లష్కరే నేత సైఫుల్లా ఖలీద్ హతం..మరో ఎల్ఈటీ లీడర్ అమీర్ హంజాకి గాయం
Publish Date:May 22, 2025

Advertisement
వీటి వెనక తాలిబన్ల హస్తముందా?
సీఐఏ మాజీ ఏజెంట్ సారా ఆడమ్స్
మాటలను బట్టీ మనకేం తెలుస్తోంది?
ఏడాది కిందట సీఐఏ మాజీ ఏజంట్ సారా ఆడమ్స్ ఒక ఒక టాక్ షోలో . పాకిస్థాన్ లోని టెర్రరిస్టులే టార్గెట్ గా భారత్ ఒక ఆపరేషన్ చేపట్టబోతోంది. ఈ ఆపరేషన్ కి తాలిబన్లను వినియోగించనుందని అన్నారు. ఆర్ యూ సీరియస్? అంటూ ఆ ఇంటర్వ్యూయర్ ఆమెను అడగటం. ఆమె అవును నిజమని చెప్పడం జరిగింది. అక్కడ కట్ చేస్తే.. మొన్న సింధ్ ప్రావిన్స్ లోని మట్లీ పట్టణంలో తన ఇంటి నుంచి బయటకొచ్చిన సైఫుల్లా ఖలీద్ అనే లష్కరే తోయిబాకు చెందిన అగ్రనాయకుడ్ని గుర్తు తెలియని వ్యక్తులు తల, గుండెలపై కాల్చి పరారయ్యారు. దీంతో ఖలీద్ స్పాట్ డెడ్ అయ్యాడు.
ఎవరీ ఖలీద్ అని చూస్తే 2000లో నేపాల్ మాడ్యుల్ హెడ్, 2005 బెంగళూరు అటాక్, 2006 నాగ్ పూర్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ పై దాడి, 2008 యూపీ రాంపూర్ ఇలా వరుసగా జరిగిన లష్కరే ఆపరేషన్స్ కమాండర్. తాజాగా అతడు సింధ్ ప్రాంతంలోని లష్కరే ఆపరేషన్స్ కి హెడ్ గా హఫీజ్ సయీద్ ద్వారా నియమితుడయ్యాడు. అతడీ ఆపరేషన్స్ లో ఉండగా.. కాల్పులు జరగటం, అతడు ఖతం కావడం చకచక జరిగిపోయాయి.
తాజాగా అమీర్ హంజా అనే మరో లష్కరే వ్యవస్థాపక సభ్యుడి ఇంట్లో కాల్పులు జరగ్గా.. అతడికి గాయాలయ్యాయి. దీంతో లాహోర్ ఆస్పత్రిలో చేరాడు అమీర్ హంజా. ఇతడిది ఎలాంటి పాత్ర అంటే లష్కరే వ్యవస్థాపక సభ్యులు 17 మంది ఉండగా.. వారిలో చీఫ్ హఫీజ్ కి అత్యంత సన్నిహితుల్లోని ఒకరిద్దరిలో ఇతడు కూడా ఒకడు. ఇతడు ఉద్వేగభరిత ప్రసంగాలకు.. ఉత్తేజపూరితమైన రచనలకు పెట్టింది పేరు. మతమార్పిడిపై ఇతడు రాసిన పుస్తకం ఒక సంచలనం. ఐక్యరాజ్య సమితి గుర్తించిన అంతర్జాతీయ ఉద్రవాదుల్లో ఇతడు కూడా ఒకడు. అలాంటి వ్యక్తి రేపు మరణిస్తే హఫీజ్ సయీద్ కి మరింత పెద్ద ఎత్తున దెబ్బ తగలనుంది.
ఇప్పటికే మొన్నటి ఆపరేషనన్ సిందూర్ ద్వారా ముజఫరాబాద్ లో లష్కరే శిబిరం ధ్వంసమైంది. ఇందులో హఫీజ్ సయీద్ కొడుకు తల్హా సయీద్ అతడి ఐదుగురు కమాండర్లు హతమయినట్టు వార్తలొచ్చాయ్. వీరితో పాటు మరో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారన్న రిపోర్టులొచ్చాయి. వీరిలో ముగ్గురు లష్కరే నాయకులున్నారు. ఒక దశలో హఫీజ్ సయీద్ సైతం చనిపోయాడన్న కథనాలు వెలువడ్డాయ్. అయితే ఈ దిశగా అధికారిక ప్రకటనలేవీ లేవు. మొత్తంగా లష్కరేకి ఆపరేషన్ సిందూర్ తోనే పెద్ద ఎత్తున నష్టం జరిగింది. తాజాగా కాల్పుల ఘటనలో ఖలీద్ చనిపోవడం, అమీర్ హంజా ఆస్పత్రిపాలుకావడంతో.. ఆపరేషన్ ఎల్ఈటీ ఏదైనా నడుస్తోందా? అంటే అందుకు సారా ఆడమ్స్ ఏడాది కిందట చేసిన వ్యాఖ్యల పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే ఔనని చెప్పక తప్పదు.
