కశ్మీర్ పూంచ్ బాధితులకు అమిత్ షా పరామర్శ

Publish Date:May 30, 2025

Advertisement

 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూంచ్ జిల్లాను సందర్శించి పాకిస్తాన్ దాడుల బారినపడిన బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. బాధిత కుటుంబాల్లోని యువకులకు అమిత్ షా ఉద్యోగ నియామక పత్రాలను  అందించారు. దాడుల సమయంలో పూంచ్ పౌరులు, అధికారులు చూపిన ధైర్యం, జమ్ముకశ్మీర్ ప్రజల దేశభక్తి దేశానికి మరింత బలాన్నిచ్చాయని అమిత్‌ షా పేర్కొన్నారు. మనం చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌తో పాక్‌లో ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయిని షా పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. 

కాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండించారు. ‘మతపరమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని, పాకిస్తాన్ దాడులకు తెగబడుతోందని ఆయన పేర్కొన్నారు. ఇది పిరికితనంతో కూడిన చర్య. పాక్‌ దాడులలో పలువురు భారత పౌరులు గాయపడ్డారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఉపాధి, ఉద్యోగ  అవకాశాలు కల్పిస్తోంది. వారికి సంఘీభావం ప్రకటిస్తోంది’ అని హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు.పూంచ్ పౌరులు, అధికారులు చూపించిన సాహసం, దేశభక్తి యవద్దేశానికి స్ఫూర్తినిస్తుందని ప్రశంసించారు. 

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పిరికిపందల చర్య అని, ఏ ఒక్క ఉగ్రవాద చర్యను ఉపేక్షించరాదన్నదే ప్రధానమంత్రి నరేంద్రమోదీ విధాన నిర్ణయమని చెప్పారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని, ప్రజలు బలంగా కోరుకోవడం, ప్రధానమంత్రి నిర్ణయాత్మక నాయకత్వం, విలువైన ఇంటెలిజెన్స్ సమాచారం, భారత సాయుధ బలగాల అసమాన ప్రతిభ వల్లే అత్యంత భీకర దాడులు జరపగలిగామని అమిత్‌షా అన్నారు. వందలాది మంది టెర్రరిస్టులను మట్టుబెట్టామని, తమపై దాడులు జరిపినట్టు పాక్ చెప్పుకుంటున్నప్పటికీ మన మిలటరీ కేవలం టెర్రరిస్టు శిబిరాలనే టార్గెట్ చేసిందని వివరించారు. ఒక్క ఇండియన్ ఆర్మీ పోస్ట్ కూడా దెబ్బతినలేదని, పాకిస్థాన్ పౌరులెవరికీ నష్టం జరగలేదని చెప్పారు. టెర్రరిస్టు శిబిరాలను మాత్రమే ధ్వంసం చేశామని  అమిత్ షా  తెలిపారు.
 

By
en-us Political News

  
ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తండ్రి కంచర్ల రామయ్య కన్నుమూశారు. సీనియర్ జర్నలిస్టు, ఎపియుడబ్యుజె రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు కంచర్ల రామయ్య గురువారం (జూన్ 19) మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో తీసుకుంటున్న ఆయన హైదరాబాద్ లో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
తిరుమలలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ అరుణ్ కుమార్ ను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఓ వ్యాపార వేత్త నివాసంలో ఆయన భార్యపై దాడి చేసి దోపిడీకి పాల్పడిన కేసులో కానిస్టేబుల్ అరుణ్ కుమార్ సహా మరో ముగ్గురిని అరెస్టు చేశారు.
వైసీపీ అధినేత జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు నిబంధనలను ఉల్లంఘించారని తెలుగుదేశం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్‌ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించింది. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆర్టీసీ అధికారులతో కలిసి ఈ సేవలను గురువారం (జూన్ 19) ప్రారంభించారు. ప్రైవేట్ వాహనాల దోపిడీని, కాలుష్యాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ సర్వీసులను ప్రారంభించినట్లు వెంకయ్య చౌదరి తెలిపారు.
సీఎం చంద్రబాబును సంతోషం కోసమే పోలీసులు తనపై, తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని చంద్రగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేర్కొన్నారు. లిస్కర్‌ స్కాం కేసులో ఆయన్ని సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో ఆయన సిట్ కు ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారని అంశంపై పార్టీలోనూ, నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అరెస్టు కాబోతున్నారా? కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా పని చేసి ఆ తరువాత ఆయనతో విభేదించి బయటకు వచ్చ బీజేపీ గూటికి చేరిన ఈటల రాజేందర్ మాటల సంకేతమదేనా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
ఇప్పుడు ఎటు చూసినా యుద్ధమే కనిపిస్తోంది .. దేశాల మధ్యనే కాదు, రాజకీయ పార్టీల మధ్యన కూడా యుద్ద వాతావరణమే కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే .. ప్రత్యర్ధి పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంటే, పార్టీల లోపల సాగుతున్న అంతర్గత కుమ్ములాటలలో కూడా యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే.. ఉభయ దేశాలను అదిరించి, బెదిరించి దారికి తెచ్చింది నేనే.. కాల్పుల విరమణ చేయించింది నేనే... అంటూ పదే పదే ప్రకటించిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక్క సారిగా యు టర్న్ తీసుకున్నారు.
కాంగ్రెస్ అధినేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన 55వ పుట్టిన రోజు గురువారం( జూన్ 19) జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొదలు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు, ఇండియా కూటమి నాయకులు, వందల వేల మంది రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం (జూన్ 18) జరిగిన ఎన్ కౌంటర్లో మరణించిన మావోయిస్టు నేత గాజర్ల రవి మృతదేహం కోసం ఆయన సోదరుడు, మాజీ నక్సల్ గాజర్ల అశోక్ రంపచోడవరం ఆస్పత్రికి చేరుకున్నారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగాలేక గంజాయి బ్యాచ్ ను,  ఉన్మాదులను, బెట్టింగులకు పాల్పడే నేరగాళ్లను కలుస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్  అన్నారు.
ఆపరేషన్ కగార్‌లో మావోయిస్టుల కీలక నేత నంబాల కేశవరావు సహా సీనియర్‌ నాయకులను వరుసగా కోల్పోయి కుదేలైన మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌ అల్లూరి జిల్లా మారేడుమిల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటరులో మరణించారు. మరో అగ్ర నాయకురాలు, ఏవోబీ కమిటీ సీనియర్‌ సభ్యురాలు రావి వెంకటగిరి చైతన్య అలియాస్‌ అరుణ, మరో నక్సల్‌ అంజూ కూడా ఈ ఘటనలో చనిపోయారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.