పొత్తు ఖాయం.. సీఎం ఆయనే.. కుండబద్దలు కొట్టిన పవన్

Publish Date:May 11, 2023

Advertisement

జనసేనాని గుప్పెట విప్పేశారు. పొత్తులు ఉంటాయని కుండ బద్దలు కొట్టేశారు. అదే సమయంలో తాను ముఖ్యమంత్రి పదవి రేసులో లేననీ, ఆ పోస్టు కోసం వెంపర్లాడబోననీ కూడా తేటతెల్లం చేసేశారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్  అవినీతి పాలన అంతమొందించడమే లక్ష్యమని మొదటి నుంచీ చెబుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల కండా ఉండేందుకు తన వంత ప్రయత్నం, కృషి చేస్తానని గతంలోనే ప్రకటించారు.

ఏపీలో  బలం ఉన్న, బలంగా ఉన్న పార్టీలు మూడే మూడు. అవి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, అధికార పార్టీ వైసీపీ, జనసేన. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించిన రోజునే.. ఆయన తెలుగుదేశంతో పొత్తు ఉంటుందన్న సంకేతాలిచ్చారని అందరికీ తేటతెల్లమైపోయింది. బీజేపీని కూడా  ఒప్పిస్తాననీ, ఆ పార్టీకి యిప్పటికే మిత్రపక్షమైన జనసేన క్లియర్ గా చెప్పింది. దీంతో ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా 2014 ఎన్నికల నాటి పొత్తులు మళ్లీ పొడుస్తాయని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషించారు. అయితే నరం లేని నాలుక నానా విధాలుగా మాట్లాడుతుందన్నట్లు కొందరు సామాజికవర్గం పేరు చెప్పి సీఎం పదవి విషయంలో  చేసిన వ్యాఖ్యలో  కొంత గందరగోళాన్ని సృష్టించాయి.

దానిని పునాదిగా చేసుకుని అధికార వైసీపీ కూడా సింహం సింగిల్ గా వస్తుంది వంటి పంచ్ డైలాగులతో పొత్తలపై విమర్శల వర్షం కురిపించింది. అన్నిటికీ మించి జనసేన పార్టీలో కొత్తగా కార్యదర్శి పదవి పొందిన జనసేనాని సోదరుడు తాజాగా చేసిన వ్యాఖ్యలతో సానుకూల వాతావరణం చెడుతుందా అన్న భావన సర్వత్రా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ పొత్తులు, ముఖ్యమంత్రి పదవి వంటి అంశాలపై స్పష్టతనిచ్చారు.  వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఖాయంగా పెట్టుకుంటున్నామని ప్రకటించారు. సీఎం పదవి విషయంలో జరుగుతున్న ప్రచారానికి కూడా తెర దించే శారు.    తాను సీఎం పదవిని అడగబోనని కుండబద్దలు కొట్టేశారు.

ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని ఢీకొని కూలదోయడానికి జరిగే ప్రయత్నంలో షరతులు పెట్టే ప్రశక్తే లేదని తేల్చేశారు.  ప్రజలు కావాలని కోరుకుంటే సీఎం అవుతానన్నారు. గత ఎన్నికల్లో జనసేనకు జనం  30 స్థానాలు ఇచ్చి ఉంటే యిప్పుడు తాను సీఎం రేసులో ఉండేవాడినని చెప్పడం ద్వారా వచ్చే ఎన్నికలలో తాను సీఎం రేసులో లేనని విస్పష్టంగా తేల్చేశారు.  జనసేనకు పట్టు ఉన్న ప్రాంతాలలో 30శాతం ఓటింగ్ ఉందన్నరు. అందుకు అనుగుణంగానే జనసేనకు ఉన్న బలం మేరకే పొత్తులో భాగంగా సీట్లు కోరుతానని పవన్ కల్యాణ్ చెప్పేశారు.  

పొత్తుల విషయంలో తన స్టాండ్ మారలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా పొత్తులతోనే బలపడ్డాయని గుర్తు చేశారు. ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో తాను వచ్చే నెల 3వ తేదీ నుంచీ ఏపీలోనే ఉంటానని చెప్పిన జనసేనాని..  పొత్తులకు ఒప్పుకోని వారు ఎవరైనా ఉంటే వారిని తాను ఒప్పిస్తానని చెప్పారు. ఇదే విషయం పవన్ కల్యాణ్ ఢిల్లీలో కూడా మాట్లాడారు.  బీజేపీ కూడా కలిసి రావాలని ఢిల్లీలో పవన్ చర్చలు జరిపినట్లుచెబుతున్నారు.

