యుద్ధానికి ముందే పాక్ పరాజయం!

Publish Date:May 9, 2025

Advertisement

ఇంకా అసలు యుద్ధం మొదలు కాలేదు. ఇంతవరకు జరిగింది,జ రుగుతున్నది  పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా  భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్  కొనసాగింపు చర్యలు మాత్రమే. కానీ..  ఇంతలోనే పాకిస్థాన్  పనైపోయిందనే ఏడ్పులు  మొదలయ్యాయి. ఆ దేశ పార్లమెంట్ లోనే రోదనలు వినిపిస్తున్నాయి. నిజానికి..  భారత దేశం యుద్ధం ప్రకటించలేదు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా,  పాకిస్థాన్, పాక్  ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఏక కాలంలో దాడి చేసింది. వంద మందికి పైగా ఉగ్ర ముష్కర మూకలను మట్టు పెట్టింది. కానీ  ఎక్కడా  పొరపాటున కూడా  పాక్ సైనిక స్థావరాలను టార్గెట్ చేయలేదు. టార్గెట్ చేయక పోవడం మాత్రమే కాదు  అసలు అటు వైపు కన్నెత్తి అయినా చూడలేదు.

అలాగే  పాక్  ప్రభుత్వ కార్యాలయాలు, విమానాశ్రయాలు,ఇ తర ప్రభుత్వ, ప్రభుత్వేతర సదుపాయాల జోలికి వెళ్ళలేదు. నిజానికి, పాక్ భూభాగంలో కాలు అయినా పెట్టలేదు. మన భూభాగం నుంచే పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై స్కాల్ప్ క్రూజ్ క్షిపణులను,స్మార్ట్ బాబులను వేసి లక్ష్యాలను ఛేదించింది. ఉగ్రవాదులను మట్టు పెట్టింది. ప్రజల జోలికి వెళ్ళలేదు.  అయితే..  అక్కడితో ఆపరేషన్ పూర్తి కాలేదు. సినిమా అభీ బాకీ హై ..ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని కేంద్ర రక్షణ  శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ స్పష్టం చేశారు. అంటే..  ఆ దేశంలో నక్కిన చిట్టచివరి ఉగ్రవాదిని హతమార్చే వరకు ఆపరేషన్ సిందూర్  కొనసాగుతుందని స్పష్టం చేశారు. యుద్ధం మాట ఎత్త లేదు. అదే సమయంలో భారత్ దేశం ఉద్రిక్తతలను పెంచదని రాజ్ నాథ్  సింగ్ స్పష్టం చేశారు.అయితే, అటు నుంచి పాక్  కాలుదదువ్వి కవ్వింపు చర్యలకు దిగితే మాత్రం తగ్గేది ఉండదని   భారత దేశం పాక్ కు మాత్రమే కాదు,  ప్రపంచ దేశాలకు కూడా స్పష్టం చేసింది. 

అయితే పోగాలము దాపురించిన వారు అరుంధతిని మిత్ర వాక్యమును..కనరు వినరు మూర్కొనరు  అన్నట్లుగా పాకిస్థాన్ కాలు దువ్వనే దువ్వింది. చింత చచ్చినా పులుపు చావని దాయాది దేశం భారత సరిహద్దులో 15 చోట్ల సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది.  చైనా మిస్సైల్స్, డ్రోన్లతో రెచ్చిపోయింది అయితే.. భారత్ సాంకేతిక సామర్ధ్యం ముందు పాక్  ప్రయోగించిన మిస్సైల్స్, డ్రోన్లు మట్టి పిచ్చుకల్లా తుస్సు మన్నాయి. పాక్ మిస్సైల్స్, డోన్లను భారత సైన్యం ధ్వంసం చేసింది.  ఈ నేపథ్యంలోనే భారత నావికాదళం కరాచీ పోర్టుపై దాడి చేసి  ధ్వంసం చేసింది. పాక్‌లోని పలు ప్రాంతాల్లో కూడా దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్ అల్లాడిపోతోంది. ప్రతీకార కాంక్షతో రగిలిపోతోంది. దేశ ప్రజలకు ముఖం చూపుకునేందుకు లైన్ ఆఫ్ కంట్రోల్ పొడువునా దాడులకు పాల్పడింది.

మరో వంక భారత సైన్యం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మన  త్రివిధదళాలు దాయాది దేశానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఉగ్ర స్థావరాలు, సైనిక క్యాంపులే లక్ష్యంగా దాడులు చేస్తూ పాక్  యుద్దోన్మాదాన్ని ఎక్కడి క్కడ తుత్తునియలు చేస్తోంది. పాక్ కూడా ప్రతిదాడులు చేసినా.. అవి హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లా నవ్వుల పాలవుతున్నాయి. పాక్  ప్రయోగించిన  డ్రోన్స్, మిసైల్స్‌  దీపావళి తార జువ్వల్లా ఇలా ఎగిరి ఆలా నేల కొరిగిపోతున్నాయి. మన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, పాక్  ప్రయోగించిన 50కి పైగా డ్రోన్స్, మిసైల్స్‌ను మార్గమధ్యలోనే నెలకు కూల్చేసింది.  చేర్చింది. అయితే,పాకిస్థాన్  ఇంకా ప్రగాల్భాలకు పోతోంది. అసత్య ప్రచారంతో ఆత్మవంచనకు పాల్పడుతోంది. భారత్‌పై దాడులు చేశామని.. అందులో విజయవంతమయ్యామంటూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోంది. 

ఇదలా ఉంటే.. భారత్ చేస్తోన్న ప్రతీకార దాడులకు పాకిస్తాన్ ఇప్పటికే పూర్తిగా చితికి పోయింది. అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ లోని పలు నగరాలు విధ్వంసం అయ్యాయి. భారత్ దెబ్బకు పాకిస్తాన్ అప్పు అడుక్కునే పరిస్థితికి వచ్చింది.  పాకిస్థాన్‌ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. భారత్‌పై దుర్మార్గపు దాడులకు పాల్పడుతూ ఆర్థికంగా మరింత కిందికి దిగజారిపోయింది. వాటినుంచి బయటపడేందుకు అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల కోసం వెంపర్లాడుతోంది. తమకు ఆర్థికసాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. అంటే..  పరిస్థితి ఎంత దారుణంగా వుందో వేరే చెప్పనక్కర లేదు. 

మరో వంక పాకిస్థాన్‌కు అంతర్జాతీయ సంస్థల నుంచి, ముఖ్యంగా ఐఎంఎఫ్ నుంచి   ఎలాంటి రుణాలు రాకుండా అడ్డుకొనేందుకు భారత్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోందని కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే భారత్‌ విధానం ఏమిటో విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. పాక్‌  పోస్టులు  ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యుద్ధ వాతావరణంతో ఇప్పటికే పాకిస్థాన్‌ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. నిజానికి దేశ పార్లమెంట్ లో సీనియర్ సభ్యుడు ఒకరు, భారత దేశం కాలు దువ్వి దేశాన్ని నాశనం చేయవద్దని ప్రభుత్వాన్ని కన్నీటితో వేడుకున్నారు. నిజానికి  రోజు రోజుకు దిగజారి పోతున్న పరిస్థితులను గమనిస్తే, అసలు యుద్ధం మొదలయ్యే  సరికే పాక్ చేతులు ఎత్తేయడం ఖాయంగాకనిపిస్తోందని అంటున్నారు.

By
en-us Political News

  
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.