పవన్, నరేంద్ర మోడీకి మద్దతు పలకడం సమర్ధనీయమేనా?

Publish Date:Mar 22, 2014

Advertisement

 

వామపక్ష భావాలున్న పవన్ కళ్యాణ్ మతతత్వ పార్టీ అయిన బీజేపీకి మద్దతు ప్రకటించడం, పనిగట్టుకొని అహ్మదాబాద్ వెళ్లి గోద్రా అల్లర్లలో పేరేక్కిన నరేంద్ర మోడీని కలిసి ఆయనకు మద్దతు తెలపడం చాలా మంది హర్షించలేకపోతున్నారు. ముఖ్యంగా పవన్ అభిమానులలో ముస్లిం యువకులు దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక మూస రాజకీయ ధోరణికి అలవాటు పడిపోయిన కొందరు రాజకీయ విశ్లేషకులు, పవన్ కళ్యాణ్ కి సరయిన రాజకీయ అవగాహన కానీ, పార్టీ కి అజెండా గానీ సరయిన దృక్పధం గానీ ఏవీ లేవని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా పవన్ అకస్మాత్తుగా జనసేన పార్టీ పెట్టినపుడు స్వాగతించినవారే నేడు ఆయనను విమర్శిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ వాస్తవిక దృక్పధం కనబరుస్తూ సరయిన నిర్ణయం తీసుకొన్నారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

 

పవన్ తన జనసేన పార్టీని ప్రకటిస్తున్న రోజునే తన ప్రధానోదేశ్యం అధికారం చెప్పటడం కాదని, కాంగ్రెస్ పార్టీని ఓడించడమేనని విస్పష్టంగా ప్రకటించారు. అదేవిధంగా తాను ఎన్నికలలో ఓట్లు చీల్చి రాష్ట్ర రాజకీయాలలో మరింత సంక్లిష్ట పరిస్థితి ఏర్పరిచేందుకు రావడం లేదని కూడా అప్పుడే ప్రకటించారు. ఆయన మొదటి నుండి పదేపదే చెపుతున్న ఈ విషయాలన్నిటినీ పరిగణనలోకి తీసుకొని చూసిన్నట్లయితే, ఆయన సరయిన దిశలోనే అడుగులు వేస్తున్నారని అర్ధమవుతుంది.

 

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా చాలా పార్టీలు పుట్టుకొచ్చాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా ఎన్నికలలో పోటీ చేసి ఉండి ఉంటే ఆయన కూడా ఓట్లను చీల్చి పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చి ఉండేవారు. కానీ ఆయన ఆవిధంగా చేయకుండా, రాష్ట్రంలో తేదేపాకు, కేంద్రంలో బీజేపీకి మద్దతు తెలిపేందుకు సిద్దపడ్డారు.

 

అందువల్ల ఆయన కాంగ్రెస్ పార్టీని పారద్రోలేందుకే దానికి ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న బీజేపీకి మద్దతు పలికారు తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదని అర్ధమవుతోంది. ఒకవేళ లెఫ్ట్ పార్టీలు అధ్వర్యంలో థర్డ్ ఫ్రంట్ బలమయిన ప్రత్యామ్నాయంగా నిలిచి ఉంటే, బహుశః బీజేపీకి బదులు ఆయన థర్డ్ ఫ్రంట్ కే మద్దతు తెలిపేవారేమో! ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మోడీ ప్రభంజనం వీస్తున్న సంగతినీ ఆయన పరిగణనలోకి తీసుకొన్న తరువాతనే ఆయనకు మద్దతు ప్రకటించారని భావించవచ్చును.

 

అంతేగాక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే, అసమర్ధుడు, ఎటువంటి పాలనానుభావం లేనివాడు, అవినీతి కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధి అయిన రాహుల్ గాంధీ చేతిలోకి దేశం వెళ్ళిపోతుంది. ఈ ప్రమాదాన్ని నివారించి సమర్ధుడు, మంచి పరిపాలనా దక్షుడు అని నిరూపించుకొన్న నరేంద్ర మోడీకే రాజ్యాధికారం కట్టబెట్టడం సముచితమని పవన్ కళ్యాణ్ భావించినందునే ఆయన తన (వామపక్ష) ఇజాన్ని, స్టార్ ఇమేజ్ ని అన్నిటినీ పక్కన పెట్టి బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్దపడ్డారు. అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీతో చేతులు కలిపి ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ విజవకాశాలను దెబ్బతీయడం ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ మళ్ళీ అధికారం చేజిక్కించుకోకుండా అడ్డుపడేందుకు నడుం బిగించారు.

 

పవన్ తెదేపాకు అనుకూలంగా మాట్లాడటానికి కూడా దాదాపు ఇవే కారణాలు వర్తింపజేసుకోవచ్చును. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే సరయిన నాయకత్వం, సరయిన పార్టీల కాంబినేషన్, వాటి మధ్య పూర్తి అవగాహన అత్యంత అవసరమని ఎవరికయినా తెలుసు. ఆంధ్రలో ఒక పార్టీ, తెలంగాణాలో మరొక పార్టీ, కేంద్రంలో ఈ రెంటికీ పూర్తి విభిన్నమయిన పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే, కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాల పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. అదే విషయాన్ని పవన్ నిన్న తన మాటలలో వ్యక్తం చేసారు. బహుశః ఈ ఉద్దేశ్యంతోనే పవన్ రాష్ట్రంలో ఉన్నపార్టీలలో సమర్ధమయినదని భావిస్తున్న తెదేపావైపు మొగ్గు చూపుతున్నారు.

 

తనకి రాష్ట్రంలో ఎంతమంది వీరాభిమానులు ఉన్నపటికీ కేవలం వారి అండతోనే తన పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవడం అసాధ్యమనే సంగతి పవన్ గ్రహించినందునే ఆయన చాలా వివేకం ప్రదర్శిస్తూ, తాను తెదేపాకు అనుకూలమని తెలిపారు. అందువల్ల పవన్ మరియు అతని పార్టీ సభ్యులు ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి పెద్దగా ప్రాధాన్యతనీయకుండా, రాష్ట్రంలో నిలకడ తేగల పార్టీకే పూర్తి మెజార్టీ దక్కేలా చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఈయవచ్చును.

 

దీనిని బట్టి పవన్ కళ్యాణ్ చాలా లోతుగా ఆలోచించిన తరువాతనే, పూర్తి విజ్ఞతతో కూడిన నిర్ణయాలు తీసుకొంటున్నారని అర్ధమవుతోంది. ఒక రాజకీయ మూస ధోరణిలో ఆలోచనలు చేసేవారికి ఇటువంటివి జీర్ణించుకోవడం కష్టమే.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.