పవన్ కళ్యాణ్ ఫ్లాప్ షో

Publish Date:Mar 28, 2014

Advertisement

 

పవన్ కళ్యాణ్ పదిరోజుల క్రితం తన జనసేన పార్టీ స్థాపిస్తున్నపుడు చేసిన ఉపన్యాసం రాజకీయ మూస ఫార్ములాకి కట్టుబడకుండా సాగినప్పటికీ, అది ఆయన ఆలోచనలకి అద్దం పడుతూ అభిమానులకి, ప్రజలకీ, మీడియాకీ, చివరికి రాజకీయ పార్టీలకీ కూడా చాలా ఆసక్తి రేకెత్తించి, మళ్ళీ ఆయన రెండో ప్రసంగం కోసం వారిని ఎదురు చూసేలా చేసింది. కానీ, ఆయన నిన్న వైజాగ్ బహిరంగ సభలో చేసిన ప్రసంగం అభిమానులను కూడా చాలా నిరుత్సాహపరిచింది. ఆయన సరిగ్గా ఎన్నికల ముందు రాజకీయాలలోకి ప్రవేశించినందున, జనసేన పార్టీ తప్పకుండా ఎన్నికలలో పోటీ చేస్తుందని అందరూ ఆశించారు.

 

కానీ ఆయన అందరినీ నిరాశపరుస్తూ “ఎన్నికలలో పోటీ చేయను. ఎవరికీ మద్దతు ఈయను. ఎవరికీ వ్యతిరేఖంగా ప్రచారం చేయను. ఎవరి అవకాశాలు పాడుచేయడం నాకిష్టం లేదు. మీకిష్టం వచ్చిన వారికే ఓట్లువేసుకోండి. ఎన్నికలయిపోయిన తరువాత గెలిచిన వారిని నేను నిలదీస్తాను” అని చెప్పారు. ఈ మాత్రం దానికి ఇంత హడావుడిగా పార్టీ పెట్టి ఇంత హడావుడి చేయడం అవసరమా? అనేదే ప్రశ్న.

 

ఒక చెంప మీద కొడితే రెండు చెంపలు వాయించి బుద్ధి చెప్పగల యువత కోసం తను వెతుకుతున్నానని, అటువంటివారు దొరికినప్పుడే జనసేన ఎన్నికలలో పోటీ చేస్తుందని చెప్పారు. అయితే ఇన్నికోట్ల మంది తెలుగు ప్రజలలో, అభిమానులలో ఆయనకు అటువంటి వ్యక్తి ఒక్కరూ కనబడకపోవడం విచిత్రమే. ఆయన ఎన్నికలలో పోటీ చేయకూడదని నిర్ణయించుకొంటే అందుకు ఇటువంటి కుంటిసాకులు చెప్పనవసరం లేదు. నిజానికి ఆయన పార్టీ ఎన్నికలలో పోటీ చేసేమాటయితే ఆయన వెంట నడిచేందుకు, ఆయన ‘ఊ’ అంటే ఆయన కోసం నిప్పుల్లో కూడా దూకేందుకు వేలాది అభిమానులు సిద్దంగా ఉన్నారు. కానీ ఆయన ఎందుకో వెనుకంజవేసారు.

 

కనీసం ఆయన తను ఫలానా పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు కూడా విస్పష్టంగా ప్రకటించకుండా ప్రజలను వారికిష్టమయిన అభ్యర్ధులకే ఓట్లు వేసుకోమని ఒక ఉచిత సలహా ఇవ్వడం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆయన ‘మోడీకి నా సెల్యూట్’ అన్నారు తప్ప, తమ పార్టీ రాష్ట్రంలో బీజేపీకి మద్దతు ఇస్తుందో లేదో కూడా స్పష్టంగా చెప్పకుండా అభిమానులను అయోమయ స్థితిలో వదిలివేసారు. కాంగ్రెస్ పార్టీలో బొత్స, కావూరి, రాయపాటి వంటి నేతల పేరు పెట్టి మరీ నిర్భయంగా విమర్శించిన ఆయన జగన్ పేరు ఎత్తేందుకు కూడా సాహసించలేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అదేవిధంగా తేదేపాకు అనుకూలంగా మాట్లాడినప్పటికీ నేరుగా ఆ పార్టీ పేరు చెప్పి దానికే తను మద్దతు ఇస్తున్నానని చెప్పలేకపోవడం కూడా ఎందుకో అర్ధం కాదు.

 

ఇక కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించిన ఆయన ఆ పార్టీ నుండి ఇతర పార్టీలలోకి వెళ్ళిపోయిన వారిని మాత్రం క్షమిస్తున్నట్లు మాట్లాడటం మరో విశేషం. “మీరు పార్టీలు కండువాలు మార్చడం నేను జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాను. మారండి. నేనేమి అభ్యంతరం చెప్పబోను. కానీ ప్రజలకు మీరిచ్చిన హామీలను నెరవేర్చకపోతే మాత్రం జనసేన ఉద్యమిస్తుందని హెచ్చరిస్తున్నాను” అని చెప్పడం చాలా అసంబద్దంగా ఉంది.

 

కేవలం వారం పది రోజులలో కొమరం పులి వంటి పవన్ కళ్యాణ్ ఇంత పిరికిగా ఎందుకు మారిపోయారు? అని ప్రశ్నించుకొంటే ఆయనపై ఏవో కొన్ని అదృశ్య శక్తుల ఒత్తిళ్ళు చాలానే ఉన్నట్లు అనిపిస్తోంది. అందువల్లే క్రిందటిసారి ఆయన ప్రసంగంలో కనిపించిన వాడి వేడి, ఈసారి కనిపించలేదు. ఈ సభలో తనను, తన పార్టీని ప్రజల ముందు పూర్తిగా అవిష్కరించుకొని, తన అభిమానులకు దిశానిర్దేశం చేస్తారని అందరూ ఆశించారు. ఆయన రాజకీయ వైఖరి ఏమిటో విస్పష్టంగా ప్రకటిస్తారని అన్ని పార్టీలు ఎదురుచూసాయి. కానీ రాష్ట్ర రాజకీయాలలో ఒక పెను తుఫానులా.. సునామీలా...ప్రవేశిస్తారనుకొంటే, చప్పగా చల్లారిపోయి ప్రజలను తమకు నచ్చిన వారికే ఓటేసుకోమని ఒక ఉచిత సలహా ఇచ్చి ‘జై హింద్’ చెప్పేశారు పవన్ కళ్యాణ్.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.