తిరుమలలో అక్టోపస్ కమాండోల మాక్ డ్రిల్‌!

Publish Date:Jun 24, 2026

Advertisement

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్త జనసందోహంతో కిక్కిరిసి ఉంటుంది. దేశం నలుమూలల నుంచేన కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరమలేశుని దర్శనానికి వస్తుంటారు.  నిత్యం లక్షలమంది అలరారే ఈ పవిత్ర క్షేత్రంలో భద్రత   కీలకం. తిరుమల కొండలపై అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా భద్రతా బలగాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటాయి. ఇందులో భాగంగానే  తిరుమలలో మంగళవారం (జూన్ 23) రాత్రి ఉగ్రవాద నిరోధక ప్రత్యేక దళం అక్టోపస్ మాక్ డ్రిల్  నిర్వహించింది.  తిరుమల భద్రత లక్ష్యంగా ఈ మాక్ డ్రిల్ సాగింది.  

ఒకవేళ ఉగ్రవాదులు తిరుమలలోకి చొరబడి, కీలకమైన ప్రాంతాలను లేదా భక్తులను తమ అధీనంలోకి తీసుకుంటే వారిని ఎలా మట్టుబెట్టాలనే అంశంపై ఈ మాక్ డ్రిల్ నిర్వహించింది ఆక్టోపస్.. అత్యాధునిక  ఆయుధాలు ధరించిన   45 మందికి పైగా అక్టోపస్ కమాండోలు ఈ  మాక్ డ్రిల్ లో పాల్గొన్నారు. తిరుమలలోని   వెంకటాద్రి నిలయం వద్ద   ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. కమాండోల హఠాత్తు ఎంట్రీ, పొజిషన్స్ తీసుకోవడం, వ్యూహాత్మకంగా ముందుకు కదలడం చూసి అక్కడున్న భక్తులు మరియు స్థానికులు అసలు ఏం జరుగుతుందో తెలియక  ఖంగారు పడ్డారు. ఆందోళన చెందారు.  తరువాత విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

ఈ మాక్ డ్రిల్ లో  అక్టోపస్ దళాలు  అనుమానిత ఉగ్రవాదులుగా నటించిన సిబ్బందిని క్షణాల వ్యవధిలో అధీనంలోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో  టీటీడీ  విజిలెన్స్ విభాగం,   ఆంధ్రప్రదేశ్ సివిల్ పోలీస్  సమన్వయంతో సహకరించాయి.  తిరుమలలో  అక్టోపస్ మాక్ డ్రిల్ వీడియోలు,  ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో   ట్రెండ్ అవుతున్నాయి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, అత్యాధునిక గన్స్ ధరించిన కమాండోల గంభీరమైన లుక్స్ నెటిజన్లను  ఆకట్టుకుంటున్నాయి.  మాక్ డ్రిల్ సందర్భంగా వెంకటాద్రి నిలయం వద్ద ఆంక్షలు విధించారు. 

