ఆహారంతోనే ఆరోగ్యం

Publish Date:Jan 8, 2021

Advertisement

అనారోగ్యంతో శారీరక మానసిక ఆధ్యాత్మిక అంశాలు ఉన్నాయన్న అంశాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఎందుకంటే శారీరకంగా బలంగా ఉండడం ముఖ్యం  దాంతో పాటు మానసిక దృఢత్వం కూడా అవసరం. దీనికి తోడు ఆధ్యాత్మిక భావన ఉన్నపుడే వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యం పొందగలడు. అయితే ఆధునిక సమాజంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఒక మాత్ర ఉంటె చాలు లేదా ఆసుపత్రిలో చేరితే చాలు అనుకోవడం అది ఒక ఉపసమనం కోసమే అన్న విషయం  గ్రహించాలి. ఆసుపత్రికి  వెళితే  మందు వేసుకుంటే  తగ్గి పోతుంది అన్నది కేవలం విశ్వాసం మాత్రమే. మనకు మనపై విశ్వాశ్వనీయత లేనప్పుడు మాత్రమే దీర్ఘ ఆలోచనకు గురి అవుతారు. ఒత్తిడికి గురిఅవుతారు. అదే అనారోగ్యానికి దారి తీస్తుంది అన్నది సత్యం శారీరకంగా శ్రమించండి, మానసిక దృడత్వం కలిగి ఉండడం ముఖ్యం, ఆధ్యాత్మిక భావన ద్వారా స్థితి గతులను తెలుసుకోడం తదనుగుణంగా ప్రవర్తించడం వ్యవహరించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చన్న భావన                                
  
సాత్విక ఆహారం, సహజమైన ఆహరం, పోపుష్టికా ఆహారం  తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యానికి  ఒక పునాది మాత్రమే. ఉదాహరణకు ---  సరైన పునాది  ఉన్నప్పుడే కట్టడం పటిష్టంగా ఉంటుంది. కొన్ని తరాలు నిలబడుతుంది. లేదంటే కూలిపోతుంది. అందుకే పునాదిలేని ఆహారం అంటే సాత్విక ఆహరం కాని మరో ఆహరం తీసుకుంటే ఆరోగ్యం చిన్నాభిన్నమౌతుంది. సంపూర్ణ ఆహరం తీసుకుంటే పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండగలమన్నది  దీని అర్ధం.             

ఉన్నత జీవన ప్రమాణాల్లో జీవించాలన్నా విజయం సాధించడానికి మూలాధారం సంపూర్ణ ఆరోగ్యం మాత్రమే అన్న విషయం తెలుసుకోవాలి. దీర్ఘ కాలంగా ఆరోగ్యంగా ఉండాలి, శరీరం దృడంగా ఉండాలి, అందరు అనుకుంటున్నట్టు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలంటే మీరు సరైన ఆహరం తీసుకోవాలి అప్పుడే మీరు జీవించడం సాధ్యం. సమయ పాలన,సరైన, సహజమైన ప్రాకృతిక ఆహారం తీసుకోవాలి, సంప్రదాయాన్ని పాటిస్తూ, జ్ఞానాన్ని పొందడం ముఖ్యం. దీనికి మరోమార్గం లేదన్నది వాస్తవం.                                                                                                                  

ఆహారానికి ఆరోగ్యానికి సంబంధం ఉన్నదనే  ప్రగాఢ విశ్వాసం నమ్మకం ఉండాలి. ఆహారాన్ని  సహజమైన ప్రాకృతిక సేంద్రియ పద్ధతులలోనే పండించాలి. మనం కృత్రిమ రసాయనాల ద్వారా పండించిన ఆహారంతో పోలిస్తే ప్రాకృతిక వ్యవాసాయం ద్వారా పండించిన ఆహారంలో పోషక విలువలు ఉన్నాయన్న విషయం గ్రహించమని నిపుణులు చెపుతున్నారు. రసాయనాల ద్వారా పండించిన పంట, అనారోగ్యానికి కారణమౌతుందనేది కూడా నిజం. ఆదిశగా సేంద్రియ వ్యవసాయంతో పండిన కూరాగాయాలలో పోషక విలువలు ఉండడంతో పాటు, స్వదేశీ ఆవుల పోషణ, సంరక్షణతో చేస్తున్న వ్యవసాయ పద్ధతుల తో మంచిఉత్పత్తులు సాధించవచ్చని, అది ఆచరణ సాధ్యమని తెలుస్తోంది .                                                                                                                                  

