Publish Date:Jul 19, 2025
వైసీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీ ఆదివారం ( జులై 20) సత్తెన పల్లి పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసు నిబంధనలను ఉల్లంఘించి మరీ జన సమీకరణ చేశారనే ఆరోపణలపై విడదల రజినిపై సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించే పోలీసులు రజనీకి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల మేరకు ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంది.
జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఆయన కారు కింద పడి ఒక వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున జనసమీకరణ చేయడం ద్వారా ప్రజల ఆస్తులకు నష్టం కూడా వాటిల్లిందని పేర్కొంటూ.. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి పోలీసులు మొత్తం 113 మంది వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలా నోటీసులు అందుకున్న వారిలో పలువురు ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు విడదల రజనీ వంతు వచ్చింది. ముందుముందు మరింత మందిని పోలీసులు విచారించే అవకాశం ఉంది. వరుస కేసులు అరెస్టులతో వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రభయాందోళనలకు గురౌతున్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టు జరిగింది. ఇప్పుడిక విడదల రజని వంతు వచ్చిందన్న అభిప్రాయం వైసీపీ శ్రేణులలోనే వ్యక్తం అవుతోంది.
విడదల రజనీపై జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నిబంధనల ఉల్లంఘన కేసు మాత్రమే కాకుండా పలు అవినీతి కేసులు కూడా ఉన్నాయి. పల్నాడు జిల్లా యడ్లపాడులో స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2 కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేశారనే కేసులో ఇప్పటికే విడదల రజిని మరిదిని పోలీసులు అరెస్టు చేశారు. ఆరోపణలపై ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు ఈ కేసులో విడదల రజని, అప్పటి విజిలెన్స్ అధికారి జాషువా, రజిని పీఏ రామకృష్ణలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో రెంటపాళ్ల కేసులో రజనీని అరెస్టు చేయడం అంటూ జరిగితే.. వరుస పీటీవారెంట్లతో ఆమె సుదీర్ఘకాలం కటకటాల వెనుకే ఉండేలా పోలీసులు వ్యూహాత్మకంగా సాగుతున్నారని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/now-it-is-vidadala-rajini-turn-25-202312.html
మంత్రి పదవి విషయంలో మనుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్పై మంత్రి వెంకట్ రెడ్డి స్పందించారు.
సికింద్రాబాద్ సృష్టి షెర్టిలిటీ కేసు ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత కస్టడీ విచారణ ముగిసింది. గాంధీ ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
దేశంలో పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం మరోసారి ఎమ్మెల్యే పదవి రాజీనామాకు సిద్ధమని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఏంటీ జగన్ మోహన రెడ్డి ఇప్పటి వరకూ తనపై ఉన్న 31 కేసులలో 3452 సార్లు.. వాయిదాలు తీసుకుని ప్రపంచ రికార్డు సృష్టించారా? ఇందుకోసంగానూ ఆయన 6904 కోట్ల రూపాయల మేర ఖర్చు చేశారా? ఆశ్చర్యం కలిగిస్తున్నా.. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. బేసిగ్గా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన ఐదేళ్ల పదవీ కాలంలో .. సీఎంగా తన హోదా కారణంగా బిజీబిజీ అంటూ వాయిదాల మీద వాయిదాలు తీసుకున్నసంగతి తెలిసిందే.
బంజారాహిల్స్లోని రోడ్డు నంబర్ 1/12లో రోడ్డు కుంగిపోయింది. అటు వచ్చిన వాటర్ ట్యాంకర్ ఒక్కసారిగా దిగబడిపోయింది. దీంతో వాటర్ ట్యాంకర్ డ్రైవర్తో పాటు క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి.
మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై దీర్ఘకాలంగా సాగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమపై ఉన్న క్రిమినల్ కేసును క్వాష్ చేయాలని కోరుతూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం అనుమతించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై డిపాజిటర్ల నుంచి ఎటువంటి అభ్యంతరం, ఆరోపణా లేకపోవడంతో కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది.
ఋతుపవన ద్రోణి, బంగాళాఖాతం లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి.
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ పట్టణంలో క్లౌడ్ బరస్ట్ ధాటికి కొండ చరియాలు విరిగిపడ్డాయి. వరద ప్రవాహంతో వందలాది ఇళ్లను ముంచేంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయ్యింది. ఈ విషయాన్ని సీబీఐ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేయడంతో.. ఇప్పడు చర్చ ఈ కేసులో కీలక నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిపైకి మళ్లింది.
తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరంటారు. ఏదీ మన చేతుల్లో ఉండదు. మరణం ఎప్పుడు, ఎలా రాసిపెట్టి ఉంటుందో చెప్పలేం. పెద్ద పెద్ద ప్రమాదాల బారిన పడి కూడా ప్రాణాలతో బయటపడే వారుంటారు.