ప్లీన‌రీ పాసుల కోసం గులాబీ లొల్లి.. న‌గ‌ర‌మా? ఫ్లెక్సీల మ‌య‌మా?

Publish Date:Oct 25, 2021

Advertisement

సామాన్యులకో రూల్‌.. అధికార పార్టీకి మ‌రో రూలా? హైద‌రాబాద్‌లో ఇంటి గేటుకు టు-లెట్ బోర్డు పెడితినే ఫైన్లు వేస్తూ జీహెచ్ఎమ్‌సీ అధికారులు ఓవ‌రాక్ష‌న్ చేస్తున్నారు. అదే టీఆర్ఎస్ పార్టీ మాత్రం న‌గ‌ర‌మంతా ఫ్లెక్సీల‌తో, కేసీఆర్ క‌టౌట్ల‌తో, గులాబీ జెండాల‌తో నింపేస్తే ప‌ట్టించుకోరా? హైకోర్టు అంత సీరియ‌స్‌గా చెప్పినా.. రూల్స్ ఫ‌క్కాగా ఉన్న ప్ర‌భుత్వ పార్టీకి పాల‌నా యంత్రాంగం మ‌రీ ఇంత‌లా కొమ్ముకాయ‌డమేంటి? ఒక‌టా..రెండా.. హైద‌రాబాద్ మొత్తం.. ఏ ఏరియాలో చూసినా.. ఏ గ‌ల్లీకి వెళ్లినా.. గులాబీ మ‌య‌మే. ఇంత‌లా ఓపెన్‌గా ఫ్లెక్సీలు, జెండాలు క‌నిపిస్తున్నా.. బ‌ల్దియా సిబ్బంది ఇప్ప‌టి వ‌ర‌కూ వాటిని ట‌చ్ చేయ‌క‌పోవ‌డం.. వారిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం దారుణం. ప్లీన‌రీ మొత్తం ముగిసాక‌.. ప‌ని అయిపోయాక‌.. తీరిగ్గా రేపో ఎల్లుండో తీసేస్తారు కాబోలు. ఏదో నామిన‌ల్‌గా ల‌క్షో, ప‌ది ల‌క్ష‌లో ఫైన్ వేసి.. చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని క‌వ‌రింగ్ ఇస్తారు కాబోలు. అద‌లా ఉంటే....

ఇక‌.. గులాబీ పండుగకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా జరగనున్న టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడేళ్ల తర్వాత ప్లీనరీ నిర్వహిస్తుండ‌టంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే, ఈసారి ప్లీనరీ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో పాస్‌లు ఇవ్వడం.. కేవ‌లం 6 వేల మందికి మాత్ర‌మే ఆహ్వానాలు పంప‌డంతో గులాబీ కార్య‌క‌ర్తలు గొడ‌వ‌కు దిగుతున్నారు. మాకంటే మాకు పాసులు కావాలంటూ లోక‌ల్ లీడ‌ర్ల‌పై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. ఈ ప‌రిణౄమం  ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు తలనొప్పిగా మారింది. పాస్‌ల కోసం ముఖ్య కార్యకర్తలు పోటీపడడంతో ఎవరికి ఇవ్వాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. 

ఇక కేసీఆర్ దావ‌త్ ఇస్తే ఎట్టా ఉంటాదో తెలియాలంటే టీఆర్ఎస్ ప్లీన‌రీకి వెళ్లాల్సిందే. ప్లీనరీకి వచ్చే ప్రతినిధుల కోసం 9 రకాల నాన్‌ వెజ్‌ ఐటమ్స్‌ సహా మొత్తం 33 రకాల వంటకాలు రెడీ చేశారు. మ‌ధ్యాహ్నం కాగానే లొట్ట‌లేసుకుంటూ తిన‌డ‌మే త‌రువాయి.

ఇక సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ఆధ్వ‌ర్యంలో 2,200మంది సిబ్బందితో గ‌ట్టి పోలీస్ బందోబ‌స్తు ఏర్పాటైంది. ప్లీనరీకి భారీ సంఖ్యలో వాహనాలు రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు. 

By
en-us Political News

  
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-12
చత్తీస్ గడ్ లోని  నారాయణ పూర్  భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమీప ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది.
ఇవాళా రేపు పెళ్ళి వేదికల మీద పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ముద్దు పెట్టుకోవడం మామూలు విషయమే.. పాపం పెళ్ళికొడుకు కూడా అదే పని చేశాడు. దాంతో పెళ్ళికూతురు తరఫు వాళ్ళ చేతిలో చావుదెబ్బలు తిన్నాడు.
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల పోలింగ్‌ స్టేషన్‌లో ఈవీఎం యంత్రాలను  ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , అతడి సోదరుడి కోసం రెండు రాష్ట్రాల పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఫలితాలలో మొదటగా వచ్చే ఫలితం నగరిదే.. అంటే, వైసీపీకి ఓటమి బోణీ కొట్టేది రోజా నియోజకవర్గమేనన్నమాట.. పాపం వైసీపీ, అయ్యో పాపం రోజా
ప్రపంచ మానవాళికి చక్కటి జీవన విధానాన్ని అందించిన గౌతమ బుద్దుడు గొప్ప దార్శనికుడని , ఆయన చూపిన అష్టాంగ మార్గం ఆచరణీయమని తెలంగాణ పర్యాటకాభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె. రమేష్ నాయుడు అన్నారు.
ముస్లిం ఉప కులాలకు రిజర్వేషన్‌ కల్పించేందుకు ఉద్దేశించిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం 2010 తరువాత ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు 77 ముస్లిం ఉప కులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమని ధర్మాసనం తెలిపింది.
దేవుడా... కొడాలి నాని బతకాలి.. ఆయన మళ్ళీ మామూలు మనిషిలా అందరిలో తిరగాలి.. అని పార్టీ నాయకులు, కార్యకర్తలు హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు.
పోలింగ్ బూత్ లో దౌర్జన్యం చేసి ఈవీఎం ను ధ్వంసం చేసిన మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రజాస్వామ్యం ముసుగు వేసుకుని అనేక రకాల హింసాయుత పద్ధతులను ఆచరించి ప్రజాస్వామ్య వ్యవస్థను, దేశ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే వారికి ఈ దేశంలో కొదవలేదు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో వెలుగులోకి వచ్చిన క్షణం నుంచీ అధికార వైసీపీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. స్వయంగా అభ్యర్థే పోలింగ్ బూత్ లో దౌర్జన్యం చేసి, అందరినీ బెదరించి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
గుడివాడ సిట్టింగ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
పిన్నెల్లి బ్రదర్స్ కూడా అలాగే ఎన్‌కౌంటర్ అయిపోతారేమోనని అమాయక జనం అనుకుంటున్నారు. ఈ రకంగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.