Publish Date:Aug 23, 2023
కేబినెట్ విస్తరణ నిర్ణయం పూర్తిగా ముఖ్యమంత్రిదే. తేన కేబినెట్ లో ఎవరు ఉండాలి, ఎవరిని తొలగించాలన్న నిర్ణయాధికారంలో మరొకరి జోక్యానికి తావేలేదు. రాజ్యాంగ బద్ధంగా అది ముఖ్యమంత్రికి సంక్రమించిన అధికారం. సీఎం ప్రతిపాదించి పంపిన వారి చేత ప్రమాణ స్వీకారం చేయించడం మాత్రమే గవర్నర్ చేయాల్సింది. చేయగలిగింది. ఈ వ్యవహారంలో కానీ విషయంలో కానీ ఎవరికీ ఎటువంటి అనుమానాలూ, సందేహాలూ లేవు. కానీ తెలంగాణలో మాత్రం అసెంబ్లీ ఎన్నికల ముంగిట కేసీఆర్ తలపెట్టిన మంత్రివర్గ విస్తరణ రాజకీయవర్గాలలోనే కాదు బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఉత్కంఠ రేపుతోంది. ఏం జురుగుతుంది? ఏం జరగబోతోంది? అన్న సస్పెన్స్ రేపుతోంది.
ఇంతకీ విషయమేమిటంటే.. రానున్న అసెబ్లీ ఎన్నికలలో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను 105 పేర్లతో కేసీఆర్ ప్రకటించారు. అలా ప్రకటించిన వెంటనే ఇలా మంత్రివర్గ విస్తరణకు రెడీ అయ్యారు. మంత్రివర్గంలోకి పట్నం మహేందర్రెడ్డిని తీసుకోవాలని ప్రభుత్వం భావించారు. ప్రమాణ స్వీకారం కోసం సమయం కేటాయించాలంటూ రాజ్భవన్కు సోమవారమే ప్రభుత్వం వర్తమానం పంపింది. సప్తమి రోజున మంచి ముహూర్తం కనుక ఆ రోజు అంటే బుధవారం(ఆగస్టు 23)న ఆ కార్యక్రమం ఖరారు చేయాలని విజ్ణప్తి కూడా చేసింది. ఉదయం 11.30 గంటలకు మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రభుత్వం నుంచి లీకులు కూడా వచ్చాయి.
స్వయంగా పట్నం మహేందర్ రెడ్డే మీడియాతో చిట్ చాట్ చేస్తూ తన ప్రమాణ స్వీకారం బుధవారం (ఆగస్టు 23) ఉదయం పదకొండున్నరకు ఉంటుందని కూడా చెప్పారు. అయితే రాజ్ భవన్ నుంచి మాత్రం ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం లేదు. అప్పాయింట్ మెంట్ కూడా ఫిక్స్ కలేదు. ఆమె డెంటల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారనీ, అందుకే అప్పాయింట్ మెంట్ ఖరారు కాలేదనీ రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి.
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సోమవారం (ఆగస్టు 21 వరకూ పుదుచ్చేరిలో ఉన్నారు. మంగళవారం అంతా ఆమె హైదరాబాద్లోనే ఉన్నారు. దీంతో ప్రభుత్వం తమ వినతి మేరకు బుధవారం (ఆగస్టు 23) ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం జరిపించేందుకు ఎటువంటి అవాంతరం ఉండదని భావించినప్పటికీ రాజ్భవన్ నుంచి సమాచారం లేకపోవడంతో ఉత్కంఠ మొదలైంది. ఆమె నుంచి ఎప్పుడు సమాచారం వస్తుందా అని టెన్షన్ పడుతోంది. రాజ్ భవన్, ప్రగతి భవన్ విభేదాలే ఈ జాప్యానికి కారణమా అన్న అనుమానాలూ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/patnam-mahinder-reddy-swornin-cermony-39-160429.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.