ప్రజాభిప్రాయానికి అద్దం పట్టిన పవన్ ప్రసంగం

Publish Date:Mar 14, 2014

Advertisement

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపిస్తూ చేసిన ప్రసంగంలో కొంచెం నాటకీయత ఉన్నపటికీ, రాజకీయ మూస ప్రసంగాలకు పూర్తి భిన్నంగా, సగటు భారతీయ పౌరుడి ఆలోచనలకీ,ఆవేశానికీ,ఆవేదనకీ, ఆక్రోశానికి అద్దం పడుతున్నట్లు సాగింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ ప్రజల ముందు తను తాను పూర్తిగా ఆవిష్కరించుకొన్నారని చెప్పవచ్చును. ఆయన మాటలు హృదయంలో నుండి వచ్చినవి. మనస్పూర్తిగా మాట్లాడినవి. కనుక అవి అభిమానులకు, ప్రజలకు సరిగ్గానే చేరాయని భావించవచ్చును. ఆంధ్ర, తెలంగాణా, రాష్ట్ర విభజన, హిందూ ముస్లిం, కులాలతో సహా ఏ రాజకీయ నాయకుడు దైర్యం చేసి మాట్లాడలేని అనేక సున్నితమైన అంశాల గురించి పవన్ కళ్యాణ్ మనసు తెరిచి మాట్లాడి నిజంగానే మంచి దమ్మున్న రాజకీయ పవర్ స్టార్ అనిపించుకొన్నారు.

 

తను రాజకీయ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసి కొందరు కాపు కుల సంఘ నేతలు తనకు మద్దతు ఈయమని చెప్పడాన్ని ఆయన చాలా గాటుగా ఎవరూ ఊహించని రీతిలో ప్రశ్నించారు. “నన్ను నేను ఏ కులానికో, మతానికో చెందిన వాడినని ఎన్నడూ భావించలేదు. అయినా నేను వారిని మద్దతు ఈయమని అడిగానా? కులాల పేరు చెప్పుకొని ఓట్లు అడుకోవలసి వస్తే నేను అసలు రాజకీయాలలోకి వచ్చే వాడినే కాను,” అని అన్నారు.

 

రాష్ట్ర విభజన చేయడంలో కాంగ్రెస్ కబరచిన నిర్లక్ష్య ధోరణిని, తెలుగు ప్రజల పట్ల ప్రదర్శించిన చులకన భావాన్ని పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఎండగట్టారు. గత పదేళ్ళుసాగుతున్నతెలంగాణా ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేసినందున అనేక వందల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేసారు. ముఖ్యంగా ఆయన రాష్ట్ర విభజన చేసిన తీరుని తీవ్రంగా విమర్శించారు. అటు తెలంగాణా ప్రజలకీ ఆనందం కలిగించక, ఇటు సీమాంధ్ర ప్రజలకు ఆనందం కలిగించని విధంగా విభజన చేసి కాంగ్రెస్ చేతులు దులుపుకొందని విమర్శించారు.

 

కాంగ్రెస్ అధిష్టానంలో చిదంబరం, జైరామ్, షిండే, అహ్మద్ పటేల్, మోయిలీ తదితరులు తెలుగు ప్రజల పట్ల ప్రదర్శించిన అనుచిత వైఖరిని ఆయన తప్పుపట్టారు. రాష్ట్ర విభజన వ్యవహారంలో మన రాష్ట్ర నాయకులందరూ వ్యవహరించిన తీరు చూసి తనకు చాలా అసహ్యం కలిగిందని, వారి మీద కోపంతోనే రాజకీయ ప్రవేశం చేయవలసి వచ్చిందని ఆయన స్పష్టం చేసారు. ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాలుగా విడిపోతున్న తెలుగు ప్రజలను ఈ కపట రాజకీయ నాయకుల బారి నుండి కాపాడేందుకే పార్టీ పెట్టానని ఆయన అన్నారు.

 

తన పార్టీలో రాజకీయ బఫూన్లకు, జంప్ జిలానీలకు చోటు కల్పించనని స్పష్టం చేసారు. దేశ సమగ్రత, రాజకీయాలలో మంచి మార్పు తేవాలనే తపన ఉన్నవారేవరయినా జనసేనలోకి ఆహ్వానితులేనని తెలిపారు. దేశానికి ప్రధాన మంత్రి కావాలనుకొంటున్న రాహుల్ గాంధీ ముందుగా సమస్యలను ఏవిధంగా పరిష్కరించాలో తన నాయనమ్మ ఇందిరా గాంధీ నుండి నేర్చుకోమని సలహా ఇచ్చారు. ప్రజల మధ్య కులాలు, మతాలు, ప్రాంతాలు అంటూ చిచ్చుపెడుతూ అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీని దేశం నుండి తరిమి కొట్టాలని పవన్ కళ్యాణ్ తన అభిమానులకు పిలుపునిచ్చారు.

 

ఒక్క కాంగ్రెస్ పార్టీతో తప్ప మరే ఇతర పార్టీతో అయినా తాను చేతులు కలిపేందుకు సిద్దమని ఆయన ప్రకటించారు. త్వరలోనే తన అనుచరులతో చర్చించి ఈ విషయంలో మరింత స్పష్టత ఇస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే రాష్ట్రమంతటా పర్యటించి పార్టీ నిర్మాణం మొదలు పెడతానని చెప్పారు. ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా ఆయన ప్రజలు ఆశిస్తున్న మహిళకు భద్రత, మెరుగయిన వైద్య సేవలు, జవాబుదారీ గల భద్రతా వ్యవస్థ ఏర్పాటు, స్వచ్చమయిన పాలన అందించడం తన పార్టీ లక్ష్యాలుగా చెప్పుకొన్నారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.