Publish Date:May 10, 2024
ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశానిది ఒక ప్రత్యేక శైలి. భిన్నత్వంలో ఏకత్వం అనే లక్షణం భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ప్రత్యేకంగా నిలిచేలా చేసింది. ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో మన భారతదేశ పౌరులు విభిన్నగంగా వుంటారు. ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో కొంతమంది పద్ధతి చాలా బాధని కలిగిస్తూ వుంటుంది. అదే సమయంలో ఓటు హక్కుని వినియోగించుకునే విషయంలో కొంతమంది కమిట్మెంట్ ఆనందాన్ని కలిగిస్తూ వుంటుంది. ఒక మైనస్ బాధిస్తే, మరో ప్లస్ దాన్ని బేలన్స్ చేస్తూ వుంటుంది. ఈ రెండు భిన్నత్వాలు కలిసి వుంది కాబట్టే మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం వున్న దేశంగా అయింది.
చాలామంది ఓటర్లు ఓటు వేయాలంటే వాళ్ళకి డబ్బు ఇవ్వాలి. ఎన్నెన్నో తాయిలాలు ఆశ చూపించాలి. స్వర్గాన్ని కిందకి దించుతామని హామీలు ఇవ్వాలి.. అప్పుడుగానీ కొంతమంది ఓటు వేయడానికి ఇళ్ళలోంచి బయటకి కదలరు. ఇంత చేసినా ‘మనం ఓటు వేయకపోతే ఏం జరుగుతుందిలే’ అని ఊరుకునేవాళ్ళూ వుంటారు. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశమేనా అనే సందేహం వచ్చేలా చేస్తారు. ఇలాంటివారు నిరాశ కలిగిస్తే, మరికొంతమంది ఉత్సాహం కలిగిస్తారు. ఓటు వేయడం కోసం దూర ప్రాంతాల నుంచి సొంత ప్రాంతాలకు తరలి వస్తారు. ఆ దూర ప్రాంతాలు విదేశాలు అయినా సరే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగుతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ఓటు వేయడం కోసం అనేకమంది విదేశాల నుంచి కూడా తరలి వస్తున్నారు. అలా వస్తున్న భరతమాత ముద్దుబిడ్దలతో విజయవాడ విమానాశ్రయి క్రిక్కిరిసిపోతోంది. విమానాశ్రయానికి వెళ్ళే రోడ్లు వందలాది కార్లతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇలాంటి ఓటర్లను చూసినప్పుడు మన భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఢోకా లేదని అనిపిస్తూ వుంటుంది. ఓటు వేయడం కోసం భారీ సంఖ్యలో ఎన్నారైలు తరలి వస్తున్నారని, ఇంకో మూడు రోజులపాటు విజయవాడ విమానాశ్రయాలు కిటకిటలాడుతూనే వుంటాయని విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nri-voters-came-for-voting-25-175588.html
రిజల్ట్స్ కౌంట్డౌన్ కొటేషన్-1
ఇంతకాలం అమెరికాలో వుండి జగన్ భజన చేయడమే కాకుండా, తెలుగుదేశం నాయకులను కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతూ వస్తున్న ‘పంచ్ ప్రభాకర్’ ఇప్పుడు జగన్ని తిట్టడం ప్రారంభించాడు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ మరోసారి జైలు పాలయ్యారు. బెయిల్ పై బయటకొచ్చి ఆయన ప్రజా మద్దత్తు ఉంటే మళ్లీ జైలుకు వెళ్లనని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ పాత్ర కీలకమే అయినప్పటికీ పదేళ్ల తర్వాత ఆయన స్థితి పూర్తిగా దిగజారిపోయింది. పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ కెసీఆర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది.
తెలంగాణ రాష్ట్రం దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న శుభవేళ రాష్ట్ర మంతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ని ‘తెలంగాణ జిన్నా’ అని అభివర్ణించారు.
హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్కి బంధం నేటితో తెగిపోనుంది..
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఎపి కూడా నైరుతి రుతు పవనాలు రానున్నాయని సంకేతాలు అందుతున్నాయి.
ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలతో పల్నాడు అట్టుడికి పోయింది. ముఖ్యంగా మాచర్లలో అల్లర్లు దేశం యావత్ దృష్టికి వచ్చాయి. మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎం ను ధ్వంసం చేసి వార్తల్లో వ్యక్తి అయ్యారు.
ప్రత్యేక తెలంగాణ బిల్లు కాంగ్రెస్ పెడితే బిజెపి ఆమోదించింది. పదేళ్ల తర్వాత జరుపుకుంటున్న తెలంగాణ అవతరణ దినోత్సవాలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. మెజారిటీ మార్కుకు అవసరమైన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఏకగ్రీవంగా పది స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. 33 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినట్లు ఈసీ ప్రకటించింది.
వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. నేటి అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీలను పెంచుతున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్ హెచ్ఐఏ) ప్రకటించింది.
ఎపిలో త్రి కూటమి విజయం తథ్యమని ముందు నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో బోణి కొట్టిన బిఆర్ఎస్
నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన బిఆర్ఎస్ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బోణి కొట్టింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు రెండు రోజుల ముందు వచ్చిన ఫలితాల్లో గులాబి జెండా రెపరెపలాడటం అధికార పార్టీకి మింగుడు పడటం లేదు.