Publish Date:Feb 21, 2025
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చిక్కుల్లో పడిందనీ, కూటమి పార్టీల మధ్య అగాధం ఏర్పడిందనీ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టేస్తూ.. చెలరేగిపోతున్న వైసీపీయుల ఊహాగాన సభలకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెర దించేశారు. తాను ఇటీవలి కాలంలో కొన్ని కార్యక్రమాలకు హాజరు కాకపోవడానికి కారణం తన అనారోగ్యమే తప్ప మరో కారణం లేదని కుండబద్దలు కొట్టేశారు. చంద్రబాబు ఫోన్ చేసినా పవన్ రెస్పాండ్ కాలేదనీ, కేబినెట్ భేటీకి సైతం డుమ్మా కొట్టేశారనీ వైసీపీ సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో పలు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇవ్వాలంటూ తెలుగుదేశం శ్రేణుల నుంచి డిమాండ్ వచ్చిన క్షణం నుంచీ వైసీపీలో కూటమి పార్టీల మధ్య విభేదాలు అంటూ పుంఖాను పుంఖాలుగా కథనాలు వెలువడ్డాయి. జనసేన, తెలుగుదేశం మధ్య మైత్రికి బీటలు వారాయన్న విశ్లేషణలూ వెలువడ్డాయి. అయితే ఇరు పార్టీల అధినేతలూ కూడా లోకేష్ ప్రమేష్ విషయంలో నోరెత్తద్దంటూ తమతమ పార్టీల నేతలు, క్యాడర్ ను స్పష్టం చేశారు.
అలాగే తన కేబినెట్ సహచరులకు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకింగ్ లలో పవన్ కల్యాణ్ నంబర్ 1గా లేకపోవడాన్ని ఎత్తి చూపుతూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ నానా హంగామా చేసింది. పవన్ ను తొక్కేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనీ, అందుకే పవన్ కల్యాణ్ బాబు ఫోన్ కు రెస్పాండ్ కాలేదనీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఇరువురూ కలిసి వెళ్లడం, అక్కడ ఇద్దరూ కలిసే పలువురు మంత్రులతో భేటీ కావడంతో వైసీపీ చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని తేటతెల్లమైంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా స్వయంగా కూటమి పార్టీలన్నీ సమన్వయంతోనే పని చేస్తున్నాయని విస్పష్టంగా ప్రకటించారు.
జగన్ పాలన కారణంగా అప్పుల కుప్పలా మారిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇటీవల తాను కొన్ని సమావేశాలకు హాజరు కాకపోవడానికి కారణం వెనునొప్పేనని, మరో కారణం లేదనీ క్లారిటీగా చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పని చేస్తోందనీ, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, వాటిని అధిగమించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pawan-kalyan-clarifies-unity-in-kutami-intact-39-193207.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.