లక్ష గొంతుల హనుమాన్ చాలీసా.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్

Publish Date:Aug 16, 2020

Advertisement

హనుమాన్ లక్ష గళ పారాయణ భారతస్వతంత్ర దినోత్సవం నాడు ఇంటర్నెట్ లో జూం ద్వారా జరిగింది. శ్రీ కూచిభొట్ల ఆనంద్ గారి సారధ్యం లో సిలికానాంధ్ర చేసిన మరో మహా సంకల్పం ఈ కార్యక్రమం. 50 పైగా దేశాలనుండి భారతీయులు పాల్గొన్నారు. పిన్న పెద్దా వయోభేదం లేకుండా గొంతు కలిపి ఒక అద్భుతం సృష్టించారు. ఇంతమంది ఒకేసారి హనుమాన్ చాలీసా అంతర్జాలం లో పారాయణం చేయడం ఒక సాంకేతిక విశేషం కూడా! ఈ విశేషమైన కార్యక్రమాన్ని రూపొందించినది సిలికానాంధ్ర! కూచిపూడి నృత్యం నించి, అన్నమయ్యలక్ష గళార్చన నించి నేటి దాక మొత్తం 10 గిన్నిస్బుక్ వరల్డ్ రికార్డ్లు సాధించిన సిలికానాంధ్ర కోవిడ్ ని ఎదుర్కునే మనో బలానికి, సామాజిక, స్థైర్యానికి, శాంతికి  ఇటువంటి మనో ఉద్యమాన్ని ప్రారంభించారు. 

 

ఈ ప్రపంచప్రజాదరణ పొందిన కార్యక్రమంలో అనేక దేశాల వారు ముక్త కంఠంతో హనుమంతుణ్ణి కీర్తించగా దీంట్లో రాష్ట్ర, కేంద్ర మంత్రులు, వైద్యులు, న్యాయవాదులు, కళాకారులుఇంకా ఎన్నో రంగాలవారు భాషాభేదం లేకుండా పాల్గొని విజయవంతం చేసారు. జల శక్తి శాఖా మంత్రిగజేంద్ర సింగ్ షెఖావత్ ప్రసంగిస్తూ, త్వరలో ప్రపంచం కోవిడ్ బారినుండి బయటపడాలని అన్నారు. హనుమత్ శక్తి అందరికీ ఆశీస్సులిస్తుందని అనడమే కాక వారు కూడ చాలీసాపారాయణలో పాల్గొన్నారు. వారణాసి నించి ప్రసిద్ధ సంకట మోచన హనుమాన్ దేవాలయ ప్రధాన అర్చకులు, ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఆధ్యాత్మిక వేత్తలు, సాధు సత్పురుషులు కూడా అందరితో పాల్గొనిదీనికి శోభ తెచ్చారు.  

 

ఈ కార్యక్రమానికి అనేకమంది కార్యకర్తలు, భక్తులునిరంతరం నెలల తరబడి పని చేసారు. కోవిడ్ లో లాక్ డౌన్ లొ ఉన్న అనేకమంది భక్తులకు ఇదిఒక చేతనా స్ఫూర్తి గా దీన్ని రూపొందించారు. సిలికానాంధ్ర ఆధ్వర్యంలో దిలీప్ కొండిపర్తి, రాజుచమర్తి,మధు బాబు ప్రఖ్య, ప్రియ తనుగుల, సాయి కందుల, జ్యోతిచింతలపూడి,స్నేహ వేదుల, మాదబూషి రాజా, గిరిజ లొల్ల, ప్రవీణ్గుబ్బల తదితరులు కీలక పాత్ర వహించారు. మురహరి దేవబత్తిని ఈ అనితర సాధ్యమైన టెక్నాలజిరూపొందిచారు. అశోక్ బడ్డి ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించగా అనేకమంది  ఒక తపస్సు గా సహాయం చేశారు. శ్రీ ఆనంద్ కూచిభొట్లనిజ జీవన సేవ విశిష్టతను చెపుతూ ఈ కార్యక్రమం దైవ శక్తి, మానవ శక్తికలిపిన మహ చైతన్యం గా, సిలికానాంధ్ర తమ సేవలు సంజీవిని హాస్పిటల్ ద్వారా కూచిపూడి, ఇంకాపక్కనున్న అనేక గ్రామాలలో కోవిడ్ బాధితులకు, సేవలకు వినియోగిస్తున్నాం అన్నారు. అందరిని అట్టి సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు. 

