Publish Date:Jul 29, 2025
కశ్మీర్ పహల్గామ్ మారణహోమానికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టడంపై బాధిత కుటుంబలు హర్షం వ్యక్తం చేశాయి. ఆ ముగ్గురు ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ హతం చేయటంతో తమకు కొంత న్యాయం జరిగిందని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను అంతం చేసిన భారత సైన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. గడిచిన మూడు నెలలుగా తాను ఎంత క్షోభను అనుభవిస్తున్నానో మాటల్లో చెప్పలేనని ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ గద్గద స్వరంతో చెప్పారు.
నువ్వు పహల్గాంకు ఎందుకు వెళ్లావు..? నువ్వు తప్పకుంట ఇంటికి తిరిగి రావాలి’ అని తాను తరచూ ఆయన ఫొటోతో మాట్లాడుతున్నానని మీడియా ప్రతినిధులతో చెబుతూ ప్రగతి జగ్దాలే ఏడ్చారు. ఆ ఉగ్రవాదుల అంతం న్యూస్ కోసం తాము ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఆ వార్త విన్నామని అన్నారు. ‘నా దగ్గర తుపాకీ ఎందుకు లేదు..? ఉంటే నేనే ఆ ఉగ్రవాదులను నా చేతులారా కాల్చి చంపేదాన్ని’ అని తాను తరచూ అనుకునేదాన్నని ప్రగతి జగ్దాలే తెలిపారు.ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం ఆపరేషన్ మహాదేవ్ కార్యకలాపాలను కొనసాగించాలి." అని వారు తెలిపారు. వారిని కనుగొనడం చాలా కష్టంగా ఉన్నందున ఇది గర్వకారణమైన క్షణం.
భారత సైన్యానికి ధన్యవాదాలు. ఈ రోజు నాకు ఉపశమనం కలిగింది. దీనిపై ఎటువంటి రాజకీయాలు ఉండకూడదు. నా సైన్యం మన దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్నందుకు నేను గర్వపడుతున్నాను." అని చెప్పుకొచ్చారు. పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 28 మంది మృతి చెందిన విషయం విదితమే. ఈ దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు తీవ్రవాదులను నిన్న మధ్యాహ్నం ఆపరేషన్ మహదేవ్ లో హతం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు పార్లమెంట్లో క్లారిటీ ఇచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pahalgam-25-203013.html
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.