టీడీపీ పై పవన్ తిరుగుబాటు కి అసలు కారణం ఇదేనా?
Publish Date:Mar 18, 2018
Advertisement
తెలుగు దేశం పార్టీ కి మొదటి నుండి స్నేహ హస్తం ఇస్తూ వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈ మధ్య ఆ పార్టీ పై పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. 2014 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన జన సేన అధినేత, ప్రతిసారి, రాష్ట్రంలో టీడీపీ ని కేంద్రంలో బీజేపీ ని వెనకేసుకుంటూ వచ్చారు. కానీ, ఎవరు ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు, ఆయన పుత్రుడు నారా లోకేష్ పై విరుచుకుపడ్డాడు. అసలు, పవన్ తిరుగుబాటుకు అసలు కారణం ఏమై ఉండోచ్చబ్బా అని ఎవరి విశ్లేషణలు వాళ్ళు చేస్తున్నారు. అయితే, పవన్ కి బాబు మీద కన్నా ఆయన పుత్రుడు లోకేష్ మీదే కోపం ఎక్కువ ఉందట. దీనికి కారణం ఏంటంటే, లోకేష్ మొదటి నుండి పవన్ కళ్యాణ్ ని చిన్న చూపు చూస్తున్నాడట. పార్టీ మీటింగ్స్ లో గానీ, ఎక్కడైనా పవన్ కళ్యాణ్ ప్రస్తావన వస్తే, ఆయన వల్ల ఒరిగేదేమి లేదు, లైట్ తీసుకోండి అంటూ సమాధానం ఇచ్చేవాడట. జన సేన తో పొత్తు కావాలంటే, తమకు ఎక్కువ సీట్లు కావాలని పవన్ డిమాండ్ చేస్తే, లోకేష్ ససేమీరా అన్నాడట. ఆ మధ్య పవన్ ని చంద్రబాబు ఎక్కువగా పట్టించుకోకపోవడానికి కారణం కూడా లోకేషే నట. ఈ విషయం వేగుల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్, ఇక టీడీపీ కి దూరం గా ఉందామని డిసైడ్ అయ్యాడట. తన స్పీచ్ ద్వారా మొత్తానికి బాబు, లోకేష్ పై కక్ష తీసుకున్నాడని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/pawan-kalyan-comments-on-nara-lokesh-25-80689.html