భారత్, ఆఫ్గన్ మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు బాగా మెరుగయ్యాయి. గత ఏడాదికాలంగా ఖైబర్ పంక్తుక్వా సరిహద్దు ప్రాంత విషయంలో పాకిస్తాన్- ఆఫ్గనిస్తాన్ దేశాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం చోటు చేసుకుంది. దానికి తోడు భారీ ఎత్తున ఆఫ్గన్ శరణార్దులను పాకిస్థాన్ ఇరకాటంలో పెట్టింది. దీంతో ఆఫ్గనిస్థాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం పాకిస్థాన్ అంటేనే మండిపడుతోంది. గతంలో తాలిబాన్లు ఆఫ్గనిస్తాన్ ని ఆక్రమించుకున్నపుడు పాకిస్థాన్ ఐఎస్ఐ చీఫ్ తో సహా.. చాలా మంది కాబూల్ చేరి.. అక్కడ సంబరాలు చేసుకున్నారు. ఆనాటి వాతావరణం ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య ఉన్నట్టు కనిపించడం లేదు.
ఇక్కడ మోడీ ఒక పక్క పహెల్గాం దాడి ప్రతీకారం తీర్చుకునే దిశగా సైన్యానికి ఇవ్వాల్సిన స్వేచ్ఛనిస్తూనే మరొక పక్క ఆఫ్గాన్ తలుపు తట్టారు. మోడీ నుంచి పెద్ద ఎత్తున దాడి జరగటం ఖాయమని భావించిన పాక్ తన ఉగ్రవాదులను బంకర్లలోకి పంపడం, తన దళాలను సరిహద్దులకు తరలించడంలో బిజీగా ఉంటే మన భారత ప్రతినిథి తాలిబాన్ విదేశాంగ మంత్రి ముత్తాకిని కలిశారు. ఈ దిశగా మాకు మీ సహాయ సహకారాలు కావాలని కోరారు.
అప్పటికే ఆఫ్గనిస్థాన్ ప్రభుత్వ ప్రతినిథి పహల్గాం దాడిని ఖండించారు. బాధిత కుటుంబాలకు మా సానుభూతి ప్రకటించారు. ఈ క్రమంలో భారత్- ఆఫ్గాన్ సంబంధాలు మెరుగుపడుతున్నాయి. అదే సమయంలో పాక్- ఆఫ్గన్ సంబంధ బాంధవ్యాలు క్షీణిస్తున్నాయి. ఇటు భారత్ తో సానుకూలంగా వ్యవహరిస్తోన్న తాలిబాన్లు.. అటు బలూచిస్తాన్ లిబరేష్ ఆర్మీకి కూడా తమ సహాయ సహకారాలను అందిస్తూ పాకిస్థాన్ని తీవ్ర ఇరకాటంలో పెడుతున్నారు. పాకిస్థాన్- చైనాతో చెలిమి చేస్తుంటే భారత్- ఆఫ్గన్ తో స్నేహానికి సై అంటోంది. దీని ద్వారా పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోన ఉగ్రవాదుల పీచమణచడానికి సరికొత్త ఆపరేషన్ కి తెరలేపినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ ఆగదు అంటే ఇదే మరి అంటున్నారు పరిశీలకులు. తాలిబాన్ల సాయంతో ఆపరేషన్ సిందూర్ నిరంతరాయంగా కొనసాగుతుందనీ, ఉగ్రవాదుల ఊచకోత చేస్తూనే వెళ్తుందని.. సీఐఏ స్థాయి వ్యక్తులు అన్న మాటలకు అసలైన అర్ధం నిర్వచనం ఇదేనంటున్నారు దౌత్య వ్యవహారాల నిపుణులు.
http://www.teluguone.com/news/content/operation-sindoor-continue-with-talibas-help-39-198450.html












