజీ  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి అడవి మధ్యలో ఉన్న భూమి వారసత్వంగా వచ్చిందని చెబుతున్నారు. అసలు అడవి మధ్యలో వారసత్వ భూమి ఎలా వచ్చింది? ఈ భూమి ఎలా ఎప్పుడు చేతులు మారింది? తదితర విషయాలను తనకు నివేదించాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.  ఈ కబ్జా వ్యవహారంలో  ఎవరి పాత్ర ఎంత అనే దానిపై నివేదికలు తయారు చేయాలని అధికారులను నిర్దేశించారు. 

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డిలు 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ అటవీ భూముల గురించి వారి అఫిడవిట్ లో తప్పుడు సమాచారం అందించారనే అంశం తన దృష్టికి వచ్చిందన్నఅధికారులు, వెంటనే అటవీ చట్టం ప్రకారం ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్, ఛార్జ్ షీట్ దాఖలు చేశామని పవన్ కల్యాణ్ కు తెలిపారు. అలాగే ఆక్రమణలు తొలగించి ఆ భూమిని  స్వాధీనం చేసుకున్నామని, కోర్టులో కేసుల వివరాలు ప్రొడ్యూస్ చేశామనీ వివరించారు.   

ఇలా ఉండగా పవన్ కల్యాణ్ ఆరోపణలను వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డి ఖండించారు.  తాము అట‌వీ భూముల‌ను ఆక్ర‌మించ‌లేద‌నీ, వాటిని   కొనుగోలు చేశామ‌ని పేర్కొన్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో అప్ప‌టి చంద్రబాబు ప్ర‌భుత్వ హ‌యాంలోనే తాము భూములు కొనుగోలు చేశామ‌న్నారు. వీటికి సంబంధించి త‌మ‌కు అన్ని ర‌కాల హ‌క్కులు ఉన్నాయ‌న్న మిథున్ రెడ్డి, ఆన్‌లైన్‌లో స‌ర్వే నెంబ‌ర్ల వారీగా విచార‌ణ చేసుకోవ‌చ్చ‌న్నారు. అటవీ భూములను తాము ఆక్రమించుకున్నట్లు రుజువు చేయాలని సవాల్ విసిరారు.  అలా నిరూపించలేకుంటే.. తమకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  త‌మ కుటుంబాన్నిఅప్రతిష్ఠ పాలు చేసేందుకే పవన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.  

అయితే మొత్తంగా పవన్ కల్యాణ్ బయటపెట్టిన విషయాలు ఒక్కసారిగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డిలను ఉలిక్కిపడేలా చేశాయి. అటవీ ప్రాంతంలో భూములు వారసత్వంగా ఎలా వస్తాయనీ, ఒక వేళ వాటిని కొనుగోలు చేశామని వారు చెబుతున్నా, అందుకు అటవీ చట్టాలు అనుమతించవనీ తెలిసిందే. వాస్తవానికి  ఈ విషయంలో గతంలోనే విచారణ చేసిన అధికారులు కబ్జాను గుర్తించి ఆ భూములను వెనక్కు తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా పవన్ కల్యాణ్ ఏరియల్ సర్వే తీసి మరీ పెద్దిరెడ్డి అటవీ భూముల కబ్జాను వీడియోలు తీసి మరీ బయటపెట్టారు. 

అయితే పవన్ ఆరోపణలను ఖండించిన మిథున్ రెడ్డి కబ్జా చేయలేదని చెప్పకుండా రుజువు చేయాలంటూ సవాల్ విసురుతున్నారు.  అయితే మిథున్ రెడ్డి ఖండనను, సవాల్ ను తోసిపుచ్చుతూ అటవీశాఖ ఉన్నతాధికారి ఒకరు పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూముల కబ్జా వాస్తవమేనని కుండబద్దలు కొట్టారు. అలా కబ్జా చేసిన భూములను వెనక్కు తీసుకున్నామనీ, విచారణ కొనసాగుతోందనీ ప్రకటించారు.  

By
en-us Political News

  
దేశ అభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాదని నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మల్కాజ్‌గిరిలో సంచలనం సృష్టించిన నిషారాణి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది.
విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర ప్రమాదం పెను సంచలనంగా మారింది.
మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాల యానికి తరలించారు. లిక్కర్ రవాణా వ్యవహారా ల్లో ఆయన పాత్రపై అధి కారులు విచారణ చేపట్టారు.
కోడి కూర చేయడానికి ఓపిక లేదనీ, రేపు వండుతానని చెప్పింది. అయితే తప్పతాగి ఉన్న రమేశ్ కోడి కూర ఇప్పుడే వండాలంటూ భార్యపై చేయి చేసుకున్నాడు.
పలావు ఫ్లాగ్‌తో ప్రయాణిస్తున్న ఎంటీ సెట్టెబెల్లో అనే చమురు ట్యాంకర్ 24 మంది భారతీయ సిబ్బందితో గల్ఫ్ ఆఫ్ ఒమన్ గుండా వెళుతోంది. ఇరాన్ చమురు రవాణాపై అమెరికా విధించిన ఆంక్షలను ఈ నౌక ఉల్లంఘించిందనే నెపంతో, యూఎస్ సెంట్రల్ కమాండ్ కు చెందిన యుద్ధ విమానాలు ఈ నౌకపై దాడి జరిపాయి.
ఖమ్మంలో కీచకుడి దాడిలో గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు.
పశ్చిమ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ (TMC) చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది.
గతంలో సిట్ కేవలం సాధారణ అవినీతి నిరోధక చట్టాల కింద విచారణ జరపగా, ఈడీ ఎంట్రీ తో కథ కొత్త మలుపు తిరిగింది. మద్యం సిండికేట్లు, వివిధ షెల్ కంపెనీల ద్వారా సేకరించిన దాదాపు 3,500 కోట్ల రూపాయల భారీ ముడుపులు ఎక్కడెక్కడికి చేరాయి? హవాలా మార్గాల ద్వారా విదేశీ ఖాతాల్లోకి ఎలా తరలిపోయాయి? అనే మనీ ట్రయిల్ గుట్టును పూర్తిగా రట్టు చేసేందుకు ఈడీ సిద్ధమైంది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సాధారణంగా తనదైన దూకుడు రాజకీయ శైలితో, వాడీవేడి వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ షాక్ ఇచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ రూట్ ఎందుకు ఆలస్యం కానుంది? రియల్ ఎస్టేట్‌పై చూపే ప్రభావం, రాజకీయ దుమారం పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తనిఖీల్లో అర్హత లేని వ్యక్తులు వైద్య సేవలు అందిస్తున్నట్లు, సరైన అనుమతులు లేకుండానే చికిత్సలు నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ దాడుల్లో అధికారులు పలు క్లినిల్ లను పరిశీలించి, రికార్డులు, వైద్య సిబ్బంది అర్హతలు, చికిత్సల విధానాలపై సుదీర్ఘంగా విచారణ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.