ప్రముఖ వైద్యులు, దాతశ్రీ లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారు మాట్లాడుతూ మంచి పనుల వెనక తామెప్పుడూ ఉన్నాం అని, హనుమత్శక్తి కోసం,రామ మందిరం వృద్ధి కోసం తమలాంటి వారు ఎన్నో చేయాలనుకుంటున్నారని చెప్పారు. బలం, బుద్ధి, పరాక్రమంమూర్తీభవించిన శక్తి హనుమాన్ శక్తి, అది మన అందరికి కావాలి అని భారత జలశక్తిశాఖా మంత్రి శ్రీ  గజేంద్ర సింగ్ షెఖావత్ గారు అన్నారు. శ్రీ గంగపురం కిషన్ రెడ్డి గారు, మినిస్టర్ ఆఫ్స్టేట్ ఫర్ హోం మాట్లాడుతూ సిలికానాంధ్ర భారత సనాతన ధర్మాన్ని భావి తరాలకి అందిస్తోందిఅని అన్నారు. 

 

ప్రయాగ్ నుండి స్వామి ఆనంద్ గిరి మాట్లాడుతూ ఇది సిలికానాంధ్ర అందరి తరపునాకరోనా మహమ్మారి నుంచి రక్షించేందుకు చేసిన అద్భుత అనుష్ఠానం అన్నారు. శ్రీ మిశ్రా, మహంత్, సంకటమోచన హనుమాన్  దేవాలయం కాశి నుండి మాట్లాడుతూసంకటములను నివారించే స్వామి హనుమంతుడే అని సాక్షాత్ తులసిదాస్ చెప్పారు అన్నారు. సిలికానాంధ్రవిశ్వ సంకల్పాన్ని ఆశీర్వదించారు. మధు ప్రఖ్యా మాట్లాడుతూ రామ నామం రాళ్ళనైన తేలికచెస్తుంది,వారధి గా మారుస్తుంది, రామ నామాన్ని మంచి మనసుతో మన సమస్యలమీద రాద్దాం,కరోనాని జయిద్దాం అన్నారు. 

 

కార్యక్రమానికి ప్రియ తనుగుల సమన్వయ కర్తగా ఉండి మహాకార్యక్రమానికి దివ్య శోభను చేకూర్చారు. ఏ. వీ. యస్. రావ్ గారు, జాయింట్డైరక్టర్ ఆఫ్ రైల్వేస్, సుప్రీం కోర్ట్ సీనియర్ అడ్వోకేట్ శ్రీమోహన్ పరాశరన్ గారు ఇందులో పాల్గొన్నారు. ఆయన తండ్రి గారు శ్రీ కేశవ పరాశరన్ గారు రామజన్మభూమి తీసుకొచి విజయం సాధించిన న్యాయవాది. ఇలా ఎందరో ప్రముఖులతో శక్తివంతం గా ఆబాలగోపాలం తో లక్ష మంది పైగా కలిసిన ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లలోకి మరో సారి ఎక్కి భారతీయులంతా గర్వపడేలా చేసింది.

By
en-us Political News

  
ఫోన్ ట్యాపింగ్ విచార‌ణాధికారులైన డీసీపీ విజ‌య్ కుమార్, ఏసీపీ వెంక‌ట‌గిరి  ప్రభాకరరావును విచారించడంలో కొత్త టెక్నిక్ వాడుతున్నారు.  
శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్‌కతా మీదుగా ముంబైకి బయలుదేరిన మ ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులను అత్యవసరంగా దించేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ కేసులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సాక్షిగా వాంగ్మూలం ఇవ్వనున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం (జూన్ 17) ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ ఎటీజీహెచ్ గెస్ట్ హౌస్ వరకూ సాగింది.
మాజీ మంత్రి హరీశ్‌రావుకు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో సికింద్రాబాద్‌ సన్‌ సైన్‌ ఆసుపత్రిలో హరీశ్‌రావు చేరారు
అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలయ్యారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హాజరైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనంతరం నేరుగా తెలంగాణ భవన్ చేరుకున్న మాజీ మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకు పోయిన వందలాది మంది మన విధ్యార్ధులను మన విదేశాంగ శాఖ ఆ దేశంతో దౌత్య పరమైన చర్చలు జరిపి, మన విధ్యార్ధులను సురక్షితంగా స్వదేశానికి తీసుకు వచ్చింది.
వైసీపీ మాజీ మంత్రి మాజీ మంత్రి పేర్నినానికి బిగ్ షాక్ తగిలింది. నూజీవీడు కోర్టు ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఫార్ములా-ఈ కార్‌ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు అధికారులు ఆయనను విచారించారు.
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపటి నుంచి రైతుల అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,034 రైతు వేదికల్లో రైతునేస్తం’కార్యక్రమం ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటన కోసం ఉపయోగించే హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇదే హెలికాప్టర్ ను రాష్ట్రపర్యటనలో కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ కోసం కేటాయించారు. ఆయన తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు సోమవారం (జూన్ 16) హెలికాప్టర్ వినియోగించాల్సి ఉంది.
వైయస్సార్ కడప జిల్లాలో అరుదైన పుట్టగొడుగు కనిపించింది. పుట్టగొడుగులు మామూలుగా అయితే దాని బరువు 50 గ్రాములులేదా మహా అంటే వంద గ్రాముల లోపే ఉంటాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.