అధికారం చేజిక్కించుకోవడానికి పోటీ పడే రాజకీయ పార్టీలు హఠాత్తుగా దేశ భక్తి లో ఎవరు గొప్ప అనేది తేల్చుకోవడంలో పడ్డాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనేక సందర్భాల్లో వారిదే అసలు సిసలు దేశభక్తి అంటూ ప్రకటించడం పరిపాటిగా మారింది. దేశభక్తి దేశ ప్రజలందరికీ ఉంటుందని బీజేపీ వారు ఒక్కరే దేశభక్తులుగా భావించడం, కాషాయంలో మునిగితేలడం, ప్రజలందరినీ అదే రంగులో ప్రయాణిం చేలా ఉత్తేజితులను చేయడానికి కసరత్తులు చేయడం మాత్రం దేశభక్తి కాదన్నది విపక్షాల మాట.
కాలం మారినా, రాజకీయాలు మారినా, సిద్ధాంతాల పరంగా ఒకరికి ఒకరు పడకపోయినా దేశమంతటా అందరూ గౌరవించేది మహాత్మాగాంధీనే. ఎందుకంటే ఆయన మహాత్ముడు గనుక. కాంగ్రెస్ అంటే బొత్తిగా పడని టీఆర్ ఎస్ కూడా ఇపుడు కాంగ్రెస్ మాయలో పడిందనే అనుమానాలూ వస్తున్నాయి. అందుకు తాజా ఉదాహరణ తెలంగాణా రాష్ట్రమంతటా ఎంపిక చేసిన 522 సినిమా థియేటర్లలో గాంధీ సినిమా ప్రదర్శనకు టీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ సినిమా ఆగష్టు తొమ్మిది నుంచి 22వ తేదీ వరకూ ప్రదర్శిస్తారు. ప్రతీరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 నిమిషాల వరకూ ప్రదర్శిస్తారు.
బెన్ కింగ్స్టే గాంధీగా నటించిన అటన్బొరో చిత్రం ఇది. దేశమంతటా బ్రహ్మాండంగా కాబోయినా చాలా మందిని ఆకట్టుకుంది ఈ చిత్రం. ముఖ్యంగా బెన్ కింగ్స్లే గాంధీ పాత్రలో పరకాయప్రవేశం చేశాడు. ఆయన కోసమే సినిమాకి జనం వెళ్లారు. అయితే ఈ చిత్రం బ్రిటీషర్లు దేశానికి మహామేలు చేశారన్న ప్రస్థా వన మళ్లీ తెలియ జేయడమే ప్రధానంగా ఈ చిత్రం వ్యక్తం చేసిందనేది చాలామంది విమర్శకుల మాట.
కేంద్రంలో స్వాతంత్య్రదినోత్సవ వజ్రోత్సవాలను నిర్వహించే సమయంలోనే ఇక్కడ తెలంగాణాలోనూ కేసీఆర్ అందుకు పోటీగా నిర్వహించడం తన దేశభక్తిని ప్రదర్శించమే అయింది. బీజేపీ పట్ల తన విము ఖతను మరింత స్పష్టం చేయడానికే కాంగ్రెస్ కు మద్దతుగా మునుగోడు లో అభ్యర్ధిని నిలబెట్టడం లేదు. రాష్ట్ర అవసరాలాను, అభ్యర్ధనలను బొత్తిగా పట్టించుకోని కేంద్రం మాట వినక్కర్లేదన్న ధోరణినే టీఆర్ ఎస్ ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. టీఆర్ ఎస్ నాయకులు, మంత్రులు అవకాశం దొరికిన వేదికల మీద మోదీ ప్రభుత్వం మీద, బీజేపీ పార్టీ మీద విరుచుకుపడుతున్నారు. దేశ భక్తి అంటే కేవలం బీజెపీ ఓవరాక్షన్తో వ్యవహరించడమేకాదని దేశభక్తి తమకూ ఉందని టీఆర్ ఎస్ ప్రకటించడానికే ఇపుడు రాష్ట్రంలో గాంధీ సినిమా ప్రదర్శనకు పూనుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/patriotism--the-way-blowing-now-39-141587.html
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.