అమెరికా అధీనంలో పాక్ ఎయిర్ బేస్ లు.!

Publish Date:Jul 16, 2026

Advertisement

పాకిస్థాన్ లోని కీలక వైమానిక స్థావరాలన్నీ అమెరికా అధీనంలో ఉన్నాయా? అంటే అంతర్జాతీయ మీడియా కథనాలు ఔననే అంటున్నాయి.  ఒక వైపు తీవ్ర  ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్..  దానినుంచి బయటపడేందుకు డిస్పరేట్ గా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. అగ్రరాజ్యం విధించే కఠినమైన వ్యూహాత్మక నిబంధనలకు తలవొగ్గుతూ తన సొంత రక్షణ వ్యవస్థను పరాధీనం చేసుకుంటోందన్నది ఆ కథనాల సారాంశం. ముఖ్యంగా ఆసియా ఖండంలో చైనా, ఇండియా  ప్రాబల్యాన్ని గమనిస్తూ..  తన సొంత భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం అమెరికా ఈ ప్రాంతాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు.. పాక్ ఆర్థిక సంక్షోభాన్ని ఆసరాగా తీసుకుని ఆ దేశంపై తెచ్చిన ఒత్తిడులు సత్ఫలితాలను ఇచ్చాయని రక్షణ రంగ నిపుణులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా పేర్కొది. 

ఈ   మార్పులకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. పాకిస్తాన్   భూభాగంలోని వ్యూహాత్మకమైన మూడు వైమానిక స్థావరాలు పూర్తిగా అమెరికా సైనిక దళాల   నిర్వహణలో ఉన్నాయి.   పాకిస్తాన్ నిఘా సంస్థ   ఐఎస్ఐ  మాజీ అధినేత ఈ విషయాన్ని స్వయంగా స్వయంగా ధృవీకరించినట్లు నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. అమెరికా అధీనంలోకి తీసుకున్న స్థావరాలలో ప్రముఖమైనది నూరు అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్.  ఈ రక్షణ కేంద్రం భౌగోళికంగా పాకిస్తాన్‌కు అత్యంత కీలకమైనది. అమెరికా సైన్యం ఈ ప్రాంతాలను తమ సొంత నియంత్రణలోకి తీసుకున్నప్పటి నుండి అక్కడ కఠినమైన భద్రతా నిబంధనలను అమలు చేస్తోంది.  ఈ ఎయిర్ బేస్‌ల అంతర్గత పరిసరాల్లోకి కనీసం పాకిస్తాన్   సైనికులు ఉన్నతాధికారులకు కూడా అనుమతి లేదు. 

ఈ వ్యూహాత్మక సైనిక మోహరింపు వెనుక కేవలం భూభాగాన్ని ఆక్రమించడం మాత్రమే కాకుండా..  భారీ సైనిక వ్యూహం దాగి ఉందని రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం.   అమెరికా అధీనంలో ఉన్న నూరు అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్‌లో వాషింగ్టన్   అధునాతనమైన ఎఫ్ 35,  ఎఫ్ 16 ఫైటర్ జెట్‌లను పెద్ద సంఖ్యలో మోహరించింది.  పాకిస్తాన్ కలిగి ఉన్న అత్యంత రహస్య అణ్వాయుధ నిల్వ కేంద్రాలకు ఈ వైమానిక స్థావరం చాలా సమీపంలో ఉండట వల్లే.. దీనిపై అమెరికా ఆధిపత్యం చెలాయిస్తోంది.  దీని ద్వారా పాక్ అణ్వాయుధాల గమనాన్ని,  వాటి నిల్వలను నిరంతరం నిఘా నీడలో ఉంచడం అమెరికాకు సులువవుతుంది.

