Publish Date:May 10, 2024
ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశానిది ఒక ప్రత్యేక శైలి. భిన్నత్వంలో ఏకత్వం అనే లక్షణం భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ప్రత్యేకంగా నిలిచేలా చేసింది. ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో మన భారతదేశ పౌరులు విభిన్నగంగా వుంటారు. ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో కొంతమంది పద్ధతి చాలా బాధని కలిగిస్తూ వుంటుంది. అదే సమయంలో ఓటు హక్కుని వినియోగించుకునే విషయంలో కొంతమంది కమిట్మెంట్ ఆనందాన్ని కలిగిస్తూ వుంటుంది. ఒక మైనస్ బాధిస్తే, మరో ప్లస్ దాన్ని బేలన్స్ చేస్తూ వుంటుంది. ఈ రెండు భిన్నత్వాలు కలిసి వుంది కాబట్టే మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం వున్న దేశంగా అయింది.
చాలామంది ఓటర్లు ఓటు వేయాలంటే వాళ్ళకి డబ్బు ఇవ్వాలి. ఎన్నెన్నో తాయిలాలు ఆశ చూపించాలి. స్వర్గాన్ని కిందకి దించుతామని హామీలు ఇవ్వాలి.. అప్పుడుగానీ కొంతమంది ఓటు వేయడానికి ఇళ్ళలోంచి బయటకి కదలరు. ఇంత చేసినా ‘మనం ఓటు వేయకపోతే ఏం జరుగుతుందిలే’ అని ఊరుకునేవాళ్ళూ వుంటారు. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశమేనా అనే సందేహం వచ్చేలా చేస్తారు. ఇలాంటివారు నిరాశ కలిగిస్తే, మరికొంతమంది ఉత్సాహం కలిగిస్తారు. ఓటు వేయడం కోసం దూర ప్రాంతాల నుంచి సొంత ప్రాంతాలకు తరలి వస్తారు. ఆ దూర ప్రాంతాలు విదేశాలు అయినా సరే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగుతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ఓటు వేయడం కోసం అనేకమంది విదేశాల నుంచి కూడా తరలి వస్తున్నారు. అలా వస్తున్న భరతమాత ముద్దుబిడ్దలతో విజయవాడ విమానాశ్రయి క్రిక్కిరిసిపోతోంది. విమానాశ్రయానికి వెళ్ళే రోడ్లు వందలాది కార్లతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇలాంటి ఓటర్లను చూసినప్పుడు మన భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఢోకా లేదని అనిపిస్తూ వుంటుంది. ఓటు వేయడం కోసం భారీ సంఖ్యలో ఎన్నారైలు తరలి వస్తున్నారని, ఇంకో మూడు రోజులపాటు విజయవాడ విమానాశ్రయాలు కిటకిటలాడుతూనే వుంటాయని విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nri-voters-came-for-voting-39-175587.html
ఎన్నికల ఫలితాల తర్వాత చాలామంది వైసీపీ నాయకులు జైలుకు వెళ్ళడం ఖాయంలా కనిపిస్తోంది. అలా చిప్పకూడు తినే వైసీపీ నాయకులలో మొట్టమొదటి స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి వుండబోతున్నారు.
నాలుగు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గాలలో తెలుగుదేశం వినా మరో జెండా ఎగిరిందే లేదు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ఆ రెండు నియోజకవర్గాలూ తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలుగానే ఉన్నాయి.
అబ్ కీ బార్ 400 బాహర్ అనే నినాదంతో సార్వత్రిక ఎన్నికల బరిలో దిగిన బిజెపి తెలంగాణలో డబుల్ డిజిట్ సాధిస్తుందని వివిధ ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. అయితే కౌంటింగ్ కు 24 గంట ముందు రెండు ప్రముఖ ఎగ్జిట్ పోల్ సర్వేల్లో మాత్రం హైదరాబాద్ లోకసభ బిజెపి కైవసం చేసుకుంటుందని వెల్లడైంది.
పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తున్న జగన్ పార్టీకి సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది.
కొన్ని శక్తులు పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని తపస్సు చేస్తున్నాయి.
వైసీపీ నుంచి అధికార పగ్గాలు చేజారిపోతున్నాయనడానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లుగా తన మౌఖిక ఆదేశాలతో పోలీసు శాఖను ఉరుకులు పరుగులు పెట్టించిన సజ్జలపై తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పు పట్టింది.
కల్వకుంట్ల కవిత ఇప్పుడప్పుడే జైలు నుంచి బయటకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం తీహార్ జైల్లో వున్న కవిత రిమాండ్ని జులై 3వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ ను పూర్తిగా తిరస్కరించారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగిలిన దాఖలాలు లేవు. విభజన తరువాత జరిగిన తొలి రెండు ఎన్నికలలోనూ జీరో స్థానాలతో రిక్త హస్తాలతో మిగిలిన పార్టీ.. 2024 ఎన్నికలలో మాత్రం రాష్ట్రంలో పూర్వ వైభవం కోసం కాకపోయినా.. ఉనికి చాటుకోవడానికి చాలా చాలా కష్టపడింది.
తెలంగాణ సాధించిన పార్టీగా పదేళ్ల పాటు రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు పరిపూర్ణంగా పతనమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది చివరిలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పరాజయంతో ప్రారంభమైన బీఆర్ఎస్ పతనం లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత పరిపూర్ణమౌతుందని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితం ఎలా ఉండబోతోందో సంకేతాలిచ్చేశాయి. ఇక మంగళవారం (జూన్ 4) అధికారికంగా ఫలితాలు వెల్లడి అవుతాయి.
తెలుగుదేశం కేడర్ తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకుంది. గత పదేళ్లుగా తెలంగాణలో పార్టీ దాదాపు నామమాత్రపు కార్యక్రమాలకే పరిమితమైనా, పార్టీ తరఫున పదవులు, హోదాలు అనుభవించిన నేతలు గోడ దూకేసి పక్క పార్టీలకు వలస వెళ్లిపోయానా.. క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.