పంచ సూత్ర పర్ఫెక్ట్ హెల్త్
ఆధునిక సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో ఎన్నో రకాల దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు గొప్ప, బీదా అన్నతేడా లేకుండా అన్నివయసుల వాళ్ళని  వేధిస్తున్నాయి అన్నది వాస్తవం. ఇందులో కొన్ని వ్యాధులను నేటికీ నిరోధించలేని పరిస్థితి. ఆరోగ్యం అంశాలపై ఎన్నో పద్ధతులు చూసాం. అమలు లోకి వచ్చాయి. ప్రివెన్షన్ రివర్సల్ రెండిటిని అనుసంధానం చేస్తూ అటు సాంప్రదాయమ లో ఉన్నా అనుభవాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేసిన పంచ సూత్ర ఉత్తమమైనదని చెప్పవచ్చు. ఆయుర్వేదం మరియు ఆధునిక న్యుట్రా జనో మిక్స్ ను రూపొందించినట్లు నిపుణులు వివరించారు. ఆహారం ద్వారా మాత్రమే ఆరోగ్యం సాధ్యం. ఆహరం ప్రాకృతిక మైనది సహజమైనది పూర్తిగా పోషకవిలువలు న్యూట్రీషియన్స్ ఉండాలి. పంచసూత్ర ద్వారా న్యూట్రీషియన్స్ ద్వారా దీర్ఘ కాళిక వ్యాధులను నిలువరించడం, రివర్సల్ పద్ధతి ద్వారా రోగ నిరోధక శక్తి పెంచవచ్చునని తద్వారాదీర్ఘ కలం జీవించి ఉండవచ్చని అదే పంచసూత్ర విధానమని అన్నారు.                                                                              

సాంప్రదాయ వైద్యం విధానం పద్దతులపై పూర్తి అవగాహనా ఉండడంతో పాటు, ఆహారం న్యూట్రీషియన్స్ ద్వారా ఆరోగ్యం అంశంపై పరిశోధనలు చేపట్టి  రోగాన్ని నిలువరించడం రివర్సల్ పద్దతిలో జీవన శైలి మార్పుకు దోహదం చేస్తుందని డాక్టర్ మురళి ఆచార్య వివరించారు. ఈమేరకు  వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే పంచ సూత్రా పర్ఫెక్ట్ హెల్హ్ పై అవగాహన కారక్రమాలు చేపట్టినట్లు మురళి ఆచార్య వెల్లడించారు. పంచసూత్ర ద్వారా వేలాది మంది లబ్ది పొందారని అన్నారు. పంచసూత్ర పర్ఫెక్ట్ హెల్త్ పద్దతుల ద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటూ దీర్ఘ కాలిక సమస్యలనుంచి బయట పడగలరని అభిప్రాయం పడ్డారు.   
   