 పాకిస్తాన్  ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలోనే ఇరు దేశాల మధ్య రహస్య రక్షణ ఒప్పందాలు కుదిరిందన్నది అంతర్జతీయ మీడియా కథనాల సారాంశం. అంతేకాకుండా..  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుబంధ కంపెనీలకు పాకిస్తాన్ భూభాగంలోని విలువైన ఖనిజ సంపదను తవ్వుకునేందుకు అనూహ్యంగా అనుమతులు కూడా మంజూరయ్యాయి.  ఈ ఆర్థిక,  వ్యూహాత్మక లొంగుబాట్లు జరిగినప్పుడే, పాకిస్తాన్ భవిష్యత్తు పూర్తిగా అమెరికా చేతుల్లోకి వెళ్లిపోయిందనడానికి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   తీవ్రమైన  ద్రవ్యోల్బణం, విదేశీ అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్, అమెరికా ఇచ్చే రుణ సహాయాల కోసమే తన దేశ రక్షణ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని అంటున్నారు.  

 అయితే.. పాకిస్తాన్,  అమెరికాల మధ్య రక్షణ సంబంధాలు కొత్తవేమీ కావు. కాకపోతే, గతంలో కేవలం ఉగ్రవాద నిర్మూలన లేదా ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాల కోసమే పరిమితమైన ఈ సంబంధాలు, ఇప్పుడు పాక్ సొంత స్థావరాలపై అమెరికా అధిపత్యం చెలాయించే స్థాయికి చేరడం గమనార్హం.  గతంలో అమెరికా తన డ్రోన్ దాడుల కోసం పాక్ వైమానిక స్థావరాలను వాడుకున్నప్పటికీ..  పాక్ సైనికులను కూడా నిరోధించే  పరిస్థితి లేదు.

కానీ ప్రస్తుత విదేశీ విధానాలు, పాకిస్తాన్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీవ్రమైన అంతర్గత సమస్యల కారణంగా దాయాది దేశం పాకిస్థాన్ బేరసారాల శక్తిని కోల్పోయింది. ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడం కోసం పాకిస్థాన్ అమెరికా ముందు మోకరిల్లిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఆసియాలో చైనాను కట్టడి చేసే నెపంతో పాకిస్తాన్‌ను అమెరికా ఒక పావుగా వాడుకుంటోందనేది   బహిరంగ రహస్యంగా మారింది. పాకిస్తాన్ ప్రభుత్వం తన స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం చేసిన ఈ ఒప్పందాలు, దీర్ఘకాలంలో ఆ దేశ ఉనికికే ప్రమాదకరంగా మారే  ప్రమాదం పొంచి ఉందంటున్నారు.  

US Military Presence Pakistan, US Pakistan Strategic Relations, Pakistan Nuclear Weapons Storage, Former ISI Chief Revelations

