అతి వ్యాయామం గుండెకు చేటు...

Publish Date:Mar 10, 2022

Advertisement

గుండె నొప్పిని వైద్య పరిభాషలో మాయో  కార్దియల్ ఇన్ ఫార్మన్ అంటారు. రక్త నాళాలలో ఉన్న అడ్డంకి కొన్ని సార్లు పగిలి పోయి కణాలన్నీ ఓక దానికి ఒకటి అతుక్కుని పోయి క్లాట్  అంటే రక్తం గడ్డ ఏర్పడుతుంది.దాంతో అడ్డంకి మరింత పెద్దదై రక్త నాళం పూర్తిగా మూసుకు పోతుంది. అలాంటి అప్పుడే గుండె పోటు వస్తుంది. అధిక ఒత్తిడి,ఎక్కువ వ్యాయామం చేయడం సాధారణంగా ఇందుకు కారణం గా అవుతున్నాయి. అని  అపోలో ఆసుపత్రికి చెందినప్రముఖ కార్దియలజీ డైరెక్టర్ డాక్టర్ ఎ శ్రీనివాస్ కుమార్ స్పష్టం చేసారు. ఈమేరకు తెలుగు వన్ హెల్త్ కు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో పేర్కొన్నారు.వ్యాయామం అతిగా చేయారాదని వ్యాయామాన్ని నె మ్మ్సదిగా మొదలు పెట్టి వేగం పెంచాలి. అదే విధంగా ఆపివేసే టప్పుడు వార్మప్ వ్యాయామాలు తప్పనిసరిఅన్నారు . ఈ సమయంలో గుండె తనపై ఒత్తిడిని సర్దుబాటు చేసుకుంటుంది ఒక్కసారి ఒత్తిడి పెడితే బేజారు అవుతారు.రీక్షలో ట్రోపోనిన్ పాజిటివ్ వస్తే గుండెలో సమస్య ఉందని అర్ధం. దీని తరువాత ఎకో చేస్తారు. గుండె కొట్టుకునే టప్పుడు దానిలో డ్యామేజి అయిన ఆభాగం సరిగా కదలదు అలా డ్యామేజి ని గుర్తిస్తారు అని డాక్టర్ ఎ శ్రీనివాస్ అన్నారు.ఇ సి జి,ఎకో ట్రోపోనిన్ నార్మల్ గా ఉంటె  ఇంకా అనుమానం ఉంటె థ్రెడ్ మిల్ పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలో ట్రేడ్ మిల్ పై నడిపిస్తూ ఇ సి జి రీడింగ్ చూస్తారు.

7౦ -8౦% బ్లాక్ ఉంటె దీనిలో తేడాలు కనిపిస్తాయి.దీనిలో పోజిటివ్ వస్తే బ్లాక్ ఎక్కడ ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోడానికి ఆంజియోగ్రామ్ చేయించాలి. సరిగ్గా ఖచ్చితమైన ఫలితం తెలియాలంటే కరోనరీ ఆంజియో గ్రామ్ పరీక్షే మేలు అని డాక్టర్ శ్రీనివాస్ సూచించారు.టి ఎం టి పరీక్షలో నెగెటివ్ వస్తే రిస్క్ ఫ్యాక్టర్ ను పరిగణలోకి తీసుకోవాలని టి ఎం టి లో నెగెటివ్ వచ్చినప్పుడు 9౦% నార్మల్ గానే ఉంటుంది. కాని బీపి,డయాబెటిస్ లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటె సిటి ఆంజియో గ్రామ్ చేయాల్సి వస్తుందని సిటీ అన్జియో గ్రామ్ నార్మల్ గా ఉంటె పరవాలేదని సిటీ ఆంజియో గ్రామ్ అబ్నార్మల్ గా ఉంటె సాధారణ అన్జియో గ్రామ్ చేయాల్సి వస్తుంది.అని డాక్టర్లు సూచించవచ్చని స్పష్టం చేసారు.ఆంజియో గ్రామ్ ను ఇప్పుడు డే కేర్  క్లినిక్ లోనే చేయవచ్చని అంటే పరీక్ష అయిన మూడు నాలుగు గంటలోనే ఇంటికి వెళ్లి పోవచని అన్నారు.ఇక్కడ కొన్ని అంశాలు రోగులు రోగితలూకు అటెండర్ లు కూడా తెలుసుకోవడం అవగాహన కలిగి ఉండాలని సూచించారు.ట్రేడ్ మిల్ వరకూ అన్ని పరీక్షలలోను నార్మల్ ఉండి గుండెలో సమస్య లేదేమో అనుకున్నప్పుడు అది నిర్ధారణ చేసుకోడం కొసం సిటి ఆంజియో గ్రామ్ ఇప్పుడు చేస్తారు.కేవలం గుండెపోటు మాత్రమే కాకుండా పల్మనరీ త్రాం బో ఎంబా లిజం పి టి ఇ అయో ర్టిక్ దిసేక్షన్ అంటే మహా ధమనిలో పగుళ్ళు సమస్యలు ఉన్నా సిటి ఆంజియో గ్రామ్ లో బయట పడే అవకాశం ఉంది.

