భారత భూభాగంలో పాకిస్థాన్ డ్రోన్ ల కదలికలు.. అప్రమత్తమైన భద్రతా దళాలు

Publish Date:Jan 11, 2026

Advertisement

జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల వద్ద నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ డ్రోన్లు కలకలం రేపాయి. సాంబా, రాజౌరీ, పూంచ్  జిల్లాల్లో ఆదివారం (జనవరి 11) పాక్ డ్రోన్ల కదలికలతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.  వెంటనే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలలో అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్థాన్ డ్రోన్లు భారత భూభాగంలోకి ప్రవేశించి కొద్ది సేపు తరువాత తిరిగి పాక్ భూభాగంలోకి వెళ్లిపోయాయి. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.  

తొలుత రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లోని గనియా-కల్సియన్ గ్రామం వద్ద పాకిస్థాన్ డ్రోన్లు నింగిలో చక్కర్లు కొట్టడం గమనించినన భద్రతా దళాలు వెంటనే కాల్పులు జరిపాయి.  కాగా దాదాపు అదే సమ యంలో   ఖబ్బర్ గ్రామం వద్ద కూడా డ్రోన్ కదలికలను గుర్తించారు.  అలాగే సాంబా జిల్లా రామ్‌గఢ్ సెక్టార్, పూంచ్ జిల్లా మాన్‌కోట్ సెక్టార్‌లలో కూడా పాకిస్థాన్ డ్రోన్లు కనిపించాయి.  ఆయుధాలు లేదా మాదకద్రవ్యాలను ఈ డ్రోన్ల ద్వారా భారత భూభాగంలోకి జారవిడిచారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దీంతో ఆర్మీ, పోలీసులు ఆయా ప్రాంతాలలో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.  ఇటీవలే సాంబా జిల్లా పాలూరా గ్రామం వద్ద డ్రోన్ ద్వారా పంపిన ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత భూభాగంలో పాకిస్థాన్ డ్రోన్ల తాజా  కదలికలను సీరియస్ గా తీసుకున్న భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. భారత గణతంత్ర దినోత్సవం సమీపిత్తున్న ఈ సమయంలో  భారత భూభాగంలో పాకిస్థాన్ డ్రోన్ల సంచారం కలవరం రేపుతోంది. భద్రతా దళాలు సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి.  

By
en-us Political News

  
చింతక్రింది సాయిజ్యోతి రచించిన చేయి వీడని చెలిమి అనే నవలను మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు.
బీహార్ రాష్ట్రంలోని సీతామర్హి జిల్లాలో మానవత్వాన్ని మరిచిపోయేలా చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి రానుందని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు
నటి అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 42 మందిపై కేసు నమోదు చేశారు
ఆదిలాబాద్‌ జిల్లా భోరాజ్‌ మండలం హతిఘాట్‌లో చనాకా-కొరాటా పంప్‌హౌస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా అతిపెద్ద పరిశోధనా కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (AP FIRST) పేరుతో తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు సీఎం ఆమోదముద్ర వేశారు.
మేడిపల్లి పరిధిలోని చెంగిచెర్ల కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు
ఈ సంక్రాంతి సీజ‌న్లో కేవ‌లం రెండు రోజుల‌కే ఎన్ని వేల కోట్ల మేర కోళ్ల పందేలు జ‌రిగాయో చూస్తే ఆశ్చర్యపోతారు
ఒక్క పెగ్గు కోసం సొంత అన్ననే మేడ మీద నుంచి తోసేసి చంపేసిన తమ్ముడి ఉదంతం సంక్రాంతి పండుగ నాడు హైదరాబాద్ నాచారంలో చోటు చేసుకుంది.
142 ఏళ్లు జీవించిన సౌదీ అరేబియా కురువృద్ధుడు షేక్ నాసర్ బిన్ రద్దన్ అల్ వదాయి ఇకలేరు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రభాకర్‌రావు ఇంటరాగేషన్ ఇంకెంతకాలం కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
టీవ‌ల కాలంలో ఇరాన్ కరెన్సీ విలువ భారీగా పతనం అయ్యింది. దీంతో అక్కడ ఆహార ప‌దార్థాలు స‌హా అన్నిటి ధరలూ మింటికెగశాయి. దీనికి తోడు అమెరికా నుంచి యుద్ధ భ‌యం కూడా ఉండటంతో ఇరాన్ ఇత‌ర దేశాల‌కు చెందిన వారిని ప‌నుల్లో నియ‌మించ‌రాద‌ని ఆంక్షలు విధించింది. దీనికి నిరసనగా ఇరాన్ లో ఆందోళనలను మిన్నంటాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.