ఇక టీఆర్ఎస్ నుంచీ జంప్ జిలానీలు

Publish Date:Apr 26, 2022

Advertisement

దాదాపు 9 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు వర్గ విభేదాలు ఆ పార్టీని చీకాకు పెడుతున్నాయా అంటే అవుననే అనాలి. పలు జిల్లాల్లో పార్టీ నేతల మధ్య విభేదాలు ఆయా జిల్లాల్లో పార్టీని చీకాకు పరుస్తున్నాయి. అంతే కాకుండా ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఆయా నియోజకవర్గాలలో సిట్టింగులకు, సీటు ఆశిస్తున్న ఆశావహులకు మధ్య పొసగడం లేదు. దీంతో అసమ్మతీయులు పక్క చూపులు చూస్తున్నారు. అటువంటి వారిని అక్కున చేర్చుకోవడానికి రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు సిద్ధంగా ఉన్నాయి. తెరాస అసమ్మతి వాదులకు తలుపులు బార్లా తెరిచి ఉంచాయి. దీంతో ఇప్పటి వరకూ ఇతర పార్టీల నుంచి తెరాసలోకి వచ్చి చేరడమన్న పరిస్థితి ఇక ముందు తెరాస నుంచి వలసలుగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

గతంలో ఎన్నడూ లేని విధంగా తెరాసలో ధిక్కార స్వరం వినిపించడమే ఇందుుక నిదర్శనమని చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిస్థితిని వారు ఉదహరిస్తున్నారు. తాండూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్సీల మధ్య విభేదాల పరిష్కారం పార్టీ అధినేత వల్ల కూడా కాకపోవడమే ఇందుకు నిదర్శనమంటున్నారు.  ఈ ఇరువురిలో ఒకరు పార్టీ మారే విషయంపై త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. తాండూరు సిట్టింగ్ ఎమ్మెల్యే  ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిల మధ్య విభేదాలు తెలిసిందే. అయితే ఇటీవల ఇరువురి మధ్యా సంబంధాలు మరింతగా దెబ్బతిన్నట్లు వరుస సంఘటనలను బట్టి అర్ధమౌతుంది. రానున్న ఎన్నికలలో తాండురు నుంచి పార్టీ ఎమ్మెల్యేగా పోటీలో ఉండేది తానేనని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బహిరంగంగానే చెప్పుకుంటుండటంతో విషయాన్ని హై కమాండ్ దగ్గరకు తీసుకు వెళ్లారు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. దీంతో పార్టీ అధినేత ఇరువురతో మాట్లాడినా పరిస్థితితో మార్పు రాలేదు. దీంతో ఎమ్మెల్యే కినుక వహించినట్లు చెబుతున్నారు. 
అలాగే ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలలో కూడా ఆశావహులు, సిట్టింగ్ ల మధ్య పెద్దగా పొసగడం లేదంటున్నారు. ఖమ్మం జిల్లాలో తుమ్మల ఇప్పటికే అలకపాన్పు ఎక్కారు. ఆయన ఎప్పుడైనా పార్టీ మరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా  వచ్చే ఎన్నికల సమయానికి టీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉండే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం జరగనుంది.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.