పరకాలలో గెలిచిన వాదం ఏది?
Publish Date:Jun 18, 2012
Advertisement
పరకాల అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలో సమైక్యతాపార్టీలే గెలుపొందాయి. దానికి తాజా ఉదాహరణ చావుతప్పి కన్నులొట్టబోయిన టి.ఆర్.ఎస్. మెజార్టీయే. అదీ వెయ్యి ఐదొందల చిల్లర ఓట్లు మాత్రమే. ఈ ఫలితాన్ని ఉన్నదున్నట్టుగా ప్రకటించిన విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ పై అనవసరంగా చేతకాని వెయ్యిగొంతులు ఎకబికిన విమర్శలు గుప్పిస్తున్నాయి. అసలు ప్రణాలికే లేని తెలంగాణా పార్టీలకు, ఉద్యమ సారధులకు ఉన్నది మాట్లాడితే ఉలుకు అన్నట్లుంది ఎంపి పొన్నం ప్రభాకర్ వైఖరి. ఆయన తన సిగ్గులేనితనాన్ని లగడపాటిపై కారుకూతలతో కాటేసేందుకు ప్రదర్శించారు. లగడపాటి అన్నట్టు 65శాతం సమైక్యవాద పార్టీలకే పరకాలలో ఓట్లు లబించాయి. అక్కడ అసలు తెలంగాణా వాదమన్నదే గెలవలేదన్నది నగ్నసత్యం. మాజీమంత్రి జీవన్ రెడ్డి కూడా రెచ్చిపోయారు. పైగా ఆయన ఓ సలహా కూడా పడేశారు. ఉన్న ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తే తెలంగాణా వచ్చేస్తుందని జీవన్ రెడ్డి గొప్పగా శెలవిచ్చారు. వెనుకటికి ఎవడో పిచ్చికుదిరింది తలకు రోకలిచుట్టమన్నట్లు ఈ రాజీనామాలు చేస్తే వచ్చేది ఎన్నికలే కానీ, తెలంగాణా రాష్ట్రం మాత్రం రాదని మేథావులు చెప్పినా పాపం జీవన్ రెడ్డికి ఇంకా అర్థం కాలేదనుకుంటా. ఇక టి.ఆర్.ఎస్.కి ఏమి మాట్లాడాలో తెలియని సారథి డైరెక్షన్ లో లగడపాటికి ఓ చిన్న హెచ్చరిక చేసి హమ్మయ్య ఆయన్ను బెదిరించేశాం. ఇక మనపని పూర్తయిందనుకుని చేతులు కడిగేసుకుంది.
http://www.teluguone.com/news/content/parakala-by-polls-24-14951.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