ఆరోగ్యం కేవలం శరీరానికి సంబందించినది మాత్రమే కాదు. మానసిక ఆధ్యాత్మిక అంశాలు మన జీవితంలో ముడి పడి ఉన్నాయన్నది నిజం. మనశరీరం సహజంగా ఐదురకాల ఎలిమెంట్స్ తో తయారు చేయబడింది. కొన్ని పద్దతుల ద్వారా ఆరోగ్యాన్ని పునరుద్ధరించుకోవచ్చ్జు. అనారోగ్యాన్నినిలుపుదల చేయడం ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించడం ద్వారా వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉందన్నది వాస్తవం. సహజంగా మన శరీరంలో దానికి అదే అనారోగ్యం రాకుండా నిరోధించుకునే శక్తి లేదా దానికి ఆడే హీలింగ్ చేసుకునే సెల్ఫ్ మెకానిజం ఉంటుంది. చిన్న చిన్న న్యూట్రీషియన్ కొరత ఏర్పడడం టాక్సీ కేన్స్ శరీరంలో వృద్ధి చెందుతాయి. ఇవే దీర్ఘ కాలిక వ్యాధులకు కారణం అవుతున్నాయి. మనం కనక సహజంగా లభించే పౌష్టికాహారం  తీసుకోడం సహజమైన జీవన శైలిని అనుసరించడం ద్వారా ఆధునికంగా వస్తున్న అనారోగ్య సమస్యలను తిప్పి కొట్టవచ్చు. ఎలా తిప్పి కొట్ట వచ్చు అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ సహజంగా మనలో ఉన్న సాజమైన హీలింగ్ ఎబిలిటీ పెంచడం ద్వారా అనారోగ్యాన్ని తిప్పి కొట్టవచ్చు. ఎదుర్కోవచ్చు .  పంచసూత్ర ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోడం సహజమైన పౌష్టిక ఆహార లోపాన్ని నిరోధించడం ముఖ్యం. ఎవరైనా సరే పంచసూత్రాలను అనుసరిస్తే  సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించడం అసాధ్యం కాదు. ఆరోగ్యాన్ని శరీర ధారుడ్యాన్ని సాధించడం మనలక్ష్యం. మనబాధ్యత. తరువాతి తరాన్ని మార్గ నిర్దేశం  చేయడం ద్వారా పూర్తి గా సహజ సిద్ధమైన విధానాల ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యవంతులను చేయగలమన్న విశ్వాసం ఉంది.