ఒక వేళ బీజేపీ రాకపోతే.. టీడీపీతో కలిసి వెళ్లేందుకు పవన్ సిద్ధమయ్యారని ఆయన తాజా వ్యాఖ్యలతో నిర్ధారణ అయిపోయిందనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సీఎం పదవి విషయంలో తమ క్యాడర్ చేస్తున్న వ్యాఖ్యలతో పొత్తు అంశం ముందుకు సాగకుండా అడ్డం పడకుండా ఆదిలోనే చెక్ పెట్టేశారు. పవన్ తాజా వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్నది స్పష్టమైపోయిందని  పరిశీలకులు చెబుతున్నారు.  

By
en-us Political News

  
తమిళనాడులో ఎన్డీయేకు పట్టం కట్టండి.. చెన్నైలో సీఎం చంద్రబాబు పిలుపు
మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి, చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముందుండి నడిపిస్తున్నా.. వెనుక నుంచి ప్రత్యర్థుల కదలికలను గమనించే శైలి మోడీదని అంటారు. మోడీ ఎల్లప్పుడూ ఒకటి కాదు, పది అడుగుల ముందుంటారనీ, అదే సమయంలో ప్రత్యర్థుల ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తారనీ వారు చెబుతారు. ఆయన రాజకీయ శైలిలో ప్రోయాక్టివ్ లీడర్షిప్, రియాక్టివ్ అవగాహన అనే రెండు ముఖ్యలక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీ.. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో మైగుడ్ ఫ్రెండ్ అని చంద్రబాబును సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆయన చూపుతున్న చొరవ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న విజన్ అద్భుతమని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు.
భారత రాజ్యాంగం ప్రకారం.. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. ఇది ఏ పార్టీ ఇష్టానుసారం చేసే పని కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన, ఆటోమేటిక్ ప్రక్రియ. ఎందుకు 50 సంవత్సరాలుగా డిలే అయింది? 1976 ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ.. డీలిమిటేషన్ను 2001 వరకు ఫ్రీజ్ చేశారు.2001 – వాజ్పేయి ప్రభుత్వం: ఫ్రీజ్ను 2026 వరకు పొడిగించింది. అంటే.. 2026లో డీలిమిటేషన్ జరుగుతుందని అన్ని పార్టీలకూ గత 20 సంవత్సరాలుగా తెలుసు.
ప్పుడు అమరావతి రాజధానిని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ గా రూపొందించినట్లే, ఆయన రాజకీయ రంగప్రవేశంలో కూడా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీం ఏదో ఆలోచించి అమలులో పెట్టి ఉంటారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, తన ప్రసంగాలను మనం చేయలేమా? చేయగలం (యస్ వికెన్) అనే మాటతో ముగించేవారు. కానీ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల క్రితమే తన జీవితానికి నేను చేయగలను (ఐ కేన్ డూ) అనే టాగ్ లైన్ నిర్దేశించుకున్నారు.
ఆయన మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. నెల రోజుల్లో ఆయన మంత్రి ఉద్యోగం పోతుందా? అని ప‌రిశీలిస్తే ఆయ‌న‌కా గండం ఉందనే చెప్పాలి.
వెస్ట్ బెంగాల్ లో మొత్తం 91 లక్షల ఓటు తొలగించారు. అంటే సగటున చూస్తే నియోజకవర్గానికి 31 వేల ఓట్లు తొలగించారు. ఈ తొలగింపు రెండు కారణాల వల్ల చాలా సెన్సిటివ్. మార్జిన్‌లతో పోలిస్తే ..2021లో టీఎంసీ గెలిచిన చాలా సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. 13 సీట్లలో ఇది మూడు వేల కంటే కూడా తక్కువ. ఇటువంటి పరిస్తితుల్లో నియోజకవర్గానికి 31 వేల ఓట్లు డిలిషన్ లో పోతే.. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.