పార్లమెంటులో 'తెలంగాణ' భేరి
Publish Date:Mar 26, 2012
Advertisement
న్యూఢిల్లీ: పార్లమెంటులో చాలా రోజుల తరువాత సోమవారం మరోసారి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అంశం మారుమోగనుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, పౌరసమాజం నాయకుడు అన్నా హజారే ఢిల్లీలో ఆదివారం జరిపిన దీక్ష, బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం తదితర అంశాలపై ప్రతిపక్ష పార్టీలు సర్కారును నిలదీయనున్నాయి. దీనితో పార్లమెంటు ఉభయ సభలు సోమవారం సజావుగా కొనసాగే సూచనలు కనిపించటం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి, బిజెపితోపాటు రాష్ట్ర కాంగ్రెస్కు చెందిన సభ్యులు లోక్సభలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించనున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న టిఆర్ఎస్ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు కె. చంద్రశేఖరరావు, విజయశాంతి రేపు తెలంగాణ అంశంపై లోక్సభను స్తంభింపజేయనున్నారు. కెసిఆర్ ఢిల్లీకి చేరిన అనంతరం లోక్సభలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించే విషయంపై బిజెపి, తదితర జాతీయ పార్టీల నాయకులతో టెలిఫోన్ సంభాషణలు జరిపినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణ అంశం గురించి వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోరినట్లు టిఆర్ఎస్ నాయకుడు జితేందర్ రెడ్డి చెబుతున్నారు. బిజెపి తదితర ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు ఉభయ సభల్లో పౌరసమాజం నాయకుడు అన్నా హజారే ఢిల్లీలో చేసిన దీక్షపై ప్రశ్నించనున్నారు. హజారే ప్రస్తావించిన పలువురు అవినీతి మంత్రుల గురించి యుపిఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలదీయాలని బిజెపి నిర్ణయించింది. దీనితోపాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించాలని ఆలోచిస్తోంది. టిఆర్ఎస్, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపిలతో పాటు బిజెపి కూడా తోడైతే లోక్సభలో తెలంగాణ అంశం దద్దరిల్లుతుందని అంటున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఏడు ఉపఎన్నికల్లో బిజెపి మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించిన విషయం తెలిసిందే.
బిజెపి జాతీయ నాయకులు మహబూబ్నగర్ విజయాన్ని ఆసరాగా తీసుకుని తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని ఆలోచిస్తోంది. దీని కోసం తెలంగాణ అంశాన్ని లోక్సభలో ప్రస్తావించాలని ఆ పార్టీ జాతీయ నాయకులు ఆలోచిస్తున్నారు. బిజెపి, టిఆర్ఎస్లతో పోటీగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశాన్ని లోక్సభలో ప్రస్తావించేందుకు రాష్ట్ర కాంగ్రెస్కు చెందిన తెలంగాణ ప్రాంతం ఎంపిలు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర కాంగ్రెస్కు చెందిన తెలంగాణ ఎంపిలు లోక్సభలో తెలంగాణ అంశంపై గొడవ చేయకుండా చూసేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం ప్రయత్నిస్తోంది. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపిలు మాత్రం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎంతకైనా తెగిస్తామని చెబుతున్నారు. మొత్తం మీద సోమవారం పార్లమెంటులో తెలంగాణ భేరి మోగడం ఖాయంగా కనిపిస్తున్నది.
http://www.teluguone.com/news/content/parliament-24-12902.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