చికిత్స తో పాటుగా...

పరీక్షలు చేయించిన తరువాత జబ్బు ఉన్నట్లు తేలితే దాని తీవ్రతను బట్టి చికిత్స చేయవచ్చని.అన్నారు. జబ్బు కొంచమే ఉంటె అంటే5౦% కన్నా తక్కువ బ్లాక్స్ మాత్రమే ఉంటె స్టాటిన్స్ మందుల ద్వారా సమస్య కాకుండా నివార్రించ వచ్చని 5౦ -7౦% బ్లాక్స్ ఉంటె బార్డర్ లైన్ లో ఉన్నారని అర్ధం అని శ్రీనివాస్ వివరించారు.అలాంటప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ సమస్య తీవ్రత ను అంచనా వేసి తదను గుణంగా చికిత్స్ చేయాల్సి ఉంటుందని ఒక బ్లాక్ 7౦% దాటితే తప్పనిసరిగా స్టెంట్ వేయాల్సి ఉంటుందని చికిత్స ఏదైనా దానితో పాటుగా మంచి ఆహారం తీసుకుంటూ యోగా వాకింగ్ లను జీవన శైలిలో భాగం చేసుకోవాలని .పొగ తాగడం లాంటి దురలవాట్లు కు స్వస్తి చెప్పి బిపి,షుగర్, ని నియంత్రించడం అవసరాని సూచించారు డాక్టర్ శ్రీనివాస్.

గుండె పోటు మళ్ళీ రాకుండా ఉండాలంటే...

ఇందుకోసం సెకండరీ ప్రివెన్షన్ గా కొన్ని మందులను ఇస్తారు.అడ్డంకి పెరగ కుండా స్టాటిన్ నివారిస్తుంది. కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది.ఆస్ప్రిన్ బీటా బ్లాకర్ బ్లాకార్స్ కూడా ఇస్తారు. ఎ సి ఇ ఇంహిబిట ర్స్ కూడా ఇస్తారు.

హార్ట్ బర్న్ గుండె నొప్పి ఒకటేనా ...

కొంత మందిలో అన్నం తినగానే కొన్ని సార్లు పొట్టపై భాగం లో చాతీ లో నొప్పిగా అసౌకర్యం గా అన్పిస్తూ ఉంటుంది. అది గ్యాస్ నొప్పి గా భావిస్తారు.పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు.కొన్ని సందర్భాలాలో అది గ్యాస్ కు సంబందించినదే కావచ్చు కానీ దీని వెనుక గుండె సమాస్య కూడా ఉండచ్చు అని డాక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. అన్నం తిన్న తరువాత జరిగే శోషణ ప్రక్రియ కోసం రక్తం పొట్ట వైపు ఎక్కువగా వస్తుంది.తద్వారా గుండెకు రక్త సరఫరా తగ్గి అసౌకర్యం ఏర్పడుతుందని డాక్టర్ శ్రీనివాస్ విశ్లేషించారు. ఈ రకమైన చాతీ నొప్పి ని పోస్ట్ ప్రాండియాల్ ఎంజైనా అని అంటారు.చాలా సందర్భాలలో దానిని గ్యాస్ నొప్పిగా ఏసీ డిటి పొరబడతారు.కాని కడుపు ఉబ్బరం గా కాకుండా ఛాతీలో అసౌకర్యం కలుగు తుంది అంటే అనుమానించాల్సిందే . ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ ను సంప్రదించాలని పోస్ట్ ప్రాండియాల్ ఎంజైనా ఉన్నప్పుడు సా ర్బిట్రేట్ మాత్ర నాలుక కింద పెడితే రిలీఫ్ వస్తుందని సూచించారు.ఇది ఒక రకంగా గుండె పోటుకు హెచ్చరిక లాంటిది గా భావించాలి రెండూ మూడు అయ్యిందంటే అది తీవ్రమై గుండె పోటుకు దారి తీస్తుందని .ఇలాంటి సమయం లో విశ్రాంతి గా కూర్చుని ఉన్న గుండేనొప్పి వస్తుంది.

