Publish Date:Oct 16, 2019
పోలీసులకు వారాంతంలో సెలవులు ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు ఏపీ హోంమత్రి సుచరిత. డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలను అరికట్టాలని సూచించారు. మంగళగిరి ఆరవ పోలీస్ బెటాలియన్ లో ఇవాళ డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత శిక్షణ పూర్తి చేసుకున్న తొలి డీఎస్పీల టీమ్ ఇదే. ఈ టీమ్ లోని మొత్తం ఇరవై ఐదు మంది డీఎస్పీలలో పదకొండు మంది మహిళలు ఉన్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న డీఎస్పీల నుంచి హోంమంత్రి సుచరిత గౌరవ వందనం స్వీకరించారు. వృత్తిపరమైన సవాళ్లను అధిగమించి ప్రజాసేవ దిశగా ముందుకు వెళ్లాలని పిలుపు నిచ్చారు ఆమె. గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.
సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కొత్త డీఎస్పీలకు చెప్పారు డిజిపి సవాంగ్. విధి నిర్వహణలో అనేక సవాళ్లు, అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయని, వాటన్నింటిని విజయవంతంగా ఎదుర్కోవాలంటే ధైర్యం, సంకల్పం మరియు ఉన్నత విలువలతో వ్యవహరించవలసినటువంటి అవసరముంది అన్నారు. మన జనాభాలో డెబ్బై శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు అని, అందువలన గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలపై లోతైన అవగాహన మీరు కలిగి వుండవలసినటువంటి అవసరం ఉందని అందుకోసం విస్తృతంగా గ్రామాల్లో మీరు పర్యటించాలి అని, వారితో మమేకమవ్వాలి అని సూచించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/passing-out-parade-of-2018-batch-dsps-held-at-amaravati-25-90164.html
Publish Date:Dec 10, 2025
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
Publish Date:Dec 10, 2025
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండకు దగ్గర్లో ఒక దర్గా ఉంటే.. ఆ దర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై తమిళ కార్తీక దీపం పెట్టడం అనాదిగా వస్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.