అసెంబ్లీని కుదుపుతున్న 'తెలంగాణ' రగడ
Publish Date:Mar 26, 2012
Advertisement
హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలు మరో నాలుగు రోజులు మాత్రమే ఉండగా తెలంగాణ డిమాండ్తో సభను స్తంభింప చేయాలని తెరాస నిర్ణయించడంతో ఇక సమావేశాలు సజావుగా జరిగే అవకాశం కనిపించడం లేదు. మిగిలిన నాలుగు రోజుల సమావేశాలను తెలంగాణ అంశంతో తెరాస హైజాక్ చేయనుంది. తెలంగాణ డిమాండ్తో ఢిల్లీలో లోక్సభను, ఇక్కడ శాసనసభను జరగనీయకుండా అడ్డుకుంటామని తెరాస అధినేత కెసిఆర్ స్వయంగా ప్రకటించారు. తెలంగాణ అంశంపై స్తంభనతో మొదలైన శాసనసభ బడ్జెట్ సమావేశాలు అదే అంశంతోనే ముగియనున్నాయి.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు సోమవారం శాసనసభ ప్రారంభం కాగానే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెరాసకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నాగం జనార్దన్రెడ్డి, బిజెపి ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే తెలంగాణపై సభలో తీర్మానం చేయాలన్న డిమాండ్తో సభా కార్యక్రమాలను స్తంభింపచేయాలని తెరాస నిర్ణయించింది. తెలంగాణ అంశంపై రాజీనామా చేసి మళ్ళీ గెలుపొందిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నాగం జనార్దన్రెడ్డి కూడా తెలంగాణ అంశంలో తెరాసతో జత కట్టనున్నారు. తెలంగాణ డిమాండ్తో వరంగల్లో భోజ్యానాయక్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనను తెరాస ప్రధానంగా ప్రస్తావించనుంది. బడ్జెట్ సమావేశాలు ఆరంభమైనపుడు తెరాసకు పన్నెండు మంది సభ్యులుండగా ఇపుడు వారి సంఖ్య పదహారుకు పెరిగింది.
శాసనసభ సమావేశాలు ప్రారంభమైనపుడు మొదటి ఐదు రోజులూ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండానే సమావేశాలు వాయిదా పడుతూ వచ్చాయి. తెలంగాణ డిమాండ్తో తెరాస, మద్యం సిండికేట్లపై చర్చ డిమాండ్తో తెలుగుదేశం సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ తెరాస తెలంగాణ డిమాండ్ను తెరపైకి తీసుకురాగా, ఇపుడు తెలుగుదేశం పార్టీ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల అంశంతో పాటు ‘అవినీతి మంత్రుల’ అంశాన్ని కూడా ప్రస్తావించడం ద్వారా సభను అడ్డుకోవాలని నిర్ణయించింది. ఇతర ప్రతిపక్షాలు కూడా ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల అంశంపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని నిర్ణయించాయి.
http://www.teluguone.com/news/content/assembly-24-12901.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