By
en-us Political News

  
భారతీయుల ఆహారంలో నువ్వులు,  పల్లీలు, బెల్లం చాలా ప్రముఖమైనవి.  ఇవి లేని బారతీయ ఆహారాన్ని అస్సలు ఊహించలేరు కూడా...
ఏ జబ్బు వచ్చినా దాన్ని నయం చేయడానికి మందులు చాలా అవసరం. మందులను సరైన సమయంలో తీసుకోవాలి. అలాగే వైద్యుల సలహా లేకుండా మందులు వాడటం అస్సలు మంచిది కాదు. అయితే కొన్ని మందులను డాక్టర్ల సలహా లేకుండా ఎలాంటి సంకోచం లేకుండా ఎక్కువ కాలం పాటు సమస్య అనిపించినప్పుడల్లా వాడుతూనే ఉంటారు. మరీ ముఖ్యంగా ఎక్కువకాలం పాటు మధుమేహం, గ్యాస్ సమస్యలకు మందులు వాడుతూనే ఉంటారు.
మన శరీర ఉష్ణోగ్రత ప్రతి సీజన్‌లో నార్మల్ గా ఉంటుంది.  దాదాపు 37-38 డిగ్రీల సెల్సియస్  వరకు శరీర ఉష్టోగ్రత ఉంటుంది. అయితే చలికాలంలో బయటి ఉష్ణోగ్రత 5, 10, 15, లేదా 18 డిగ్రీల సెల్సియస్‌ గా నమోదు అవుతూ ఉంటుంది....
ఆహారం శరీరానికి ఎంతో అవసరం. తీసుకునే ఆహారం వల్లనే శరీరానికి శక్తి వస్తుంది. ముఖ్యంగా ఆహారంలో ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, ఖనిజాలు చాలా అవసరం. ఇవన్నీ ఆహారంలో ఉండటం ఎంత ముఖ్యమూ. ఆహారం తీసుకునే సమయం కూడా అంతే ముఖ్యం. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతారు. అలా చేయకపోతే జీవక్రియకు ఆటంకం కలుగుతుంది. కేవలం జీవక్రియ ప్రభావితం కావడమే కాదు.. సమయానికి ఆహారం తీసుకోకపోతే అది చాలా తీవ్రమైన సమస్యలను కూడా కలిగిస్తుందట. సమయానికి ఆహారం తీసుకోకపోతే జరిగేదేంటో తెలుసుకుంటే..
చలికాలంలో చలి సహజమే.. కానీ కొందరికి సాధారణం కంటే ఎక్కువ చలి పెడుతూ ఉంటుంది. ఇంత చలి పెడుతుంటే ఇతరులు ఎలా భరిస్తున్నారో ఏంటో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. మందం పాటి దుస్తులు దరించినా, స్వెట్టర్లు వేసుకున్నా కూడా కొందరికి లోపల వణుకు పుడుతూనే ఉంటుంది. అయితే ఇది చలి కారణంగా వచ్చే చలి కాదని, దీని వెనుక వేరే కారణాలు ఉంటాయని అంటున్నారు వైద్యులు. అసలు కొందరిలో అధికంగా చలి ఎందుకు పెడుతుంది? శరీరంలో కలిగే మార్పులు ఏంటి? తెలుసుకుంటే..
అల్పాహారం ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉదయాన్నే తీసుకునే ఆహారం.  ప్రతి రోజూ ఉదయం 8 నుండి 9 గంటలలోపు అల్పాహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని, రోజంతా చురుగ్గా ఉండటానికి సహాయపడుతుందని..
ఆహారం శరీరానికి ఎంతో అవసరం.  నేటి ఉరుకుల పరుగుల జీవితాలలో ఆహారం వండుకోవడానికి సమయం సరిపోక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు.  ఇంట్లోనూ,  బయటా రెండు చోట్లా ఒత్తిడితో కూడుకున్న పనులు...
ఇనుప పాత్రలలో వండిన పదార్థాలు   ఆరోగ్యానికి ఎంతో మంచివి. నాన్ స్టిక్,  అల్యూమినియం తో ఇనుప పాత్రలలో వండిన ఆహారం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.  ఇనుప పాత్రలలో వంట చేయడం..
తిప్పతీగ గురించి ఈ మధ్యకాలంలో చాలా సమాచారం వ్యాప్తి అవుతోంది.  ఒకప్పుడు గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా పెరిగేవి తిప్పతీగ మొక్కలు.  ఇప్పుడు ఇళ్ళలో పెంచుకోవడం లేదా ఆన్లైన్ లో తిప్పతీగ పొడర్స్..
శరీరంలో ఏదైనా అవయవం లేదా ప్రాంతం అసౌకర్యానికి లోనైనప్పుడు, లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు నొప్పి కలుగుతుంది.  సాధారణంగా శరీరంలో కలిగే నొప్పులు  ఒకటి రెండు రోజులలో వాటికవే తగ్గిపోతాయి....
బాదం పప్పు రోజూ తినడం ఎంతవరకు ఆరోగ్యం? ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? తెలుసుకుంటే..
కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది ఒక సాధారణ చేతి సమస్య. అరచేతి వైపు ఎముకలు, స్నాయువులతో చుట్టుముట్టబడిన ఇరుకైన మార్గం అయిన కార్పల్ టన్నెల్‌లో ఉన్న నాడిని చేతిపై ఒత్తిడి చేసినప్పుడు ఇది సంభవిస్తుంది. చేతులలో తిమ్మిరి రావడం, వేళ్లలో జలదరింపు లేదా నొప్పి ఉండటం, రాయడంలో లేదా టైప్ చేయడంలో సమస్య ఉండటం, పదే పదే వస్తువులు చేతులలో పట్టుకోలేక జారవిడచడం, వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడం ఈ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలు.
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.