ఊహాగాన సభలకు తెర.. కూటమి ఐక్యతపై క్లారిటీ ఇచ్చిన పవన్

Publish Date:Feb 21, 2025

Advertisement

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చిక్కుల్లో పడిందనీ, కూటమి పార్టీల మధ్య అగాధం ఏర్పడిందనీ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టేస్తూ.. చెలరేగిపోతున్న వైసీపీయుల ఊహాగాన సభలకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెర దించేశారు. తాను ఇటీవలి కాలంలో కొన్ని కార్యక్రమాలకు హాజరు కాకపోవడానికి కారణం తన అనారోగ్యమే తప్ప మరో కారణం లేదని కుండబద్దలు కొట్టేశారు. చంద్రబాబు ఫోన్ చేసినా పవన్ రెస్పాండ్ కాలేదనీ, కేబినెట్ భేటీకి సైతం డుమ్మా కొట్టేశారనీ వైసీపీ సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో పలు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. 

రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇవ్వాలంటూ తెలుగుదేశం శ్రేణుల నుంచి డిమాండ్ వచ్చిన క్షణం నుంచీ వైసీపీలో కూటమి పార్టీల మధ్య విభేదాలు అంటూ పుంఖాను పుంఖాలుగా కథనాలు వెలువడ్డాయి. జనసేన, తెలుగుదేశం మధ్య మైత్రికి బీటలు వారాయన్న విశ్లేషణలూ వెలువడ్డాయి. అయితే ఇరు పార్టీల అధినేతలూ కూడా లోకేష్ ప్రమేష్ విషయంలో నోరెత్తద్దంటూ తమతమ పార్టీల నేతలు, క్యాడర్ ను స్పష్టం చేశారు. 

అలాగే తన కేబినెట్ సహచరులకు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకింగ్ లలో పవన్ కల్యాణ్ నంబర్ 1గా లేకపోవడాన్ని ఎత్తి చూపుతూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ నానా హంగామా చేసింది. పవన్ ను తొక్కేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనీ, అందుకే పవన్ కల్యాణ్ బాబు ఫోన్ కు రెస్పాండ్ కాలేదనీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఇరువురూ కలిసి వెళ్లడం, అక్కడ ఇద్దరూ కలిసే పలువురు మంత్రులతో భేటీ కావడంతో వైసీపీ చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని తేటతెల్లమైంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా స్వయంగా కూటమి పార్టీలన్నీ సమన్వయంతోనే పని చేస్తున్నాయని విస్పష్టంగా ప్రకటించారు.

జగన్ పాలన కారణంగా అప్పుల కుప్పలా మారిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇటీవల తాను కొన్ని సమావేశాలకు హాజరు కాకపోవడానికి కారణం వెనునొప్పేనని, మరో కారణం లేదనీ క్లారిటీగా చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పని చేస్తోందనీ, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, వాటిని అధిగమించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. 

By
en-us Political News

  
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.