ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఔట్‌

Publish Date:Mar 22, 2025

Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల కాలంలో 50 వేల ఉద్యగాలు ఇచ్చింది’ ఈ మంత్రాన్ని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలు మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు’ రోజూ జపిస్తూనే ఉంటారు.  మరో వంక ఇందులో గత ప్రభుత్వం ఘాతాలోకి ఎన్ని పోతాయి,కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలోకి ఎన్ని వస్తాయి అనే చర్చ ఒకటి జరుగుతూనే వుంది. ప్రక్రియ మొత్తం పూర్తి చేసి,ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన, నియామాకాలను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఖాతాలో కలుపుకున్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మేము వండి సిద్ధం చేసిన వ్నకలను వడ్డించి క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. 
 ఇలా  అటు కారు పార్టీ, ఇటు హస్తం పార్టీ క్రెడిట్ మాదంటే మాదని వాదులాడుకోవడం కూడా రోజు చూస్తున్నదే. అందులో ఏది నిజం, ఏది అబద్ధం అనే విషయాన్ని పక్కన పెడితే, ఇప్పడు నిరుద్యోగ యువత కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంతన్న సర్కార్’ , ఉన్నదీ పోయింది ..ఇంకొకటీ పోయింది అన్నట్లు, కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. ఉన్న చిరుద్యోగాలను గుజుజునేందుకు సిద్డంమవుతోంది. ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఉద్వాసన చెప్పేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 
నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఏదో చెప్పలేని వ్యతిరేకత ఇబ్బంది ఉన్నట్లుది. బయటకు చెప్పినా చెప్పక పోయినా ప్రభుత్వ ఉద్యోగులు అంటే తెల్ల ఏనుగులు అనే అభిప్రాయం ఏదో ఆయనలో అంతర్లీనంగా ఉన్నట్లు కనిప్స్తోందని ఉద్యోగులు అంటున్నారు. అందుకే, ఆయన  రాష్ట్ర క్లిష్ట పరిష్టిలో ఉన్న ప్రస్తుత సమయంలో డిఏలు అడగకండి, ఫస్ట్ తేదేకి జీతాలు ఇవ్వడానికే, నెలనెల రిజర్వు బ్యాంకు ముందు చేయి చాచ వలసి వస్తోంది. సో ... మీ జీతాలు మీకు  ఇస్తున్నదుకు సంతోషించి, రోజుకో రెండు గంటలు ఎక్కువ పనిచేసి ప్రభుత్వ ఋణం తీర్చుకోండి,అన్నట్లు ఓ చిన్న చిరునవ్వుతో  చురక వేశారు. అలాగే, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించవలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్.కొండలా పెరిగి పోయాయి, ఎక్కడ నుంచి తేవాలి,అంటూ ప్రభుత్వ ఉద్యోగులకు తెలియకుండానే’ మరో చురక వేశారు.రిటైర్డ్ ఉద్యోగుల నోటికి తాళాలు కూడా వేశారు.సరే, ఉద్యోగులు, నిరుద్యోగ యువకులతో పెట్టుకుంటే ఏమవుతుందో మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంత అర్థమయ్యే ఉంటుంది. పంతుళ్ళు చెప్పే పాఠం పూర్తిగా అర్థం అయ్యేందుకు ఇంకొంత సమయం పడుతుంది కావచ్చును.    
అదలా ఉంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి’ కన్ను ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిపై పడిందని అంటున్నారు. దశలవారీగా ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిలో సగం మందిని తొలిగించేందుకు రంగం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 
అవును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం  పొదుపు చర్యల్లో వివిధ శాఖల్లో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న డీబీఏలను (డాటా బేస్‌ అడ్మినిస్ట్రేటర్‌) తొలిగించే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి, ఇప్పటికే,  వేర్వేరు శాఖల్లో సంబంధిత  ఏజెన్సీల ద్వారా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఉద్వాసనలు మొదలయినట్లు సమాచారం. ఒకేసారి, అందరికీ ఉద్వాస పలికితే, బాధిత యువత ఆందోళనకు దిగే అవకాశం ఉన్నందున గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడి కక్కడ, తమచేతికి మట్టి అంటకుండా, ఏజెన్సీల ద్వారా  కాగల కార్యం కానిస్తున్నట్లు తెలుస్తోంది.  మొత్తం 60 ప్రభుత్వ శాఖల్లో కలిపి, పీఆర్సీ నివేదిక ప్రకారం  1,20,367 మంది కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులున్నారు. ఇందులో  సగం మందిని ఇంటికి పంపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్దమయిందని అంటున్నారు.  
కాగా, కమర్షియల్‌ ట్యాక్స్‌ శాఖలో 75 మందిని తొలిగించడానికి లిస్టు సిద్ధం చేసియన్ నేపధ్యంలో, తమను ఉద్యోగాల నుంచి తొలిగించి, తమ కుటుంబాలను బజారుకు ఈడ్చవద్దని వేడుకుంటూఆ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. రవాణా శాఖలో మొదటి విడత కింద 62 మందిని తొలిగించడానికి లిస్టు సిద్ధం చేసినట్టు సమాచారం. కార్మిక శాఖలో ఇప్పటికే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల తొలిగింపు మొదలైనదని, కాంట్రాక్టు గడువు ముగిసిన ఉద్యోగుల కాల పరిమితి తిరిగి రెన్యూవల్‌ చేయకుండా ఇంటికి పంపిస్తున్నట్టు తెలిసింది. తాజాగా మరో 50 మంది ఉద్యోగుల తొలిగింపునకు నివేదిక రూపొందించినట్టు సమాచారం. ఎక్సైజ్‌ శాఖ, టీజీబీసీఎల్‌ నుంచి 80 మంది ఉద్యోగులను తొలిగించడానికి అధికారులు లిస్టు సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.
నిజానికి, తెలంగాణ ఉద్యమ సమయంలో,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ ఏర్పడిన తర్వాత  ఔట్‌ సోర్సింగ్‌’ అనేదే ఉండదని చాలా గట్టిగా నామం బలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రి హోదాలోనూ కేసీఆర్, ఔట్‌ సోర్సింగ్‌’, కాంట్రాక్టు ఉద్యోగులు అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని వాగ్దానం చేశారు. కొంత మందిని చేసారేమో కూడా, కానీ, ఇప్పడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అసలుకే ఎసరు తెచ్చిందని ఔట్‌ సోర్సింగ్‌’ ఉద్యోగులు ఆందోళన వ్యక్త పరుస్తునారు.

By
en-us Political News

  
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.