పాస్‌పోర్ట్ సిటిజన్ షిప్ కు రుజువు కాదు: కేంద్రం ప్రకటన!

Publish Date:Jun 25, 2026

Advertisement

ఇండియన్ పాస్ పోర్టు ఉన్నంత మాత్రాన  ఇండియన్ సిటిజన్ అయిపోయినట్లు కాదని కేంద్ర ప్రభుత్వం విస్పష్టంగా పేర్కొంది.  ఇండియన్ పాస్‌పోర్ట్ అనేది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీ చేసే ఒక ప్రయాణ పత్రం మాత్రమే కానీ.. అదే సిటిజన్ షిప్ ను రుజువు కాదని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ క్లారిఫై చేసింది.  పాస్‌పోర్ట్ సేవా దివస్  సందర్భంగా విదేశాంగ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి ఈ మేరకు అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు. 

 ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణల నేపథ్యంలో ఓటర్ లిస్ట్ నుండి ఎవరైనా తొలగించబడితే, వారు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి పాస్‌పోర్ట్‌ను  ఆధారంగా చూపించవచ్చా అన్న ప్రశ్నకు ఆయనీ బదులిచ్చారు.  చట్టపరంగా చూస్తే పాస్‌పోర్ట్ అనేది విదేశాల్లో   జాతీయతను సూచిస్తుందే తప్ప, అది భారతదేశ పౌరసత్వ పత్రం కాదని కుండబద్దలు కొట్టారు.  

కేంద్రం ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు, రాజకీయ దుమారానికి దారితీసింది. ప్రతిపక్షాలు ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం  నాయకుడు  ఆదిత్య థాకరే ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది  విడ్డూరంగా ఉందని  మండిపడ్డారు. పాస్‌పోర్ట్ అనేది పౌరసత్వ పత్రం కానప్పుడు.. దానిని ఒక సాధారణ పౌరుడికి జారీ చేసే ముందు పోలీసులు ఎందుకు అన్ని రకాల వెరిఫికేషన్లు చేస్తారని  నిలదీశారు. నాన్ ఇండియన్స్ కూడా  పాస్‌పోర్ట్‌లను ట్రావెల్ డాక్యుమెంట్లుగా కేంద్రం ఇస్తుందా అని నిలదీశారు. కేంద్రం చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయంగా ఇండియన్ పాస్‌పోర్ట్  చట్టబద్ధత పై తీవ్ర అనుమానాలు రేకెత్తించేలా ఉందని సామాజిక మాధ్యమ వేదికలో ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 

గతంలో సుప్రీం కోర్టుతోపాటు పలు రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన వివిధ తీర్పుల ప్రకారం.. భారతదేశంలో ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్.  గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇచ్చే సర్టిఫికెట్లు ఏవీ కూడా  పౌరసత్వానికి తిరుగులేని చట్టపరమైన ఆధారాలు కావు. ఇవన్నీ కేవలం ఒక వ్యక్తి గుర్తింపు,  నివాస ధ్రువీకరణ కు మాత్రమే   పనికొస్తాయి. విదేశాల నుండి భారతదేశానికి వచ్చి ఇక్కడి పౌరసత్వం తీసుకునే వారికి మాత్రమే భారత ప్రభుత్వం ప్రత్యేకంగా సిటిజన్‌షిప్ సర్టిఫికెట్' జారీ చేస్తుంది. కానీ   దేశంలోనే పుట్టి పెరిగిన  ఇండియన్స్ కుఅలాంటి  పౌరసత్వ పత్రం ఏదీ ఉండదు. ఈ నేపథ్యంలోనే కేంద్రం చేసిన ఈ తాజా ప్రకటన   ప్రజల్లో తీవ్ర గందరగొళానికీ, చర్చకూ దారి తీసింది.   

By
en-us Political News

  
కేజీఎఫ్ చేతులెత్తేసిన చోట తవ్వకాలు సాధ్యమా...?
యావత్ దేశం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
తెలంగాణ పోలీస్ శాఖలో భారీ స్థాయిలో బదిలీల పర్వం చోటుచేసుకుంది.
ఘాట్కేసర్‌లో అర్థరాత్రి వేళ చోటుచేసుకున్న ఘటన స్థానికులను కలవరానికి గురిచేసింది.
తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
వేడివేడి బజ్జీల వాసనతో ఆకర్షితులైన స్థానికులు వాటిని ఆస్వాదించేందుకు ఆగిపోయారు.
తెలంగాణ ప్రభుత్వం వీఐపీల భద్రత కుదింపు నిర్ణయాని కారణం, రాష్ట్రంలో పూర్తిగా తొలగిపోయిన నక్సల్స్ సమస్యగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతంలో తెలంగాణ సరిహద్దుల్లోనూ, కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ తీవ్రంగా ఉన్న మావోయిస్టుల ప్రభావం ఇప్పుడు కలికానిక్కూడా కనిపించనంతా తగ్గిపోయిందని ఆ నివేదిక స్పష్టం చేస్తున్నదని పేర్కొంది.
ఇరాన్‌పై అమెరికా దాడి చేసింది. దీంతో ఇరాన్‌ అమెరికా అనుకూల దేశాలపై ప్రతీకార దాడులు చేపట్టింది. ఈ క్రమంలో పనామా జెండా ఎగురవేస్తున్న కికు అనే చమురు నౌకపై డ్రోన్‌ దాడి జరిగింది. ఆ నౌకలో సుమారు రెండు మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురు ఉండగా, సిబ్బంది ఎవరికీ హాని కలగలేదు. ఈ ఘటన తర్వాత అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఇరాన్‌లోని పది ముఖ్యమైన సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసింది.
సాంకేతికత ఎంత పెరిగినా వైద్యానికి ప్రత్యామ్నాయం కాలేదనే చేదు నిజాన్ని మరోసారి నిరూపించింది.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా మధిరలో బహిరంగ సభ నిర్వహించడం సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు. హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోవడం, మైదానాలు వాన నీటితో నిండిపోవడంతో ముఖ్యమంత్రి పర్యటనను రద్దు చేసుకోక తప్పలేదు.
గత కొంతకాలంగా ప్రేమించుకున్న యువతి, యువకుడు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు
ప్రభుత్వం చేపట్టిన ఎస్‌ఐఆర్ సర్వే, నివేదికల ప్రక్రియ ముజీబుర్ రహ్మాన్ జీవితంలో తీవ్ర ఆందోళనను నింపింది. ఈ ఎస్‌ఐఆర్ జాబితాలో తన పేరు లేదనే విషయం అతనికి తెలిసింది. తన పేరు నమోదు కాకపోవడంతో భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా వచ్చే ఎటువంటి సహాయం లేదా పెన్షన్లు, రేషన్ వంటి ప్రయోజనాలు తన ఇద్దరు దివ్యాంగులైన పిల్లలకు అందవేమోనని అతనుఆందోళనకుగురయ్యాడు.
ఆయన ఐదు రోజుల్లో నాలుగు రోజుల జిల్లాల పర్యటనలో భాగంగా తొలుత నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పేదల సేవలో కార్యక్రమం ద్వారా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని సీఎం చంద్రబాబు లబ్థిదారులకు అంద జేస్తారు. అదే రోజు తిరుపతి చేరుకుని అక్కడి శ్రీసిటీలో.. హీరో మోటో కార్ప్ సుమా . 750 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రాత్రికి శ్రీసిటీలోనే బస చేస్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.