అతి విధేయతా.. అభద్రతతో అనవసర రచ్చ

Publish Date:Jan 21, 2025

Advertisement

తెలుగుదేశం కూటమి పార్టీల కార్యకర్తల మధ్య ఇప్పుడు ఓ అనవసర రచ్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఎందుకో తెలియదు కానీ ఓ విధమైన అభద్రతా భావంలో ఉన్నారా అనిపించేలా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్ నేపథ్యంలో ఈ రచ్చ మొదలైంది. దీనిపై సవాళ్లు, ప్రతిసవాళ్లుగా రెండు పార్టీల క్యాడర్ మధ్య పరిస్థితి నెలకొంది. ముందుగా తెలుగుదేశం క్యాడర్ విషయానికి వస్తే లోకేష్ తన సమర్ధతను, తన రాజకీయ పరిణితిని నిర్ద్వంద్వంగా చాటుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆయనే నంబర్ 2 అందులో సందేహం లేదు. పార్టీ సీనియర్ నాయకులు నుంచి కింది స్థాయి క్యాడర్ వరకూ ఎవరికీ ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగుదేశం పార్టీకి మూడో తరం రాజకీయ వారసుడు ఆయనే అన్న విషయంలో కూడా భిన్నాభిప్రాయానికి చోటే లేదు. అటువంటప్పుడు నారా లోకేష్ ఉపముఖ్యమంత్రి కావాలన్న డిమాండ్ ఎందుకో అర్ధం కాదు.

ఇక ఇప్పుడు జనసేన విషయానికి వస్తే.. ఆ పార్టీ నేతలూ క్యాడర్ కూడా లోకేష్ ను చూసి భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది. అటువంటి భయాలు పూర్తిగా అర్ధరహితం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను లోకేష్ డామినేట్ చేస్తున్నారనీ, ఉప ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోతుందనీ జనసేన కార్యకర్తల భయంగా కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో  జనసేన అధికార ప్రతినిథి రాయపాటి అరుణ స్పందించిన తీరు హుందాగా ఉంది. ఓ టీవీ డిబేట్ లో పాల్గొన్న ఆమె తెలుగుదేశం నుంచి నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్ లో తప్పేముందన్నారు. ఆ పార్టీ నాయకులు, క్యాడర్ లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిగా చూడాలని భావిస్తే తప్పేముంది.. జనసేన నాయకురాలిగా తాను పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలని కోరుకుంటున్నాను. ఇది తప్పు కానప్పుడు తెలుగుదేశం నారా లోకేష్ ను మరింత ఉన్నత స్థానంలో చూడాలని కోరుకోవడాన్ని ఎలా తప్పుపట్టగలమని ప్రశ్నించారు.

 తెలుగుదేశం నుంచి లోకేష్ ఉప ముఖ్యమంత్రి అన్న డిమాండ్ బయటకు రావడంతోనే జనసేనలో గాభరా మొదలైంది. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన జనసైనికులు కొందరు తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని కూలదోస్తాం, జగన్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.  అటువంటి వారందరికీ జనసేన అధికార ప్రతినిథి చక్కటి  సమాధానం ఇచ్చారు. జనసేన పార్టీకి పవన్ కల్యాణే సుప్రీం, అలాగే చంద్రబాబు తరువాతి స్థానం తెలుగుదేశంలో నిస్సందేహంగా లోకేష్ దే. కూటమి ప్రభుత్వం విషయానికి వచ్చే సరికి అది తెలుగుదేశం, జనసేనల సమష్టి వ్యవహారం. దీనిలో పార్టీల ప్రశక్తే లేదు. ఒక పార్టీ మరో పార్టీని డామినేట్ చేస్తుందనీ, ఒక నాయకుడి వల్ల మరో నాయకుడి ప్రాధాన్యత తగ్గుతుందన్న ఆందోళనలు అనవసరం.

తెలుగుదేశం, జనసేనల మధ్య ఇంత వరకూ ఎటువంటి పొరపొచ్చాలూ లేవు. ఇప్పుడు కూడా అటువంటి పొరపొచ్చాలకు తావీయవలసిన అవసరం లేదు. లోకేష్ కు తక్షణం ఎలివేషన్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకుంటే.. ఆ విషయాన్ని మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో చర్చించి, ఆయన అంగీకారంతోనే ఆ పని చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. జనం కూటమి ప్రభుత్వానికి ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలని పగ్గాలు అప్పగించారు. ఇటువంటి చిన్న చిన్న విషయాలలో అసవసర రచ్చ చేసుకుని రోడ్డున పడితే మసకబారేది ఆయా పార్టీల అధినేతల ప్రతిష్ఠే.  ఇక విషయానికి వస్తే ఈ విషయంలో తెలుగుదేశం నాయకులు ఒకింత అతి చేశారని చెప్పక తప్పదు. విధేయతా ప్రదర్శనలో ముందుండాలన్న భావనతోనే ఒకరు డిప్యూటీ సీఎం లోకేష్ అంటే మరి కొందరు మరో అడుగు ముందుకు వేసి సీఎం లోకేష్ అంటూ చేసిన అతే.. జనసేనలో గాభరాకు కారణమైందని చెప్పాలి. మొత్తానికి ఈ విషయంలో జనసేన, తెలుగుదేశంలు రెండూ ఒకింత అపరిపక్వతతోనే వ్యవహరించాయి. ఇప్పటికైనా సంయమనం పాటించి ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టడం అన్ని విధాలుగా మంచింది. 

By
en-us Political News

  
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్క‌డి నుంచి ఈ పార్టీ అంచ‌లంచ‌లుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గ‌తంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాస‌న రుచి చూప‌డంతో.. ఇప్పుడు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్ర‌స్తుతం అప్ర‌తిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.