వైసీపీ, టీడీపీలకు పవన్ స్ట్రోక్..!

Publish Date:Aug 16, 2017

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాలకు అత్యంత కీలకంగా మారిన నంద్యాల ఉప ఎన్నికలో విజయం కోసం రెండు పార్టీలు తీవ్ర స్థాయిలో వ్యూహాలు రెడీ చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా చోటా మోటా నేతల నుంచి ఛరిష్మా ఉన్న నేతలను ప్రచారంలో దించాయి ఇరు పక్షాలు. ఈ నేపథ్యంలో నంద్యాల నియోజకవర్గంలో జయాపజయాలను ప్రభావితం చేయగల సత్తా ఉన్న బలిజ సామాజిక వర్గం ఓట్లను తమ ఖాతాలో వేసుకోవడానికి సామ, ధాన, బేధ, దండోపాయాలను ఉపయోగిస్తున్నారు ఇరు పార్టీల అధినేతలు. ఈ క్రమంలో పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్ కీలకంగా మారారు. దీంతో ఆయన మద్ధతు పొందేందుకు ఎవరికి వారు రాయబారాలు నడుపుతున్నారు.

 

2014 ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇచ్చి ఆ పార్టీ అభ్యర్థుల తరపున విస్తృతంగా ప్రచారం చేసి వారి విజయానికి పవన్ కారణమయ్యారని చాలా మంది బాహాటంగానే చెబుతారు. మిత్రపక్షంగా ఉన్న కారణంగా జనసేనాని మద్దతు తమకేనని టీడీపీ నేతలు భావిస్తూ వచ్చారు. అలాగే భూమా కుటుంబం ప్రజారాజ్యం పార్టీలో చేరినప్పుడు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డితో కలిసి పనిచేశారు పవన్. ఆ రకంగా భూమా ఫ్యామిలీతో పవర్‌స్టార్‌కు మంచి అనుబంధమే ఉంది. పైగా ఉద్దానం కిడ్నీ బాధితులు, ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సున్నితంగా విమర్శించారే తప్ప మిత్రపక్షం నుంచి బయటకు రాలేదు. అంతేందుకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గవర్నర్ నరసింహన్ నిర్వహించిన ఎట్‌ హోం కార్యక్రమానికి తొలిసారి హాజరైన పవన్..చంద్రబాబుతో ముచ్చటించడం..ఈ పరిణామాలన్నింటిని బేరీజు వేసుకున్న సైకిల్ పార్టీ నేతలు పవన్ తమవైపే ఉంటారని భావించారు.

 

అయితే చంద్రబాబు వ్యవహారశైలి పవన్‌కు నచ్చడం లేదని..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం విమర్శించారన్న కోపం జనసేనానిలో ఉందని అందువల్ల ఆయన ఈసారి తమకే మద్దతు ప్రకటిస్తారని భావించింది వైసీపీ అధినాయకత్వం. అలా ఎవరికి వారు..తమ లెక్కల్లో తాము ఉండగానే అదిరిపోయే స్ట్రోక్ ఇచ్చారు జనసేన అధినేత. నంద్యాల ఉప ఎన్నిక విషయంలో తమ పార్టీ తటస్థంగా ఉంటుందని ప్రకటించారు. తాను గానీ, జనసేన పార్టీగానీ ఏ పార్టీకి మద్దతివ్వడం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు 2019 వరకు ఎలాంటి ఉప ఎన్నిక వచ్చినా ఇదే విధానాన్ని అనుసరిస్తామన్నారు పవన్.

 

క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం జరిగాకే ఎన్నికలకు వెళతామని, అప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం గానీ...ఏ పార్టీకి గానీ..ఏ అభ్యర్థికి గానీ మద్దతు ఇచ్చేది ఉండదని స్పష్టం చేయడంతో రెండు పార్టీల నేతలకు వర్షాకాలంలో కూడా ముచ్చెమటలు పడుతున్నాయి. పవన్‌ను ప్రచారంలోకి తీసుకురావడానికి మంత్రి భూమా అఖిలప్రియ చివరి క్షణం వరకు ఎంతో ప్రయత్నించారు. కానీ కాటమరాయుడు ఇలా ఊహించని షాక్ ఇచ్చేసరికి అఖిల ప్రియ కాస్త నిరాశకు లోనయ్యారట. ఆవిడ ఒక్కరే కాదు ఇప్పుడు టీడీపీ, వైసీపీ నేతల పరిస్థితి అలాగే ఉందట. మరి పవన్ ఈ తటస్థ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో..ఆయనకే తెలియాలి.

By
en-us Political News

  
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.