పళనిస్వామి వస్తే ఏం లాభం?

Publish Date:Feb 16, 2017

Advertisement

 

ఎట్టకేళకు తమిళనాడు రాజకీయాలకు కాస్త కొలిక్కి వచ్చాయి. శశికళ వీరవిధేయుడు పళనిస్వామిని ముఖ్యమంత్రి పదవి చేపట్టాలంటూ గవర్నరు ఆహ్వానించడంతో ఆ కుర్చీకి కొత్త కళ వచ్చింది. సచివాలయానికి చేరుకుందామనుకున్న శశికళ సెంట్రల్‌ జైలుకి చేరుకోవడంతో.. ముఖ్యమంత్రి పీఠం మీద ఆసక్తి నెలకొంది. ఈ వివాదం మీద ఇప్పటివరకూ ఆచితూచి వ్యవహరిస్తున్నా గవర్నరు న్యాయనిపుణుల సలహాతో ఇప్పుడు ఇహ పళనిగారిని ఆహ్వానించక తప్పలేదు.

 

తమిళ రాజకీయాలలో పళనిస్వామిది ఓ ప్రముఖ పాత్ర. ఎంజీఆర్‌ చనిపోయిన తరువాత జయకి అండగా నిలిచిన అతికొద్దిమంది నేతలలో పళని ఒకరు. అలా అన్నాడీఎంకేలో ఆయనది దాదాపు 30 ఏళ్ల ప్రస్థానం. రైతు కుటుంబంలో జన్మించినా, అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రభుత్వంలోనే ఎన్నదగిన నేతలలో ఒకరుగా నిలిచేవారు. ప్రస్తుతానికి రహదారులు, నౌకాయానాల శాఖ మంత్రిగా అధికారం చెలాయిస్తున్నారు. ఇంత అనుభవం ఉంది కాబట్టి తమిళమార్కు రాజకీయాలలో పళని పండిపోయారని ఒప్పుకోక తప్పదు.

 

నిజానికి జయలలిత చనిపోయిన వెంటనే ఆ స్థానంలో పళనిస్వామిని కూర్చోపెట్టాలని శశికళ భావించారు. అయితే అత్యధిక శాసనసభ్యులు దీనికి నిరాకరించడంతో పన్నీర్‌ను నిలబెట్టక తప్పింది కాదు. తనకి దక్కని ముఖ్యమంత్రి పదవి శశికళకైనా దక్కాలని పళని చేయని ప్రయత్నం అంటూ లేదు. అందుకోసమే ముఖ్యమంత్రి పదవి అంటే ఏమాత్రం ఆశ లేదని చెప్పిన శశికళను అదే పదవి కోసం వెంపర్లాడేలా ఎగదోశారు. ఎమ్మెల్యేలను మూకుమ్మడిగా గోల్డెన్‌ బే రిసార్టులకు తరలించడంలోనూ ఆయనది ముఖ్యపాత్రని చెబుతారు. ఊహించని రీతిలో ఇప్పుడు శశికళ చిప్పకూడు తినక తప్పకపోవడంతో, ఆమెకు తోడుగా నిలిచిన పళని తెర మీదకు వచ్చాడు. తన బదులు పళనిని ముఖ్యమంత్రి పీఠం మీద నిలపడంలో అటు శశికళ పంతమూ నెగ్గినట్లయ్యింది.

 

నిజానికి తమిళనాట రాజకీయాలు ఎప్పుడోనే బ్రష్టుపట్టిపోయాయి. ద్రవిడ ఉద్యమంతో తమిళజాతిని తలెత్తుకునేలా చేసిన నాయకుల వారసులు ఇప్పుడు వ్యక్తిగత పూజలందుకునేందుకు తొందరపడుతున్నారు. అవినీతి, కుటుంబ పాలన, ఆడంబరం, కుతంత్రాలు, హత్యారాజకీయాలతో అక్కడి నేతలు ఎప్పుడోనే నీతులు తప్పారు. మరి ఆ తరహా రాజకీయాలకు పళనిస్వామి ఏ రంగు పులుముతారో చూడాలి. జైల్లో ఉన్న శశికళ మనసుని ఎరిగి ఆమె కనుసన్నలలోనే నడుచుకుంటారా? తనదైన శైలిలో విచక్షణాయుతంగా పాలన సాగిస్తారా? మిగిలిన పాలనాకాలాన్ని తూతూమంత్రంగా లాగించేస్తారా? అన్న ప్రశ్నలకు త్వరలోనే ఓ జవాబు రానుంది.

 

ఒకటి మాత్రం నిజం! మురికిపట్టిన తమిళరాజకీయాలు మళ్లీ కోలుకోవాలంటే చాలాకాలమే పడుతుంది. అది తమిళుర చేతుల్లోనే ఉంది. సాధారణంగా తమిళురకు స్వాభిమానం ఎక్కువ. తమ భాషని కాపాడుకునేందుకు వారు ఉద్యమిస్తారు, జల్లికట్టు వంటి ఆచారాన్ని కాపాడుకునేందుకూ వారు ఉద్యమిస్తారు. మరి తమ నేతల విషయంలో ఎందుకని వారు చూసీ చూడనట్లు ఊరుకుంటున్నట్లు? స్వాభిమానం ఉన్నచోట శృతిమించిన వ్యక్తిపూజలు ఎలా సాధ్యమయ్యాయి? ఈ ప్రశ్నలు కనుక వారిలో మెదిలితే తమిళనాట మార్పు రాక మానదు!!!

By
en-us Political News

  
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.