By
en-us Political News

  
పాకిస్తాన్ సైనిక బలగాలు తమ ప్రాంతాన్ని చట్టవిరుద్ధంగా, అక్రమంగా ఆక్రమించుకున్నాయని అమ్జాద్ అయూబ్ మీర్జా ప్రకటించారు. ఈ ప్రాంతం ఎంతమాత్రం స్వతంత్రమైనది కాదని, పాకిస్తాన్ ప్రభుత్వం ఇక్కడి ప్రజలను బానిసలుగా చూస్తోందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
విద్యా రంగానికి సంబంధించి మొత్తం ఐదు పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో మూడు సాధారణ డే స్కూళ్లు కాగా, మిగిలిన రెండు పూర్తి స్థాయి వసతులతో కూడిన రెసిడెన్షియల్ పాఠశాలలు.
మిడిల్ ఈస్ట్ యుద్ధ ఉద్రిక్తతలు మరియు వంద డాలర్లు దాటిన క్రూడాయిల్ ధరల మధ్య భారత స్టాక్ మార్కెట్లు అద్భుత రికవరీ సాధించాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 24100 మార్కును దాటింది. మార్కెట్ తదుపరి గమనంపై విశ్లేషకుల అంచనాలు మీకోసం.
స్విట్జర్లాండ్‌లోని ETH జ్యూరిచ్ శాస్త్రవేత్తలు గిటార్ సూత్రాంతర్భాగంగా పనిచేసే సరికొత్త వేలి గోరు పరిమాణపు క్వాంటం చిప్‌ను ఆవిష్కరించారు. ఈ చిప్ విద్యుదయస్కాంత తరంగాల కంటే 1,00,000 రెట్లు చిన్న శబ్ద ప్రకంపనలను ఉపయోగించి డేటాను భద్రపరుస్తుంది, ఇది క్వాంటం ర్యామ్ (QRAM) పరిశోధనలో ఒక పెద్ద మైలురాయి.
స్కల్‌కాండీ సరికొత్త ప్రీమియం హెడ్‌ఫోన్స్ Crusher 1080 ANC విడుదల చేసింది. బోస్ సంస్థకు చెందిన బెస్ట్ ఇన్ క్లాస్ నాయిస్ క్యాన్సిలేషన్, స్పేషియల్ ఆడియో ఫీచర్లతో, 60 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో సగం ధరకే అందుబాటులోకి వచ్చిన ఈ గ్యాడ్జెట్ పూర్తి వివరాలు చూడండి.
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గోల్ఫ్ టోర్నమెంట్ ది ఓపెన్ 2026 రాయల్ బర్క్‌డేల్‌లో ప్రారంభమైంది. స్కాటీ షెఫ్లర్, రోరీ మెక్‌ఇల్రాయ్ తలపడుతున్న ఈ మెగా ఈవెంట్‌ను మొబైల్ మరియు టీవీల్లో ఉచితంగా ఎలా చూడాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అమెరికా ఐటీ దిగ్గజం ఐబీఎం (IBM) 25% ఘోర పతనాన్ని చవిచూసినప్పటికీ, మెరుగైన క్యూ1 ఫలితాల అండతో భారతీయ ఐటీ షేర్లు మార్కెట్లో నిలదొక్కుకున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
బంగారం మరియు గ్లోబల్ స్టాక్స్ వైపు మళ్లుతున్న భారతీయ పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన 5 ప్రధాన రిస్కులు ఇవే. అమెరికా బాండ్ ఈల్డ్స్, క్రూడ్ ఆయిల్ ధరలు మరియు భౌగోళిక ఉద్రిక్తతల వల్ల మీ పోర్ట్‌ఫోలియోపై పడే ప్రభావం గురించి పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై అర్జెంటీనా ఘనవిజయం సాధించిన తర్వాత ఆటగాళ్లు ప్రదర్శించిన లాస్ మాల్బినాస్ సన్ అర్జెంటీనాస్ బ్యానర్ ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదమైంది. 1982 ఫాక్‌లాండ్ యుద్ధ గాయాలను రేపిన ఈ నినాదం వెనుక ఉన్న అసలు కథ, ఫిఫా నిబంధనలు మరియు అర్జెంటీనా జట్టు ఎదుర్కోబోయే చర్యల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఈ 14 దేశాల ఉమ్మడి కూటమికి యూరోపియన్ యూనియన్ పూర్తి మద్దతును ప్రకటించింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని, ఎలాంటి బలవంతపు లేదా సైనిక చర్యలకు పాల్పడకూడదని ఈ ప్రకటనలో ఆ దేశాలు విస్పష్టంగా పేర్కొన్నాయి.
ఐసీసీ వన్డే, టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్లలో భారీ మార్పులను ప్రకటించింది. 2027 వన్డే వరల్డ్‌ కప్‌లో సూపర్‌ 7 దశ, 2028 టీ20 వరల్డ్‌ కప్‌లో సూపర్‌ 10 దశతో సరికొత్త ఫార్మాట్‌లను తీసుకువచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
19 ఏళ్ల క్రితం లియోనెల్ మెస్సీ చేతుల్లో పెరిగిన లామిన్ యమాల్, ఇప్పుడు 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో మెస్సీ అర్జెంటీనా జట్టుకే సవాల్ విసురుతున్నాడు. ఈ అద్భుతమైన ఫుట్‌బాల్ కథనం మీకోసం.
భారత్ vs ఇంగ్లాండ్ రెండో వన్డే మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. తొలి వన్డేలో అక్షర్ పటేల్, గిల్ రాణించడంతో గెలిచిన టీమిండియా, నేడు కార్డిఫ్‌లో సిరీస్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ పిచ్ రిపోర్ట్, వాతావరణ అంచనాలు మరియు భారత తుది జట్టు Probable Playing XI వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.