By
en-us Political News

  
మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా ఈ దీక్షా వస్త్రాన్ని ధరించి దీక్ష చేపట్టారు. కే తన గురువు నుంచి మంత్రోపదేశం పొందిన నాటి నుండి పవన్ కల్యాణ్ వారాహి దీక్షను ఏటా చేపట్టడం ఒక సంప్రదాయంగా పాటిస్తూ న్నారు. ఏటా జ్యేష్ఠ మాసంలో దీక్ష ప్రారంభించి, కార్తీక మాసంలో విరమిస్తారు.
ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే భారతీయ యువతకు అలర్ట్. వర్క్ అండ్ హాలిడే సబ్‌క్లాస్ 462 వీసా బ్యాలెట్ రిజిస్ట్రేషన్‌కు ఈరోజే ఆఖరి గడువు. వయోపరిమితి, ఫీజు మరియు అర్హతల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
226 మంది ప్రజాప్రతినిధుల మొత్తం ఆస్తుల విలువ అక్షరాలా 26 వేల 47 కోట్ల రూపాయలుగా తేలింది. దీని ప్రకారం లెక్కగడితే, సభలోని ఒక్కో రాజ్యసభ ఎంపీ సగటు ఆస్తి విలువ 15 కోట్లకు పైమాటే. మొత్తం సభ్యులలో 31 మంది ఎంపీలు అంటే దాదాపు 14 శాతం మంది ప్రజాప్రతినిధులు 100 కోట్లకు పైగా వ్యక్తిగత ఆస్తుల ఉన్నవారే.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో సరికొత్త ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 3, ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్ 2 మరియు ఎయిర్‌పాడ్స్ 4 లపై ఎన్నడూ లేని విధంగా భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అద్భుతమైన ఫీచర్లు, ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
భారతదేశంలో యూపీఐ (UPI) చెల్లింపులు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. నెలకు రూ. 20 లక్షల కోట్ల లావాదేవీలతో ఫోన్‌పే, గూగుల్ పే సృష్టించిన సంచలనాలు మరియు గ్లోబల్ మార్కెట్లో యూపీఐ క్రేజ్ గురించిన పూర్తి వివరాలు మీకోసం.
వివాహం తర్వాత మీ ఆధార్ కార్డులో భార్య లేదా భర్త పేరును అప్‌డేట్ చేయాలనుకుంటున్నారా? కేవలం ₹50 ఫీజుతో మై ఆధార్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో పేరు మార్చుకునే పూర్తి విధానం, అవసరమైన డాక్యుమెంట్ల వివరాలు మీకోసం
నిఫ్టీ 50 ఇండెక్స్ తొలిసారిగా 24,000 మార్కును తాకి రికార్డు సృష్టించింది. ఈ ఆల్-టైమ్ హై మార్కెట్‌లో మీ మ్యూచువల్ ఫండ్ ఎస్‌ఐపీ (SIP)లను ఆపాలా వద్దా? నిపుణులు సూచిస్తున్న పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్సింగ్ టిప్స్ మరియు పన్నుల పూర్తి వివరాలు మీకోసం
అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలోపేతం కావడం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలతో భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు. ఎంసీఎక్స్ లేటెస్ట్ రేట్ల పూర్తి వివరాలు మీకోసం.
ఆన్‌లైన్ మరియు డిజిటల్ మోసాల బాధితులకు ఊరటనిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త రూల్స్ తెచ్చింది. మోసం జరిగిన 5 రోజుల్లోగా బ్యాంక్ మరియు 1930 హెల్ప్‌లైన్ కు ఫిర్యాదు చేస్తే గరిష్టంగా ₹25,000 వరకు పరిహారం పొందవచ్చు. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఆర్‌బీఐ న్యూ డిజిటల్ ఫ్రాడ్ కాంపెన్సేషన్ రూల్స్, షాడో రివర్సల్ పాలసీ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై 113 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఎలిసె పేరి హాఫ్ సెంచరీతో రాణించగా, పాక్ జట్టు 86 పరుగులకే ఆలౌట్ అయింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హెర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఈ సంక్షోభానికి తెరపడటంతో.. భారతదేశానికి పెద్ద ఊరట . లభించిందనే చెప్పాలి.
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్, బంగ్లాదేశ్ మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. సెమీస్ రేసులో నిలవాలంటే హర్మన్‌ప్రీత్ సేన ఈ మ్యాచ్‌లో భారీ రన్‌రేట్‌తో గెలవడం తప్పనిసరి. మ్యాచ్ వివరాలు, బలాబలాలు ఇక్కడ చూడండి.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే, టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ వివరాలు. వన్డేల్లో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ హవా నడుస్తుండగా, టెస్టుల్లో జో రూట్ అగ్రస్థానంలో నిలిచారు. పూర్తి పాయింట్ల పట్టిక ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.