లక్ష గొంతుల హనుమాన్ చాలీసా.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్
Publish Date:Aug 16, 2020

Advertisement
హనుమాన్ లక్ష గళ పారాయణ భారతస్వతంత్ర దినోత్సవం నాడు ఇంటర్నెట్ లో జూం ద్వారా జరిగింది. శ్రీ కూచిభొట్ల ఆనంద్ గారి సారధ్యం లో సిలికానాంధ్ర చేసిన మరో మహా సంకల్పం ఈ కార్యక్రమం. 50 పైగా దేశాలనుండి భారతీయులు పాల్గొన్నారు. పిన్న పెద్దా వయోభేదం లేకుండా గొంతు కలిపి ఒక అద్భుతం సృష్టించారు. ఇంతమంది ఒకేసారి హనుమాన్ చాలీసా అంతర్జాలం లో పారాయణం చేయడం ఒక సాంకేతిక విశేషం కూడా! ఈ విశేషమైన కార్యక్రమాన్ని రూపొందించినది సిలికానాంధ్ర! కూచిపూడి నృత్యం నించి, అన్నమయ్యలక్ష గళార్చన నించి నేటి దాక మొత్తం 10 గిన్నిస్బుక్ వరల్డ్ రికార్డ్లు సాధించిన సిలికానాంధ్ర కోవిడ్ ని ఎదుర్కునే మనో బలానికి, సామాజిక, స్థైర్యానికి, శాంతికి ఇటువంటి మనో ఉద్యమాన్ని ప్రారంభించారు.
ఈ ప్రపంచప్రజాదరణ పొందిన కార్యక్రమంలో అనేక దేశాల వారు ముక్త కంఠంతో హనుమంతుణ్ణి కీర్తించగా దీంట్లో రాష్ట్ర, కేంద్ర మంత్రులు, వైద్యులు, న్యాయవాదులు, కళాకారులుఇంకా ఎన్నో రంగాలవారు భాషాభేదం లేకుండా పాల్గొని విజయవంతం చేసారు. జల శక్తి శాఖా మంత్రిగజేంద్ర సింగ్ షెఖావత్ ప్రసంగిస్తూ, త్వరలో ప్రపంచం కోవిడ్ బారినుండి బయటపడాలని అన్నారు. హనుమత్ శక్తి అందరికీ ఆశీస్సులిస్తుందని అనడమే కాక వారు కూడ చాలీసాపారాయణలో పాల్గొన్నారు. వారణాసి నించి ప్రసిద్ధ సంకట మోచన హనుమాన్ దేవాలయ ప్రధాన అర్చకులు, ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఆధ్యాత్మిక వేత్తలు, సాధు సత్పురుషులు కూడా అందరితో పాల్గొనిదీనికి శోభ తెచ్చారు.
ఈ కార్యక్రమానికి అనేకమంది కార్యకర్తలు, భక్తులునిరంతరం నెలల తరబడి పని చేసారు. కోవిడ్ లో లాక్ డౌన్ లొ ఉన్న అనేకమంది భక్తులకు ఇదిఒక చేతనా స్ఫూర్తి గా దీన్ని రూపొందించారు. సిలికానాంధ్ర ఆధ్వర్యంలో దిలీప్ కొండిపర్తి, రాజుచమర్తి,మధు బాబు ప్రఖ్య, ప్రియ తనుగుల, సాయి కందుల, జ్యోతిచింతలపూడి,స్నేహ వేదుల, మాదబూషి రాజా, గిరిజ లొల్ల, ప్రవీణ్గుబ్బల తదితరులు కీలక పాత్ర వహించారు. మురహరి దేవబత్తిని ఈ అనితర సాధ్యమైన టెక్నాలజిరూపొందిచారు. అశోక్ బడ్డి ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించగా అనేకమంది ఒక తపస్సు గా సహాయం చేశారు. శ్రీ ఆనంద్ కూచిభొట్లనిజ జీవన సేవ విశిష్టతను చెపుతూ ఈ కార్యక్రమం దైవ శక్తి, మానవ శక్తికలిపిన మహ చైతన్యం గా, సిలికానాంధ్ర తమ సేవలు సంజీవిని హాస్పిటల్ ద్వారా కూచిపూడి, ఇంకాపక్కనున్న అనేక గ్రామాలలో కోవిడ్ బాధితులకు, సేవలకు వినియోగిస్తున్నాం అన్నారు. అందరిని అట్టి సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు.
ప్రముఖ వైద్యులు, దాతశ్రీ లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారు మాట్లాడుతూ మంచి పనుల వెనక తామెప్పుడూ ఉన్నాం అని, హనుమత్శక్తి కోసం,రామ మందిరం వృద్ధి కోసం తమలాంటి వారు ఎన్నో చేయాలనుకుంటున్నారని చెప్పారు. బలం, బుద్ధి, పరాక్రమంమూర్తీభవించిన శక్తి హనుమాన్ శక్తి, అది మన అందరికి కావాలి అని భారత జలశక్తిశాఖా మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ గారు అన్నారు. శ్రీ గంగపురం కిషన్ రెడ్డి గారు, మినిస్టర్ ఆఫ్స్టేట్ ఫర్ హోం మాట్లాడుతూ సిలికానాంధ్ర భారత సనాతన ధర్మాన్ని భావి తరాలకి అందిస్తోందిఅని అన్నారు.
ప్రయాగ్ నుండి స్వామి ఆనంద్ గిరి మాట్లాడుతూ ఇది సిలికానాంధ్ర అందరి తరపునాకరోనా మహమ్మారి నుంచి రక్షించేందుకు చేసిన అద్భుత అనుష్ఠానం అన్నారు. శ్రీ మిశ్రా, మహంత్, సంకటమోచన హనుమాన్ దేవాలయం కాశి నుండి మాట్లాడుతూసంకటములను నివారించే స్వామి హనుమంతుడే అని సాక్షాత్ తులసిదాస్ చెప్పారు అన్నారు. సిలికానాంధ్రవిశ్వ సంకల్పాన్ని ఆశీర్వదించారు. మధు ప్రఖ్యా మాట్లాడుతూ రామ నామం రాళ్ళనైన తేలికచెస్తుంది,వారధి గా మారుస్తుంది, రామ నామాన్ని మంచి మనసుతో మన సమస్యలమీద రాద్దాం,కరోనాని జయిద్దాం అన్నారు.
కార్యక్రమానికి ప్రియ తనుగుల సమన్వయ కర్తగా ఉండి మహాకార్యక్రమానికి దివ్య శోభను చేకూర్చారు. ఏ. వీ. యస్. రావ్ గారు, జాయింట్డైరక్టర్ ఆఫ్ రైల్వేస్, సుప్రీం కోర్ట్ సీనియర్ అడ్వోకేట్ శ్రీమోహన్ పరాశరన్ గారు ఇందులో పాల్గొన్నారు. ఆయన తండ్రి గారు శ్రీ కేశవ పరాశరన్ గారు రామజన్మభూమి తీసుకొచి విజయం సాధించిన న్యాయవాది. ఇలా ఎందరో ప్రముఖులతో శక్తివంతం గా ఆబాలగోపాలం తో లక్ష మంది పైగా కలిసిన ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లలోకి మరో సారి ఎక్కి భారతీయులంతా గర్వపడేలా చేసింది.
http://www.teluguone.com/news/content/one-lakh-people-made-world-record-by-singing-hanuman-chalisa-25-102861.html












