జనసేనలో పవన్ ప్రక్షాళన...ప్రకాశం జిల్లా పార్టీ కమిటీ రద్దు

Publish Date:May 25, 2026

Advertisement

 

జనసేన పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. పార్టీలో ఎట్టిపరిస్థితుల్లోనూ క్రమశిక్షణారాహిత్యాన్ని సహించేది లేదని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లా జనసేన కమిటీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

రాజమండ్రి వేదికగా నిర్వహించిన పార్లమెంటరీ స్థాయి కీలక ప్రతినిధులు, క్రియాశీలక కార్యకర్తల సదస్సులో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత పన్నెండేళ్లుగా తాను చూపిస్తూ వస్తున్న ఓపికకు ఇక ముగింపు పలికే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. పార్టీని మరింత పటిష్ఠమైన సైనిక క్రమశిక్షణ గల వ్యవస్థగా రూపాంతరం చెందించేందుకు కఠిన నిర్ణయాలకు వెనుకాడబోనని స్పష్టం చేశారు.

ప్రకాశం జిల్లా కమిటీ పరిధిలో చోటుచేసుకుంటున్న గ్రూపు రాజకీయాల పట్ల పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం పాతిక మంది సభ్యులు ఉన్న చోట ఏకంగా యాభైకి పైగా అంతర్గత వివాదాలు తలెత్తడంపై ఆయన ఆవేదన చెందారు. ఇలాంటి వర్గ విభేదాల కారణంగా ఒకరిని ఒకరు తొక్కేస్తూ, పార్టీ ప్రతిష్ఠను మసకబారుస్తున్నారని నేతల తీరును తప్పుబట్టారు.

సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేస్తూ.. ఇప్పటివరకు పార్టీ శ్రేణులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చానని, కానీ ఇకపై నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. "పార్టీ నిర్దేశించిన మార్గంలో కలిసి నడవండి, లేదంటే తప్పుకోండి" (ఫాల్ ఇన్ లైన్ ఆర్ ఫాల్ అవుట్ ఆఫ్ లైన్) అంటూ గట్టి సంకేతాలు పంపారు.

ఈ నిర్ణయంతో పార్టీలో పదవులు అనుభవిస్తూ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించే ఏ స్థాయి నేతలకైనా కఠిన చర్యలు తప్పవనే స్పష్టమైన హెచ్చరిక వెళ్ళింది. కేవలం ఎన్నికల విజయాలతో సరిపెట్టుకోకుండా, సంస్థాగతంగా పార్టీని పటిష్ఠం చేయడమే తన లక్ష్యమని ఆయన నిరూపించారు.

ప్రస్తుతం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ నిర్ణయం జనసేన శ్రేణుల్లో పెను సంచలనంగా మారింది. పార్టీ అధినేత తీసుకున్న ఈ కఠిన నిర్ణయం తర్వాత జిల్లా రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఎలాంటి వర్గపోరుకు తావులేకుండా సరికొత్త నాయకత్వంతో ప్రకాశం జిల్లాకు సరికొత్త కార్యవర్గాన్ని ప్రకటించేందుకు కసరత్తులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
 

By
en-us Political News

  
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.