అందుకే నిర్లక్షం చేయవద్దని అపోలో ఆసుపత్రికి చెందిన హృద్రోగ నిపుణులు డాక్టర్ ఎ శ్రీనివాస్ తెలుగు వన్ హెల్త్ కు తెలిపారు. ఆతి వ్యాయామం గుండె కు చేటు హృద్రోగ నిపుణులు శ్రీనివాస్ హెచ్చరిక.               
 

By
en-us Political News

  
కాల్షియం, ఐరన్ లోపం ఉందా? పాలు, పాల ఉత్పత్తుల విషయంలో కల్తీపై ఆందోళన ఉందా? అయితే మన ఇంట్లోనే సులభంగా లభించే ఒక ఆకుకూర మీ ఆహారంలో మంచి పోషక వనరుగా ఉపయోగపడవచ్చు.
ఐస్ క్రీమ్.. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. చాలామంది వర్షాకాలంలో కూడా ఐస్ క్రీమ్ తింటే ఆ కిక్కే వేరు అంటారు.  కాలం ఏదైనా ఐస్ క్రీమ్ పట్ల చాలా ఇష్టం ఉంటుంది.
చండీపురా వైరస్ (Chandipura Virus) ప్రస్తుతం ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న వైరస్‌లలో ఒకటి. ముఖ్యంగా 15 సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ వైరస్ తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. వర్షాకాలంలో దీని ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.
మనిషి  మెదడు చాలా శక్తివంతమైనది.  మనిషి మనుగడ సాగుతున్నది మెదడు పనితీరు మీదనే.. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి జీవితం అంత బాగుంటుంది.
మధుమేహం అనేది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒక ఆరోగ్య సమస్య, ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. జీన్స్ ప్రభావం, ఊబకాయం , జీవనశైలిలో మార్పులు వంటి కొన్ని ప్రమాద కారకాలు ఈ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.
అవిసె గింజలు (Flax Seeds) చిన్నవైనా ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో గొప్పది. ఆయుర్వేద నిపుణులు డా. చిట్టిభొట్ల మధుసూదన శర్మ ఈ వీడియోలో అవిసె గింజల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను సులభంగా వివరించారు.
ప్రతిరోజూ ఉదయం కేవలం 5 నుంచి 10 నిమిషాల పాటు భస్త్రిక ప్రాణాయామం చేస్తే శరీరానికి, మనసుకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
పిల్లలు తమ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో స్వేచ్ఛగా పంచుకుంటున్నారా? లేక కొన్ని విషయాలను దాచిపెడుతున్నారా? పిల్లలు తమ సమస్యలు, భయాలు, సందేహాలు, విజయాలు, అపజయాలు అన్నింటినీ తల్లిదండ్రులతో నమ్మకంగా చెప్పుకోవడం వారి మానసిక ఎదుగుదలకు ఎంతో అవసరం. 
పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రులకు ఎంతో ప్రత్యేకమైన మరియు పవిత్రమైన సందర్భం.
మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? తరచూ పెయిన్‌కిల్లర్ మాత్రలు వాడుతున్నారా? అయితే ఈ వీడియోను తప్పకుండా చూడండి.
రాత్రంతా పడుకుని ఉదయం నిద్ర లేవగానే చాలా తాజాగా, రిఫ్రెషింగ్ గా అనిపించాలి. కానీ చాలామందికి ఉదయం నిద్ర లేవగానే రిఫ్రెషింగ్ గా అనిపించదు.  
టెక్నాలజీ పెరిగే కొద్ది మనిషికి తెలియని, అంతుబట్టని ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.  కొన్ని పరిస్థితులను చాలామంది పెద్ద సమస్యలేమీ కాదులే అని లైట్ తీసుకుంటారు.
"పిల్లలకు డిప్రెషన్ వస్తుందా?" అనే ప్రశ్నకు చాలా మంది తల్లిదండ్రుల సమాధానం "రాదు" అనే ఉంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.