జగన్ అవసరం జనానికి లేదని చాటుతున్న పవన్!

Publish Date:Jan 11, 2025

Advertisement

తిరుపతి తొక్కిసలాట ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించిన తీరుపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధానంగా ఆయన పోలీసుల పని తీరుపై చేసిన వ్యాఖ్యలు, అధికారుల సమన్వయలోపాన్ని ఎత్తి చూపిన తీరు పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనం సృష్ఠించాయి. సామాన్య జనం పవన్ మాటలు సూటిగా, నిర్మొహమాటంగా, నిష్కర్షగా ఉన్నాయని ప్రశంసలు కురిపిస్తుంటే.. వైసీపీయులు మాత్రం పవన్ వ్యాఖ్యలకు వక్రభాష్యం చెబుతూ.. కూటమి పార్టీల మధ్య గ్యాప్ పెరిగిందనడానికి ఇదే నిదర్శనమంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు పవన్  కల్యాణ్ ఏ సందర్భంలో పోలీసుల వైఫల్యం, అధికారుల సమన్వయ లోపం, టీటీడీ వీఐపీ యాటిట్యూడ్ పై వ్యాఖ్యలు చేశారన్నది గమనిస్తే.. వైసీపీయుల వ్యాఖ్యలు, విమర్శలూ అన్నీ రాజకీయలబ్ధి కోసం పడుతున్న వెంపర్లాటలో భాగమే అని ఇట్టే అవగతమౌతుంది. 

పవన్ కల్యాణ్ తాను భాగస్వామిగా ఉన్న ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న వారు ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే.. ఏపీలో ప్రతిపక్షం లేదు. విపక్షంగా వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్నప్పటికీ వారెవరూఅసెంబ్లీకి రావడం లేదు. ప్రజలు తిరస్కరించినా సరే తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనన్నఅసంబద్ధ డిమాండ్ తో అసెంబ్లీని బాయ్ కాట్ చేసింది. అడపాదడపా సోషల్ మీడియాలో విమర్శలు, ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే... ప్రభుత్వంపై నాలుగు రాళ్లేసి ముఖం చాటేయడం వినా ఆ పార్టీకి మరో యాక్టివిటీ కనిపించదు. విజయవాడను బుడమేరు వరద ముంచెత్తినప్పుడు కానీ, ఇప్పుడు తిరుపతి తొక్కిసలాట విషద సమయంలో కానీ ఆ పార్టీ రాజకీయం చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యత బాధితులకు స్వాంతన కలిగేలా వ్యవహరించడానికి ఇవ్వలేదు. శవ రాజకీయాల కోసం మాత్రమే ఆ పార్టీ అధినేత కానీ, నాయకులు కానీ బయటకు వస్తున్నారు. మీడియా ముందు మాట్లాడుతున్నారు. 

ఇక్కడే పవన్ కల్యాణ్ తిరుపతి తొక్కిసలాట ఘటనపై అధికారుల సమన్వయ లోపం, టీటీడీ వీఐపీ యాటిట్యూడ్ పై వ్యాఖ్యలు చేశారు. అంతే రాష్ట్రంలో ప్రతిపక్షం లేని లోటును పూడ్చేందుకు తాను ఉన్నానని చాటారు. ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉండి కూడా పొరపాట్లను ఎత్తి చూపారు. సరిదిద్దుకోవాలన్నారు. సరిదిద్దు కుంటామని చెప్పారు. ప్రభుత్వం తరఫున బాధితులకు, వారి కుటుంబాలకు క్షమాపణ చెప్పారు. ప్రతిపక్షం లేదు అన్న ప్రజలలో కలగకుండా.. ఆ బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుందన్న సంకేతాన్ని పవన్ తన వ్యాఖ్యల ద్వారా ఇచ్చారు. స్వపక్షంలోనే విపక్షంగా ఉంటామని ఆయన కూటమి ఎన్నికలలో  తిరుగులేని విజయం సాధించిన నాడే చాటారు. ఆయన ప్రకటనను అప్పట్లో చంద్రబాబు కూడా చాటారు. ప్రభుత్వంలో ఉన్నా కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన గళమెత్తుతుందనడానికి గతంలోనే ఉదాహరణలు బోలెడు ఉన్నాయి. 2014 ఎన్నికలలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసింది. అప్పడు తెలుగుదేశం ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై తెలుగుదేశం ఎమ్మెల్యేలే అప్పట్లో మంత్రులను అసెంబ్లీ సాక్షిగా నిలదీశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ అదే చేస్తున్నారు. అధికారంలో ఉన్నా కూడా ప్రజా సమస్యల విషయంలో స్పందిచడానికి స్వపర బేధం ఉండదని చాటారు.  

ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా అర్హత లేకున్నా ఆ హోదా కోసం పట్టుబడుతున్న వైసీపీ అధినేత, ఆ పార్టీ నేతలూ ఈ ఆర్నెళ్లలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం అని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క పనైనా చేశారా? అంటే లేదు.    ప్రభుత్వానికి ఇప్పటి వరకూ నిర్మాణాత్మక సూచన చేసిన ఉదంతం లేదు. ఇదీ ప్రభుత్వ వైఫల్యం అని ఎత్తి చూపిన ఒక్క సందర్భం లేదు. అసలు ఒక రాజకీయ పార్టీగా వైసీపీకి, ఆ పార్టీ నాయకుడిగా జగన్ కు ఒక దిశదశ ఉన్నట్లు కనిపించదు.  ఈ పరిస్థితులతో తామే ప్రతిపక్షంగా ఉంటామని కూటమిలోని పార్టీలు ముందుకు వస్తున్నాయి. అందులో భాగమే తిరుపతి తొక్కిసలాట వ్యవహారంలో  ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు. విమర్శలు. ఇది స్వాగతించాల్సిన అంశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్  ప్రతిపక్ష పాత్ర కూడా తానే పోషిస్తున్నారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతున్నారు. మా ప్రభుత్వం తప్పు చేసినా ఎత్తి చూపుతాననీ, సరిదిద్దుకునేలా చేస్తానని అంటున్నారు. ఇందులో తప్పుపట్టాల్సిందేముందని పరిశీలకులు అంటు న్నారు.   అధికారుల నిర్లక్ష్యాన్ని ఆయన గట్టిగా ప్రశ్నించారు.  బాధితులకు భరోసా ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షం చేతకాని తనాన్ని గుర్తించి.. ఆ బాధ్యతను కూడా తానే తీసుకున్నారు.  దీనిని స్వాగతించే సంస్కారం వైసీపీకి లేదు. కనీసం  చూసి నేర్చుకోవడానికైనా ప్రయత్నిస్తే మంచిదని పరిశీలకులు సూచిస్తున్నారు. 

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.